Sunday 14 November 2021

చెఱువైన వరి చేను.


 తూర్పు గోదావరి జిల్లాలో గతవారంగా చిన్న చినుకు పడుతూనే ఉంది. నేటికీ తగ్గలేదు,ఒరుపివ్వ లేదు. కోసిన చేలలో పనలు తేలుతున్నాయి. కోయవలసిన చేలు కోయక్కర లేదు, కుళ్ళుతున్నాయి, నీట మునిగి. రైతు పూర్తిగా మునిగిపోయాడు. కోసిన చేను చెఱువైతే గుండె చెఱువైన  ఒక రైతు వ్యధ.

రాబోయేది పున్నమి సముద్రం పోటు మీదే ఉంటుంది. నీరు లాగదు, చేళు పూర్తిగా కుళ్ళిపోవడం ఖాయం.