Sunday 6 December 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-అల్లుడితో భోజనం….

అల్లుడితో భోజనం….......continue at కష్టేఫలే


రోజుకో పద్యం.

నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రునింట గూరిమితోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ.

ఒంటరిగా మార్గంలో ప్రయాణం చెయ్యకు. శత్రువు ఇంటిలో భోజనం చెయ్యకు. ఇతరుల ధనాన్ని ఆశించి మూటకట్టకు. ఇతరుల మనసు నొచ్చేలా మాటాడకు.

ఒకప్పుడు ఒంటరిగా ప్రయాణం భయం కలిగించేదే! ఇప్పటికీ అలాగే ఉన్నట్టుంది. శత్రువని తెలిసి ఆ ఇంటిలో మిత్రుడనుకుని భుజించకు, ప్రమాదం. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళి దుర్యోధనుడు ఇస్తానన్న విందు స్వీకరించలేదు. ఆ రాత్రికి విదురిని ఇంటికే వెళ్ళాడు. విదురునికి (మంత్రి) జీతమెంటో తెలుసా, రోజుకి రెండు శేర్లు పిండి. ఇది తెలిసీ కృష్ణుడు ఆ ఇంట ఆతిధ్యం తీసుకున్నాడు. ఇతరుల ధనం, మనది కాదు, తెలిసి దానిని దాచుకోవాలని ప్రయత్నం ప్రమాదమే తెచ్చిపెడుతుంది,నిప్పును కొంగున కట్టుకున్నట్టే, ఉదాహరలు కోకొల్లలు. ఇతరుల మనసు నొచ్చుకునేలా మాటాడకు, అకార కలహం మంచిదికాదు, ఇదెప్పుడో ప్రమాదం తెచ్చి పెడుతుంది, అప్పుడు ఏడిచి ఉపయోగంఉండదు,వ్యర్ధం. 

No comments:

Post a Comment