లా వొక్కింతయు/ లావొక్కింతయు
లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబుల్
ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
రావే యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!
లా వొక్కింతయు/ లావొక్కింతయు
లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబుల్
ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
రావే యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!
భయం
*ఇది హాస్యం కాదు…🙏*
*దయచేసి చదవండి, మీకు నచ్చితే ఇతరులతో కూడా పంచుకోండి!*
### *!!! అల్ట్రా-మాడరన్ మెడికల్ సైన్స్ !!!*
*డా. అనన్యా సర్కార్ రచన*
మీకు రెండు లేదా మూడు రోజుల పాటు జ్వరం వచ్చింది. మందులు తీసుకోకపోయినా, మీ శరీరం కొన్ని రోజుల్లోనే స్వయంగా కోలుకుంటుంది..
కానీ మీరు డాక్టర్ను సంప్రదించారు.
డాక్టర్ మొదటినుంచే పలు టెస్టులు రాసేశారు.
పరీక్షల్లో జ్వరానికి స్పష్టమైన కారణం కనపడలేదు.
కానీ కొద్దిగా కొలెస్ట్రాల్ మరియు షుగర్ లెవల్స్ పెరిగినట్టు చూపించాయి — ఇవి చాలా మందిలో సాధారణంగా ఉండే విషయాలే.
జ్వరం తగ్గిపోయింది.
కానీ ఇప్పుడు మీరు కేవలం జ్వరంతో ఉన్న వ్యక్తి కాదు.
డాక్టర్ మీకు చెప్పారు:
> "మీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. షుగర్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది. అంటే మీరు ప్రీ-డయబెటిక్. మీరు కొలెస్ట్రాల్ మరియు షుగర్ కంట్రోల్ చేసే మందులు వాడటం మొదలుపెట్టాలి."
దీనితో పాటు అనేక ఆహార నియమాలు విధించబడ్డాయి.
మీరు ఆహార నియమాలను కచ్చితంగా పాటించకపోయినా — మందులు తీసుకోవడం మాత్రం మరిచిపోలేదు.
మూడు నెలలు గడిచాయి. టెస్టులు మళ్లీ జరిగాయి.
కొలెస్ట్రాల్ కొద్దిగా తగ్గింది.
కానీ ఇప్పుడు మీ *బీపీ* కొంచెం పెరిగిపోయింది.
ఇంకో మందు వచ్చేసింది.
ఇప్పుడు మీరు *మూడు మందులు* వాడుతున్నారు.
ఇవన్నీ విని మీకు *ఆందోళన* పెరిగింది.
> “ఇంకా ఏమి జరుగుతుంది?”
> ఈ టెన్షన్ వల్ల మీరు *నిద్రలేమి*తో బాధపడడం మొదలుపెట్టారు.
> డాక్టర్ *నిద్ర మాత్రలు* రాసేశారు — ఇప్పుడు మందుల సంఖ్య *నాలుకైంది*.
ఈ మందుల వలన మీకు *అమ్లత (acidity)* మరియు *జ్వాల (heartburn)* మొదలయ్యాయి.
డాక్టర్ చెప్పారు:
> “ఆహారానికి ముందు ఖాళీ కడుపుతో గ్యాస్ టాబ్లెట్ తీసుకోండి.”
> ఇప్పుడు మీ మందుల సంఖ్య *ఐదు*.
ఆరు నెలల తర్వాత ఒకరోజు మీకు *ఛాతీలో నొప్పి* వచ్చి ఎమర్జెన్సీకి వెళ్లారు.
పూర్తి చెకప్ చేసిన తర్వాత డాక్టర్ చెప్పారు:
> “మీరు సమయానికి వచ్చారు, లేకపోతే పరిస్థితి తీవ్రమయ్యేది.”
మరిన్ని టెస్టులు అవసరమయ్యాయి.
వెరిఫై చేసిన తర్వాత డాక్టర్ చెప్పారు:
> “ప్రస్తుతం ఉన్న మందులు కొనసాగించండి. కానీ గుండె కోసం ఇంకో రెండు మందులు వేసుకోవాలి. అలాగే ఎండోక్రినాలజిస్ట్ను కలవండి.”
> ఇప్పుడు మీరు *ఏడు మందులు* వాడుతున్నారు.
కార్డియాలజిస్ట్ సలహాతో, మీరు ఎండోక్రినాలజిస్ట్ను కలిశారు.
ఆయన ఇంకో *షుగర్ మందు* మరియు *థైరాయిడ్ టాబ్లెట్* చేర్చారు — ఎందుకంటే థైరాయిడ్ లెవల్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.
ఇప్పుడు మొత్తం *తొమ్మిది మందులు*.
ఇలా మీరు నెమ్మదిగా మీరు అనారోగ్యంతో ఉన్నవారని నమ్మడం ప్రారంభించారు:
* గుండె రోగి
* డయాబెటిక్
* నిద్రలేమి బాధితుడు
* గ్యాస్ సమస్యలు
* థైరాయిడ్
* కిడ్నీ సమస్యలు
... ఇంకా చాలానే
ఎవ్వరూ మీకు చెప్పలేదు — మీరు మెరుగైన *మనోబలం, ఆత్మవిశ్వాసం మరియు జీవనశైలితో* ఆరోగ్యంగా ఉండవచ్చని.
అదే బదులుగా, మీకు పదే పదే చెప్పబడింది — మీరు తీవ్రమైన రోగి, బలహీనుడు, విఫలమైన వ్యక్తి అని.
ఆరు నెలల తర్వాత ఈ మందుల దుష్ఫలితాల వలన మీకు *మూత్ర సంబంధిత సమస్యలు* మొదలయ్యాయి.
అదనంగా టెస్టులు చేశారు — *కిడ్నీ సమస్యలు* ఉన్నట్టు అనుమానం వ్యక్తమైంది.
డాక్టర్ మరిన్ని టెస్టులు చేశారు. రిపోర్ట్ చూసిన తర్వాత చెప్పారు:
> “క్రియాటినిన్ లెవల్స్ కొద్దిగా పెరిగాయి. కానీ ఆందోళన అవసరం లేదు — మీరు మందులు క్రమంగా తీసుకుంటే సరిపోతుంది.”
> ఇప్పుడు ఇంకో *రెండు మందులు* చేర్చారు.
ఇప్పుడు మీరు *పదకొండు మందులు* తీసుకుంటున్నారు.
మీరు ఇప్పుడు ఆహారంకంటే *ఎక్కువ మందులు* తీసుకుంటున్నారు, మరియు ఆ మందుల దుష్ప్రభావాల వలన మీరు *మెల్లగా మరణం వైపు* నడుస్తున్నారు.
ప్రారంభంలో, మీరు జ్వరంతో డాక్టర్ను కలిసినప్పుడు, ఆయన ఇలా చెప్పి ఉంటే ఎలా ఉండేది?
> "ఎటువంటి భయం అవసరం లేదు. ఇది తేలికపాటి జ్వరమే. మందుల అవసరం లేదు. విశ్రాంతి తీసుకోండి, ఎక్కువగా నీళ్లు తాగండి, తాజా పండ్లు మరియు కూరగాయలు తినండి, ఉదయం వాకింగ్కి వెళ్లండి — అంతే. మందులేమీ అవసరం లేదు."
*కానీ అలా అయితే… డాక్టర్లకు మరియు ఫార్మా కంపెనీలకు ఆదాయం ఎలా వస్తుంది?*
---
### ముఖ్యమైన ప్రశ్న:
*డాక్టర్లు హై కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు అని ఎలా నిర్ణయిస్తారు?*
*ఈ ప్రమాణాలను ఎవరు నిర్ణయిస్తారు?*
ఈ విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం:
* *1979లో, డయాబెటిస్ గా పరిగణించే బ్లడ్ షుగర్ లెవల్ **200 mg/dl*.
అప్పట్లో ప్రపంచ జనాభాలో కేవలం *3.5%* మాత్రమే టైప్-2 డయాబెటిక్గా గుర్తించబడ్డారు.
* *1997లో, ఇన్సులిన్ తయారీ సంస్థల ఒత్తిడితో, ఈ పరిమితి **126 mg/dl*కి తగ్గించబడింది.
దీంతో డయాబెటిక్ జనాభా \\*3.5% నుండి 8%\\కి పెరిగింది — అంటే **4.5% మంది అసలైన లక్షణాలు లేకుండానే రోగులుగా మారిపోయారు*.
*1999లో*, WHO దీనిని అధికారికంగా ఆమోదించింది.
ఇన్సులిన్ కంపెనీలు భారీ లాభాలు ఆర్జించాయి. మరిన్ని ఫ్యాక్టరీలు నెలకొల్పాయి.
* *2003లో, **అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ADA)* ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్ను *100 mg/dl*గా పేర్కొంది — దీన్ని ప్రీ-డయాబెటిక్గా తీసుకున్నారు.
దాంతో *27% జనాభా డయాబెటిక్గా మారిపోయారు* — ఎటువంటి అసలు కారణం లేకుండానే.
* ప్రస్తుతం ADA ప్రకారం, *భోజనం తర్వాత బ్లడ్ షుగర్ 140 mg/dl* అయినా డయాబెటిస్ గా పరిగణిస్తున్నారు.
దీని వల్ల ప్రపంచ జనాభాలో *సుమారు 50% మంది* డయాబెటిక్ లు అయిపోయారు — కానీ వారిలో చాలామంది వాస్తవానికి ఆరోగ్యంగా ఉన్నవారే.
భారత ఫార్మా కంపెనీలు దీన్ని ఇంకా తగ్గించే ప్రయత్నంలో ఉన్నాయి — అంటే *HbA1c 5.5%* అని స్టాండర్డ్ పెట్టాలని చూస్తున్నారు, తద్వారా మరింత మందిని రోగులుగా మలచి మందుల అమ్మకాలు పెంచడం.
చాలా నిపుణుల అభిప్రాయం ప్రకారం *HbA1c 11% వరకు* కూడా డయాబెటిస్గా పరిగణించాల్సిన అవసరం *లేదంటారు*.
---
### మరో ఉదాహరణ:
*2012లో, ఒక పెద్ద ఫార్మా కంపెనీకి *\$3 బిలియన్** జరిమానా వేసింది *US సుప్రీం కోర్టు*.
2007–2012 మధ్యకాలంలో వారి డయాబెటిస్ మందు *గుండెపోటు వచ్చే అవకాశాన్ని 43% పెంచింది* అనే ఆరోపణ.
ఆ కంపెనీ ఇది ముందుగానే *తెలుసుకుని కూడా దాచేసింది* — లాభాల కోసమే.
ఆ సమయంలో వారు *\$300 బిలియన్* లాభం పొందారు.
---
*ఇదే ఈరోజు “అధునాతన వైద్య విధానం”!*
*ఆలోచించండి… ఆలోచించడం మొదలుపెట్టండి…*
---
✅ ఇది తప్పక భద్రపరచదగిన విషయం.
🧏♂️🧏♀️
*అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి — ఇదే నా మనస్ఫూర్తి కోరిక.
Courtesy:Whatsapp.
భయం మన శరీరంలోకి నరనరానా కొద్దికొద్దిగా ఎక్కించబడింది. మనదైన వైద్యాన్ని పోగొట్టుకున్నాం, చేతులారా నాశనం చేసుకున్నాం!
పేకాట పేకాటే పెద్దన్నయ్య....
పేకాట పేకాటే, పెద్దన్నయ్య పెద్దన్నాయే. ఈ నానుడిని తెనుగునాట విరివిగానే చెబుతారు.దీన్నే తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అనీ చెబుతారు. పేకాటలో కూచున్నాకా ఓడిపోతే ఓకులు లెక్కపెట్టి డబ్బులివ్వను, నేను అన్ననురా/తమ్ముణ్ణి అనడానికి లేదు. ఇచ్చి తీరవలసిందే. అదేదో పేకాటలో కూచునే ముందే తేల్చుకోవాలి. దీన్నే మరో ముతక సామెతగా చెబుతారు మా పల్లెటూరివాళ్ళు 'మంచం ఎక్కేదాకానే వరస, మంచం ఎక్కేకా వరసేంటి?' అంచేత పేకాటకి బంధుత్వానికి లింక్ పెట్టద్దు.
ఇదీ భారతం నుంచి వచ్చిందే! జూదానికి పిలిచినప్పుడు వెళ్ళక తప్పదు, వెళ్ళి జూదం లో కూచున్నాకా అన్నీ ఓడిపోయాడు. జరగవలసినవన్నీ జరిగిపోయాకా, గుడ్డి రాజుగారు ఇదంతా తూచ్! అనేసి వరాలిచ్చేసి పంపించేసేడు. మళ్ళీ జూదంలోనూ ఓడిపోయిన పాండవులు అడవులకు పోయారు. రాజ్య భాగం గురించిన మాట షరతుల్లో లేదు. వనవాసం తరవాత రాజ్య భాగమడిగితే సూది మొన మోపినంత కూడా ఇవ్వనన్నాడు,దుర్యోధనుడు. 'రాజ్యం వీర భోజ్యం' కనక యుద్ధం జరిగింది. గెలిచినవాళ్ళు రాజ్యం చేసుకున్నారు. ఇదిప్పటికిన్నీ జరుగుతున్నదే!
నేటికాలానికి ఈ నానుడిని వ్యాపారం వ్యాపారమే, వ్యవహారం వ్యవహారమే అని చెబుతుంటారు. రష్యాతో వ్యాపారం చేసేవాళ్ళకి పన్నులు పెంచేస్తామని అమెరికా,యూరోపియన్ యూనియన్ దేశాలు చెబుతున్నాయి. ఇదేంటి మీరు రష్యాతో వ్యాపారం చేస్తున్నారు,మమ్మలిని వద్దనడం,కాదని చేసిన వాళ్ళకి పన్నులు పెంచుతాం. ఇదేం వ్యాపారం? ఇది వ్యాపారం కాదు, వ్యవహారానికి లింకు. రష్యాని యూక్రెయిన్ తో యుద్ధం మానుకోమని చెప్పండి మేమూ చెబుతాం. కాదు మేము రష్యాతో వ్యాపారం చేసినవాళ్ళకి పన్నులు పెంచుతామని బెదిరించి రుబాబులు చేసి రోజులు గడుపుకునే కాలం చెల్లింది. రుబాబులు చెయ్యకండి వ్యాపారం వ్యాపారం లా చేయండి,వ్యవహారం వ్యవహారం లా చేయండి, రెండిటిని కలిపి ఆధిపత్యం వెలగబెట్టె రోజులు చెల్లేయని గుర్తించండని భారత్ యూరోపియన్ యూనియన్ కి తెగేసి చెప్పింది. వార్నీ! మన పేకాట సామెత అంతర్జ్యాతీయంగా వెలిగిపోతోంది.
----------------------/--------------------
ఆయనకు తన గొప్పదనాన్ని గురించిగానీ, భాగ్యాన్ని గురించి గానీ ఏమాత్రం గర్వంలేదు. ఆయనకు జ్ఞానపీఠం బహుమానం వచ్చింది. రేడియోస్టేషనుకి కార్లో పోతున్నాము. అప్పుడు మాస్టారు –‘‘ఈ శరీరమే చిత్రమైనది. ఎన్ని బాధలు పడిందో అన్ని సుఖాలూ పడింది. ఈ శరీరంలో ఉన్న సత్యనారాయణ నాటికీ నేటికీ ఒక్కడే. కాని వీడిచుట్టూవున్న సంసారం మారిపోయింది. అప్పుడు నాతో బ్రతికిన భార్య యిప్పుడు లేదు. ఇప్పుడు నా యింట్లో ఎన్ని కూరలున్నా చుట్టం వస్తే మళ్ళా ఏ బంగాళాదుంపలో ఏవో తెప్పిస్తే గాని తృప్తిగా వుండదు. అప్పట్లో నా కొంపకు చుట్టం వస్తే వానికి ఏమిమర్యాద చేయగలమా! అని నాకు కొంచెం కష్టంగా వుండేది. భోజనం వేళ ఆగదు గదా ! ఆ వేళకు మా ఆవిడ వచ్చిన చుట్టానికి, నాకు తిండి సృష్టించేది. ఇంట్లో ఆ పదార్థాలు ఎలా ఎక్కడ నుండి ఊడి పడినాయో నాకు తెలియదు. షడ్రసోపేతంగా అమ్రుతాయమానమైన తిండి సృష్టించేది. సృష్టించడమే సుమా! కూర, పప్పు, పులుసు, పచ్చడి ఏమి కావాలో అన్నీ, ఎలా వచ్చినాయి యివన్నీ!? నా బీదకాపురానికి అటువంటి సృష్టిచేయడానికి, ఆ మర్యాద దక్కించడానికి ఆ మహాయిల్లాలు పడిన శ్రమ తలచుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అదంతా ఎందుకండి! నేను 1956లో మేడ కట్టాను. అప్పటి వరకూ పాకలో వున్నాను. అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే! కాని అప్పటి మా ఆవిడ పడిన కష్టం వాన కురిస్తే ఇంట్లో మోకాటిలోతు నీళ్ళు! ఆ నీళ్ళు తోడేసి రాళ్ళు పేర్చి వాటిమీద యింత ఉడకేసి పెట్టాల్సి వచ్చేది! అప్పటి విశ్వనాథ సత్యనారాయణకి, యిప్పటి విశ్వనాథ సత్యనారాయణకి తేడా ఏమిటి? అదే శరీరం.. కారులో పోతుంది. రైలులో పోతుంది. కొన్ని యేండ్లుగా యిలా సుఖపడుతున్నది! లోపల ఉన్న జీవుడు ముందు స్థితి మరచిపోలేదు. మా తండ్రిగారుండగా నేను యువరాజును. పుట్టుభోగిని. తర్వాత కష్టదశ. ఈ కనపడే భోగం, మేడ అంతా ఆ జీవుడి నంటుకోవడం లేదు. అందువల్ల వాడికి దుఃఖమేమిటో, కష్టమేమిటో తెలిసినంత...సుఖం గూర్చి తెలీదు. వానికి గర్వం ఎలావుంటుంది? (అంత కష్టదశలో ఆయన చేసిన గుప్తదానాలు అనేకములు. ఆయన సంపాదన అప్పుడు ఎక్కువకాదు. దాతృత్వం ఆపుకోలేని చేయి తన యిబ్బంది తాను పడుతూనేవుంది. ఆ దానాలతో సుఖపడినవారు చాలా మంది వున్నారు) బ్రతికి వున్నాను కనుక యివన్నీ అనుభవిస్తున్నాను. ఆ భార్యలేదు. ఆమెకీ అనుభవంలేదు. ఇప్పుడింత మహాకవిని, అప్పుడూ మహాకవినే నన్ను మహాకవిని చేసినది ఆమె." ఈ మాటలాయన కళ్ళల్లో చెమ్మతో అన్న మాటలు. వరలక్ష్మీ త్రిశతిలో అన్నారు కదా!
‘‘వట్టి నీరసబుద్ధి నట్టినన్ను రసోత్థపథముల సత్కవీశ్వరుని జేసి
…….ఇతరు లెవ్వరు నెరుగని యీ రహస్య ఫణితి నను
నేలుకొనిన నా పట్టమహిషి’’
‘‘నా యఖిల ప్రశస్త కవనమ్మున కాయమ పట్టభద్రురా
లాయమ లేక యాధునికమైన మదున్నత చిత్తవృత్తి లేదు’’
అని చెప్పారు. శ్రీరామచంద్రమూర్తికి ముప్పై ఆరు ఏండ్ల వయసులో సీతా వియోగం సంప్రాప్తించింది. తనకుకూడా సరిగా అదే వయస్సులో ఆ భార్యావియోగమహాదు:ఖం సంప్రాప్తించింది. ఆ వియోగ వ్యథ ఏమిటో తెలియనిదే తాను రామకథను రసవంతం చేయలేడని భగవంతుడు తనకు ఆ యోగ్యత కూడా కల్పించాడని వాపోయినాడాయన.
(విశ్వనాథవారి వ్యక్తిత్వం వారిని పై పై చూపులతో చూసినవారికి అర్థం కాలేదు. వారికి అత్యంత సన్నిహితుడైన శిష్యుడు, వారి రచనలు చాలావాటికి లేఖకుడు, స్వయంగా గొప్ప కవిపండితుడు ఐన శ్రీ పేరాల భరతశర్మ గారు విశ్వనాథవారి గురించి మనసుని తాకే వ్యాసాలు కొన్ని రాశారు. అందులో ఒకదాని నుండి చిన్న భాగం ఇది!)🙏🙏
=====================
Courtesy:Whats app.
Sharing courtesy:Narasimha Rao. Vinnakota.
శవాలంకారం.
ఊపిరున్నంత కాలంలోనే వ్యక్తులను పేరుతో పిలుస్తారు ఆపై శవం అనే అంటారు. ముద్దుగా నేటి కాలంలో పార్ధివ శరీరం అంటున్నారు. పార్ధివ శరీరం అంటే శవమనే అర్ధం కదా! మరి ఈ శవానికి అలంకారం చేస్తారు. బతికుండగా అలంకారం చేస్తే ఆ శరీరంలో ఉన్నవారు ఆనందించనైనా ఆనందించేవారు. చనిపోయి శవమైన తరవాత అలంకారం ఏమి ప్రయోజనం? నిష్ప్రయోజనమని తెలిసీ అలంకారం చేయడమే చిత్రం. మానవులు బహు చిత్రాతి చిత్రమైనవారు సుమా!
మగాడు
తాతా! ఒంటరిగా అడవిలోకి పోతున్నా అందో మనవరాలు ఓ రోజు పొద్దుటే ఛాట్ లో.
ఏమైందబ్బా అని సోచాయించి,బంగారం ఒంటరిగా అడవిలోకి పోకు(జనారణ్యం లోకైనా) పెద్దపులులెత్తుకుపోతాయి. బంగారాన్ని పులెత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకోనా! ఓ పని చెయ్యి. ఎక్కడిదక్కడ వదిలేసి నా దగ్గరకొచ్చెయ్యి. నీకు కోపమనిపిస్తేతిట్టు,నాకు వినపడదుగా బాధలేదు(పిచ్చి నవ్వు నవ్వుతూ ఉంటా) కొట్టాలనిపిస్తే కొట్టు పంచ్ బేగ్ లా,అనేసాను.
ఎవరి మీద కోపమొచ్చి ఉంటుందబ్బా! అని ఆలోచిస్తే,ముత్యం లాటి మొగుడు,చెప్పినమాట వింటాడు. రత్నంలాటి కొడుకు చదువుకుంటున్నాడు. రేపో,నేడో రెక్కలు కట్టుకుని ఎగిరిపోడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంక మావ కాపరానికి వెళ్ళకముందే కాటికిపోయాడు. అత్త ఎక్కడో దూరాన ఉంది. తెలుసుకుందామని ఎవరి మీదా కోపం అడిగేసా.
ఎంజాయ్ చేసే వయసులో పని,పని అని విసుక్కుంది. ఆ! బిజీగానే ఉండు,ఖాళీగా కూచోకు,అంటే జీవితం ఎంజాయ్ చెయ్యకుండా పనులు తగిలించుకున్నదెవరు? నువ్వు కాదా! తగ్గించుకో!! ఎంజాయ్ చెయ్యి, వచ్చెయ్యి,వచ్చెయ్యి అన్నా. వస్తా! మా ఆయనతో చెప్పి, అని కట్ చేసింది.
-------------
కట్ చేస్తే
పడిపోయాను అని ఏడుస్తూ అమ్మకి చెబితే ఆడపిల్లలా ఏడుపేంట్రా మగాడివికాదూ! అంది.
సూతోవాచా !
పరిక్ష పోయింది నాన్నా అంటే నాలుగుతికేడు, ఏడుస్తుంటే, ఎందుకాఏడుపు ఆడదానిలా అని మరో రెండు ఉతికాడు.
మాస్టారు తిట్టారు,ఆఫీసర్ తిట్టాడు అని కొలీగ్ కి చెప్పుకుంటే ఏడవకు మగాళ్ళం కదూ అనేసాడు.
దేనికి ఏడుపొచ్చినా ఏడవకూడదనీ,అది ఆడవారి స్వామ్యం అనీ, చిన్నప్పటినుంచి ఎగో పెంచిపోషించేసేరు. పెళ్ళాం తిట్టినా,కొట్టినా ఏడవలేదు. పనెక్కువైనా,ఆరోగ్యం బాగోకపోయినా,కొడుకు కోడలూ వినకపోయినా,మనవలు,మనవరాళ్ళూ తిట్టుకున్నా ఏడవలేడు. మగాడు కదూ! కుటుంబం కోసం గాడిదలా చాకిరీ చెయ్యడం,ఎద్దులా సంపాదించడమే గాని మనసారా,కరువుతీరా ఏడవనుకూడా ఏడవలేడుగా! అదీ మగాడు.
ఆరు నూరైనా
ఆరు నూరైనా,నూరు ఆరైనా! ఆ సూర్యుడిటు పొడిచినా, ఈ సూర్యుడటు పొడిచినా ...
ఇదొక వ్యవహారికం.
ఆరేమిటి,నూరేమిటి? అర్ధం కాలేదు. ఆరు రుచులు (షడ్రుచులు), ఇవి ఎప్పటీ నూరు కావు. నూరు రుచులు లేవు. కనక ఇవి కాదు.
ఆరు గుణాలు (షడ్గుణాలు). అవి కామ,క్రోధ,మోహ,లోభ,మద,మాత్సర్యాలు. ఇవి వెర్రితలలేస్తే నూరు పైనే కావచ్చు. కాని నూరు ఐన ఆగుణాలు ఆరు మాత్రం కావు,ఎన్నటికిన్నీ! అందుచేత ఇవీ కావు.
షడంగాలు, ఇవి చాలా రకాలున్నాయి, అందు చేత అవీ కావు.
ఆరు రూపాయలు నూరు రూపాయలూ అవుతాయి,నూరు రూపాయలు ఆరు రూపాయలూ అవుతాయి. నేటి కాలంలో ఇవే చెప్పుకోవాలి. ఆరు నూరెలా అవుతాయి? కష్టపడి పని చేస్తే ఆరు నూరవుతాయి.తిని కూచుంటే నూరు ఆరు కావడం పెద్ద కష్టం కాదు. ఆరు నూరైనా,నూరు ఆరైనా; ఆసూర్యుడిటు పొడిచినా,ఈ సూర్యుడటు పొడిచినా పని కావాల్సిందే! అంటే సవ్యమైన పద్ధతులలోగాని అపసవ్య పద్ధతులలో గాని పని కావలసిందేనని భావం.
ఏది శాశ్వతం?
(రవీంద్రనాథ్ ఠాగూర్ అద్భుతమైన కవిత)
"నేనిక లేనని తెలిశాక
విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు..
కానీ మిత్రమా! అదంతా నా కంట పడదు!
ఆ విలాపమేదో ఇపుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా!
నీవు పంపించే పుష్పగుచ్ఛాలను
నా పార్ధివదేహం ఎలా చూడగలదు?
అందుకే... అవేవో ఇప్పుడే పంపరాదా!
నా గురించి నాలుగు మంచి మాటలు పలుకుతావ్ అప్పుడు కానీ అవి నా చెవిన పడవు..
అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో !
నేనంటూ మిగలని నాడు
నా తప్పులు క్షమిస్తావు నువ్వు !
కానీ నాకా సంగతి తెలీదు..
అదేదో ఇపుడే క్షమించేయలేవా?!
నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది
కానీ అది నాకెలా తెలుస్తుంది?
అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా !
నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది
అదేదో ఇప్పుడే గడపవచ్చుగా మనసారా!
సానుభూతి తెలపడానికి
నా ఇంటి వైపు అడుగులు వేస్తావ్..
నా మరణ వార్త విన్నాక!
సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని?
ఇప్పుడే నావైపు చూడు, నాతో మాట్లాడు,
బదులు పలుకుతాను, కాసేపైనా గడుపుతాను
హాయిగా నీతో మెలుగుతాను!"
------------------------------------------------
- ఇదే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత. అందుకే బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం! కష్టసుఖాలు పంచుకొందాం! ఒకరికొకరమై మెలుగుదాం! ఉన్నన్నాళ్ళూ కలిసిమెలసి బతుకుదాం!!*
ఈరోజు కలిసిన, మాట్లాడిన వ్యక్తి
మళ్ళీ కలుస్తాడో లేదో?
మాట్లాడతాడో లేదో?
ఏది శాశ్వతం?
ఎవరు నిశ్చలం?🌹🌹🙏...శ్రీ 🦋
----------------------------------------------------------
Coutesy:Whats app
విశ్వకవికి శతాధిక వందనాలు.
జీవిత సత్యం తెలుపుతూ టాగూర్ రాసిన ఇంత అద్భుతమైన కవిత ఉన్నదని నాకు నేటివరకు తెలియదు.
దీనిని వాట్సాప్ లో పంచుకున్న విన్నకోటవారికి
వందనాలు.
కావలసినవారో పైవారో అందరిని పలకరించండి,తడిసిపోయిన నులక మంచంలా బిగుసుకుపోకండి. అంతర్ముఖులు కాకండి.
ఒక వయసొస్తేగాని ఈ కవితలో అందం ఒంటబట్టదేమో 🤣
తాతముల్లె
వివరంగా చెప్పనుగాని క్లుప్తంగా చెప్పి ముగించేస్తా!
పాతకాలంలో అదేం లెండి నేటికాలంలో కూడా, ముసలివారికో అలవాటుంటుంది. అది డబ్బులు తలకింద పెట్టుకోడం.ఇంట్లో ఏ అత్యవసరానికి దీనినుంచి తీసి డబ్బులు ఇవ్వరు. ఏం! పోయేటపుడు కూడా పట్టుకుపోతాడా? అని ఈసడిస్తారు కూడా! ఎందుకు వీరు డబ్బు తలకింద పెట్టుకుంటారు? అదీ కొచ్చను. 🤣
నాటికి నేటికి ఏనాటికి మారనిది మానవ మనస్తత్వం. ఏంటది? సామాన్యుడైనా మాన్యుడైనా వయసు మీదపడ్డవారికి సొమ్ములు అవసరంలేదు,కర్చులు ఏడుస్తూనో మొత్తుకుంటూనో కొడుకులు కోడళ్ళే పెడతారు. ఈ పెద్దవాళ్ళకి అంతా పరాధీనమేకదా! బయటికెళ్ళి నచ్చినది కొనుక్కోలేరు,తినలేరు. బయటికిపోవాలంటే తోడు కావాలి. సరే ఇక కొనుక్కోడమంటే వీరికి కనపడదు వినపడదు,'కవి' లు కదా! కొట్టువాడికి, మాల్ లోనూ మాటాపలుకూ ఉండదు. మరింక దగ్గర డబ్బెందుకు? అదీన్ని చిల్లరేంకాదు,పెద్దమొత్తంలోనే జమచేసుకుని తలకింద పెట్టుకుంటారు. మనవలు మనవరాళ్ళు దానిలోంచి డబ్బులు కొట్టేయాలని చూస్తుంటారు,కాని ముసలాళ్ళు ఇవ్వరు.తలకింద పెట్టుకుంటారు,పెద్దవాళ్ళుగనక దీనిని తాతముల్లె అంటారు. మరెందుకీ డబ్బులు?
చివరికాలం ఎప్పుడొస్తుందో తెలీదు, ఆ సమయంలో అంతా ఆతృతతో ఉంటారు. ఒకసారి ముసలిప్రాణం గుటుక్కుమన్నది మొదలు ,అంతా గొల్లు మంటారు,తప్పదు మరి. ఆ మరు నిమిషమ్నుంచి మొదలవుతాయి కర్చులు. మొదట కావలసినవి పచ్చి వెదుళ్ళు ఇవి ఇంట్లో ఉండవు బయటనుంచి తెప్పించుకోవలసిందే! సరే! ఆ సమయంలో ఎంత కలిగినవారైనా సొమ్ము దగ్గరుండకపోవచ్చు. ఇది అప్పుకి వెళ్ళే సమయమూ కాదు. బంధువులు,మిత్రులు కర్చులు చేయడానికి వెనుకాడరు, కాని ఆ తరవాత ఇచ్చినా పుచ్చుకోరు. తరవాత కాలంలో ఇది దెప్పుళ్ళకి సావకాశం. ఇది తరతరాలా ఉండిపోతుంది.
మీ తాత పోయినపుడు కుండలు,పిడతలు,వెదుళ్ళు తెప్పించడానికే ఇబ్బంది పడిపోయారు,డబ్బులు లేక, ఆ నాడు మా సుబ్బిగాడు సొమ్ములు కర్చు పెడితేగాని మీ తాత శవం కదల్లేదు,ఇంటినుంచి,తెలుసా!నువ్వేదో గొప్పలు చెప్పకోయ్, లా ఉంటాయి, తరవాతకాలంలో మాటలు. ఇవి చాలా బాధనూ కలిగిస్తాయి. అటువంటి సన్నివేశాలను ముందు తరం వారికి లేకుండ ఉండేందుకే, కనీసం, మొదటి మూడు రోజుల కర్చుకేనా ముల్లె ఉంచేవారనమాట.
ఇదీ తాతముల్లె కత,సంక్షిప్తంగా
అట్లుంటది పెళ్లామ్స్ తో మరి 😉😂😆🤭
భార్య : "ఏమండీ వచ్చేటపుడు పెరుగు తీసుకొస్తారా.. ఇంట్లోని పెరుగు మూడు రోజుల క్రితం నాటిది.. బాగా పుల్లగా అయింది."
భర్త : "అవునా... అలాగైతే దాన్నేం చేస్తావు?"
భార్య : "ఏం చేయాలి ? బయట పారబోస్తానంతే..."
భర్త : "అమ్మ చెబుతుండేది.. పెరుగును బయట పారబోయరాదని. ఏదో ఒకటి చేయి..."
భార్య : "ఏం చేయాలి.. మజ్జిగ చేస్తే పులుపే పులుపు. నోట్లో పెట్టుకోలేమే!"
భర్త : "ఒక పని చేయి. మజ్జిగ పులుసు చేయి. తినడానికీ రుచిగ ఉంటుంది."
భార్య : "గుడ్ ఐడియా .. ఎలాగూ బయటకు పోతున్నారుగా.. కొన్ని సామాన్లు చెబుతాను, వ్రాసుకోండి."
భర్త : "సరే చెప్పు..."
భార్య : "ఊఁ.. కొత్తిమీర, కరివేపాకు, అల్లం.. ఆ.. ఒక టెంకాయ, జీలకర్ర.."
భర్త : "సరే .. వ్రాసుకున్నాను.. బయల్దేరనా?"
భార్య : "ఉండండి.. ఇంకా ఉన్నాయి.. ఒక బూడిద గుమ్మడికాయ..."
భర్త : "బూడిద గుమ్మడికాయనా ? అదెందుకు?"
భార్య : "మరి మజ్జిగ పులుసులో బెండకాయలు వేస్తరా? తెచ్చేదేదో పెద్దదే తెండి. కోసిపెట్టినది , కుళ్ళిపోయినది కాకుండా చూసి తీసుకురండి."
భర్త : "సరే... బయల్దేరనా?"
భార్య : "అయ్యో .. కాస్త ఆగండి.. ఒకటే గుమ్మడికాయ తేకూడదంట, అమ్మమ్మ చెబుతుండేవారు. ఎలాగూ తెస్తున్నారు రెండు తెండి. అవి కూడ పెద్దవి. ఇంకో పని చేయండి.పెద్ద గుమ్మడి కాయ తెస్తున్నారెలాగూ, ఒక కేజి చక్కెర, ఒక కేజి నెయ్యి , ఎండు ద్రాక్ష, జీడిపప్పు, ఏలకులు..."
భర్త : "ఇవన్నీ మజ్జిగ పులుసుకు ఎందుకే?"
భార్య : "ఛీ, పులుసుకు కాదండి.. హల్వా చేయడానికి. గుమ్మడికాయను పగలగొట్టి అలాగే వదిలివేయరాదు. అపశకునం.."
భర్త : "ఇక చాలా?"
భార్య : "కాస్త ఆగండి.. ఓ నాలుగైదు నిమ్మ కాయలు, నల్ల మిరియాలు, ఇంగువ తీసుకురండి. ఘమఘమల వాసనలొస్తాయి."
భర్త : "హల్వాకు ఇంగువ వేస్తారా?"
భార్య : "అబ్బా.... హల్వాకు ఎవరైనా ఇంగువ వేస్తారాండి.. ఇవి గుమ్మడికాయ వడియాలకు.. గుమ్మడికాయ తెస్తున్నపుడు వడియాలు పెట్టకపోతే ఎలా చెప్పండి?"
భర్త : "ఇకనైనా వెళ్ళనా?"
భార్య : "ఏదో జ్ఞాపకానికొస్తోంది ఉండండి. ఆ.. జ్ఞాపకమొచ్చింది. ఒక పొట్లకాయ తెండి. మజ్జిగ పులుసుకోసం గుమ్మడికాయతో బాటు మంచి కాంబినేషన్ . దాంతో బాటు ఒక అర్ధ కేజి మొత్తని శనగపిండి తీసుకురండి. ఎలాగూ పొట్లకాయ తెస్తున్నారు కాబట్టి బజ్జీలు చేయకపోతే ఎలా చెప్పండి? అలాగే వంటసోడా, రిఫైన్డ్ ఆయిలూ తీసుకురండి, వేరుశనగనూనె కాదు సన్ ఫ్లవర్ ఆయిల్..."
భర్త : "సరే.. బయల్దేరుతున్నాను."
భార్య : "అదేమిటి వెనుక తలుపు వైపు. అక్కడెక్కడికి వెళ్తున్నారు."
భర్త : "నేను బయటకు పోవడం లేదు, వంటింట్లోకి వెళ్తున్నాను."
భార్య : "ఎందుకు? మార్కెట్ కు పోరా?"
భర్త : "నీ మార్కెట్ నాశనం కాను. గ్లాసుడు మజ్జిగపులుసు కోసం వేయి రూపాయలు ఖర్చు చేయాలా? పాపమొస్తే రానీ.. నేనే ఆ పులిసిన పెరుగును బయట పారబోస్తాను.."
భార్య : "ఏమిటండీ, మీరే చెప్పారుగా..."
భర్త : ఓసి... నీ అమ్మ కడుపుమాడా బుద్ధి లేక చెప్పానే ..!
అట్లుంటది పెళ్లామ్స్ తో మరి 😉😂😆🤭
Courtesy:whatsapp
బలవంతుడ
బలవంతునికే మిత్రులుంటారు. శత్రువులూ ఉంటారు. కాని బలహీనునికి శత్రువులేగాని మిత్రులుండరు. అలాగని బలవంతుడు
బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి బ్రతుకుట మేలా?
బలవంతమైన సర్పము
చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ!
అంచేత బలమున్నవాడు ప్రతివాడితోనూ శత్రుత్వం తెచ్చుకోకూడదు.
అధికారము,ధనము,అందము,బలము, యవ్వనము,మిత్రులూ శాశ్వతం కాదు
బలయుతులకు దుర్భలులకు
మాలిక ఇక కనపడనట్టే...నా?
ఒకప్పుడు బ్లాగులు కొల్లలు. ఆగ్రిగేటర్లు కూడా చెప్పుకోదగిన లెక్కలోనే ఉండేవి. ఆగ్రిగేటర్లు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయాయి, కారణాలనేకం. నేను బ్లాగుల్లోకొచ్చేనాటికి ఉచ్చ దశలో ఉంది,బ్లాగ్ ప్రపంచం. గొప్ప గొప్ప అగ్రిగేటర్లన్నీ కనుమరుగైపోయాయి, కాలంలో. నిన్న మొన్నటి దాకా ఉన్న మాలిక కూడా నెమ్మదిగా కనపడకుండా పోయింది, మరి కనపడుతుందా?
ఇక మిగిలిన ఏకైక ఆగ్రిగేటర్ శోధిని. శ్రీ శ్రీనివాస్ గారి దయ మా ప్రాప్తి.
కరోనా-నింబస్
కరోనాకి వేరియంట్ ఒమిక్రాన్ అది కొంతకాలం పీడించింది. నెమ్మదిగా కరోనా తగ్గింది. జనాలు శ్వేఛ్ఛావాయులు పీల్చుకున్నారు. నాలుగేళ్ళయిందేమో, కరోనా మళ్ళీ మొదలయింది. ఇది ప్రపంచంలో అన్ని దేశాలను చుట్టుముడుతోంది. చిన్న దేశాలు తప్పించి మిగిలినవారు పలకటం లేదు. అగ్నేయాసియా దేశాల్లో జోరుగా వుంది. పశ్చిమదేశాల్లో బ్రిటన్,కెనడా, మొదలైన దేశాల్లోనూ అమెరికాలోనూ ఉంది. చైనా సంగతి తెలీదనుకోండి. ఐక్యరాజ్య సమితివారు ఈ వేరియంట్ కి నామకరణం చేయలేదుగాని నింబస్ గా అనధికారికంగా పిలుస్తున్నారీ బుజ్జిని.
దీని ప్రత్యేకతేంటీ అదిగదా కొచ్చను. దగ్గు,రొంప,వగైరావగైరా అన్నీ మామూలే లచ్చనాలు. ప్రత్యేకతేమంటే గొంతులో కత్తులు నూరినట్టుంటుందిట. (రేజర్ బ్లేడ్స్)అంటున్నారు. చాలా తొందరగా వ్యాప్తి చెందుతుందిట. మరణాలూ ఉన్నాయి. మనదేశంలోనూ ఉన్నది కాని బహు నెమ్మదిగా వ్యాపిస్తున్నది. మొత్తం దేశం మీద ఏడు వేల కేసులుంటే అందులో ఎక్కువ కేరళా,గుజరాత్,ఢిల్లీ, పశ్చిమ బంగ లో ఉన్నాయట. మిగిలిన దేశం మీద తక్కువే ఉన్నాయట. ప్రభుత్వాలు జాగ్రత్తలు చెబుతున్నాయి,తీసుకోండి. మన ప్రాంతంలో సోకరాదనే నా అభిలాష. సోకితే మందులు వేసుకుంటూ, గొంతులో రేజర్ బ్లేడ్స్ అనిపిస్తే వేడి నీళ్ళలో రాళ్ళ ఉప్పు కరిగించి గోరువెచ్చగా ఉండగా గొంతులో పోసుకుని గరగరలాడించి,ఉమ్మేయండి. ఇది రోజుకి మూడు నాలుగుసార్లు పైగా చేయచ్చు. ఆపై నిప్పుల కుంపటి దగ్గర కూచోండి, కొద్ది దూరంగా కాలకుండా. ఆపై కుంపటి మీదకి వంగి నోరు బాగ తెరిచి వేడి గొంతులోకి పోయేటట్లు కాచండి,గొంతును. చాలా శమనగా ఉంటుంది.
ఆరోగ్యమస్తు.
https://www.thehealthsite.com/news/covid-19-cases-in-india-live-updates-13-june-2025-new-coronavirus-variant-nimbus-nb-1-8-1-sparks-panic-with-razor-blade-throat-and-severe-symptoms-active-cases-1229923
ముక్కుపిండి వసూలు చేస్తా!
ముక్కుపిండి వసూలు చేస్తా!నన్నమాట వింటుంటాం. ఏంటబ్బా అనుకున్నా ఇంతకాలమూ.
శరీరం లో నొప్పులు మెడ నొప్పి,వెన్ను నొప్పి,సయాటికా నొప్పి ఇలా వివిధ నొప్పులకు అస్థిపంజరంలోని ప్రతి ఎముకను నొక్కి సరి చేసున్నవారు, డాక్టర్లు ఎక్కువ కనపడుతున్నారు, ఉత్తరాదిని. మనదాకా ఇంకా వచ్చినట్టు లేదిది. ప్రతి భాగాన్ని విరిచినప్పుడు ఒక చిన్న శబ్దం, దాన్ని రోగికి వినిపించేందుకు డాక్టర్ చేతికో పరికరం, ఇలా నడిచిపోతోంది. డాక్టరు పడుకోబెట్టి,కూచోబెట్టి, మీదపడి, మెడవిరిచి ఇలా ఈ కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. చూడ్డానికి కొంత ఎబ్బెట్టుగానే ఉంది. ఇందులో డాక్టర్లు ఆడ మగ కూడా, ఈ మీదపడి కౌగలించుకున్నంత పని చేసిజేసి, సున్నితభాగాలని తడుముతూ కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగమే ముక్కు పిండడం కూడా అలా ముక్కు దూలం విరిస్తే శ్వాస బాగా ఉన్నట్టు అలా విరిపించుకున్నవారి హావ భావాలు తెలుపుతున్నాయి. మరి ఇలా ముక్కు పిండిన డాక్టరు డబ్బులు పుచ్చుకోడా? అదే ముక్కుపిండి వసూలు చేయడం అనుకుంటా.
ఒకప్పుడు పెద్దవాళ్ళైన స్త్రీలు పిల్లల పట్ల ప్రేమ తెలియచేయడానికి మెటికలు విరిచేవారు,గుర్తుందా?
గురజాడ కన్యాశుల్కంలో ఒక పాత్రచేత మొల్లో చెయ్యేసి సొమ్ము వసూలు చేసుకురమ్మన్నాడు, మా పంతులు అంటాడు గిరీశం తో, సానిదానితో తీయించుకున్న ఫోటోల సొమ్ముకోసం. ఈ మొలలో చెయ్యివేసి వసూలు చేయడమేమిటన్నది కొచ్చను. పాత కాలంలో మొలలో దాచుకునేవారు రూపాయలు, దానిలోంచి తీసుకుంటానని అర్ధం అనుకున్నా! కాదని తెలిసింది. మొలలో చెయ్యేసి అంటే గుడ్డలూడదీసి వసూలు చేస్తాననిట. అంటే గుడ్డలిప్పి పరువుతీసి..... అదీ కత.పరువున్నవాడికైతే కదా! అదీ పాయింటు...
అన్నీ..కొంచం..కొంచం..వార్తలు
ఋతుపవనాలు కరుణించలేదింకా. 40,41 మండుతూనే ఉంది. మరో నాలుగురోజులిలా అంటున్నారు.
**
కరోనా దేశాలన్నిటినీ చైనాను కూడా పట్టిపీడిస్తున్నట్టు వార్తలున్నాయి. మరి అమెరికా
,యూరప్ ల సంగతే తెలీదు. భారత్ లో కూడా కాలు పెట్టింది,కాలు పెట్టి వారంపైగా ఐనా నిన్నటికి కేసులు 6000 లకి చేరలేదు. ఇంకా ఎక్కువ కాల/నందుకు ఎర్ర పత్రికలు ఏడుస్తున్నాయి. పుట్టింటివారి చుట్టాలు,మహరాష్ట్ర,ఢిల్లీ లో మాత్రమే కేసులు ఎక్కువగా ఉన్నాయి.పుట్టింటివారి చుట్టాల రాష్ట్రంలోనే ఎక్కువున్నాయి. మరో బూస్టర్ డోస్ అవసరం లేదన్నట్టు వార్తలు. ఇదివరలో చేసిన వాక్సీన్ పని చేస్తున్నట్టుందని వార్తలు.
**
మరో పాథొజన్ పై ఒక చైనీయుడు అమెరికా యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్నాడు,చైనా నుంచి మొక్క తెప్పించుకుని. ఆ చైనీయుడి గర్ల ఫ్రెండ్ నఏనూ దానిమీద పరిశోధన చేస్తా అని ఆ మొక్కని చైనా నుoచి అమెరికా తెప్పించుకుంది. ఈ మధ్య చెకింగులు ఎక్కువయ్యాయై, అందునా యూనివర్సిటీ లపై,అమెరికాలో. ఇదేమి మొక్క వివరాలు తీగ లాగితే డొంక కదిలింది. ఈ పాథోజన్ ను మొక్కలపై ప్రయోగిస్తే ఆహార పదార్ధాలు పండించే అన్ని మొక్కలూ నెమ్మది నెమ్మది ఉత్పాదన తగ్గి, తరవాత చచ్చిపోతాయని తేలింది. దీంతో ఆ ఇద్దరిని పట్టుకుని అరస్టు చేసి తీగ లాగితే ఇద్దరూ చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యులని, గూధచారులు కావచ్చేమోనని అనుమానం.
**
గ్రేటా తన్ బర్గ్ గుర్తుందా? ఒకప్పుడు భారత్ ను అల్లరిపెట్టింది. ఇప్పుడు ఇస్రయెల్ ని అల్లరిపెట్టాలని బయలుదేరింది. ఇస్రయెల్ ఒకటే మాట చెప్పింది. ఇస్రయెల్ జలాలలోకి అనుమతింపబడని నౌక ఏదీ రాలేదు. వెనక్కి తిరిగిపో! గౌరవంగా ఉంటుంది. నువు తెచ్చే ఒక మూటా సరుకులు ఒకళ్ళికి కూడా సరిపోవు. కాదని మొండికేసి ముందుకొస్తావా? చేయవలసిన పని నా నౌకాదళం చేస్తుంది అని ఒక్కటే వారినింగ్ ఇచ్చింది...చూడాలి...
**
బీహార్,బెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కాంగ్రెస్ కి మళ్ళీ ఓటింగ్ మెషీన్ల భూతం పట్టుకుంది.
**
అప్రస్తుత ప్రసంగం.
నేను పుట్టినకాలం నాటి ముచ్చట. ఆ రోజుల్లో వినోదం అంటే తోలుబొమ్మలాట. ఈ తోలుబొమ్మలాడించే కళాకారులు రామాయణ,భారత,భాగవతాల్లో అంశాలు చెబుతుండేవారు,తోలుబొమ్మల సాయంతో. ఈ ఆట కొంత నడిచిన తరవాత తెరపై కేతిగాడు ఉరఫ్ జుట్టుపోలిగాడు ఉరఫ్ గాందోళిగాడు,బంగారక్కల బొమ్మలను తెరపై వేసి అసందర్భ ప్రసంగం చేసి హాస్యం పుట్టించేవారు. ఆ తరవాత కాలంలో ఈ హాస్యం శృతి మించి రాగానపడినట్టు బూతులు చోటు చేసుకున్నాయి. సరే ఆ తరవాత అవి సినిమా,టివి లకీ చేరిపోయాయి. హాస్యం అపహాస్యమూ అయింది.
ఇంతకీ ఇదెందుకు గుర్తొచ్చిందీ? అదీ కొచ్చను. 96 ఏళ్ళ వృద్ధ తోలుబొమ్మలాట కళాకారిణికి పద్మ అవార్డు ఇవ్వడం జరిగింది. అప్పుడు గుర్తొచ్చింది, నాటి కాలంలో, ఆంధ్ర ప్రాంతంలో మా వూరు నరిసిపూడి, ఈ తోలు బొమ్మలాటకి ప్రసిద్ధి పొందింది. అంతే కాదు నాటి తోలుబొమ్మలాట కళాకారులకు మా పూర్వీకులు గురువులు. అదీ బాదరాయణ సంబంధం,ఇదో అప్రస్తుత ప్రసంగం.
కాలంలో ఇది సాహిత్యంలోనూ చోటు చేసుకుంది. భాసుని మృఛ్ఛకటిక నాటకంలో శకారుడు,(రాణీగారి తమ్ముడు, అనధికార కేంద్రం), మాటల ద్వారా హాస్యం పండింప జేసేరు. ఆ తరవాత కాలంలో తెనుగులో గురజాడవారు తమ కన్యాశుల్కం నాటకం ద్వారా ఈ రకపు హాస్యాన్ని పండించడం చేసేరు. గిరీశం, బుచ్చమ్మల ద్వారా అపహాస్యపు మాటల ద్వారా, హాస్యం కొంత పండింప జేసేరు. ఆ నాటిక అవసరం నేటి కాలానికి లేకపోయినా,ఆ సమస్య చచ్చిపోయినా,కొందరు నేటికీ ఆ నాటికను వేస్తూ,చచ్చిన గుర్రాన్ని తోలుతూనే ఉన్నారు ( ఏదో కారణం ఉండి ఉంటుంది) ఇది నేటి కాలానికి అప్రస్తుతం . మృఛ్ఛకటకం, కన్యాశుల్కాలని పోలిస్తే భాసుడు శకారుణ్ణి సృష్టిస్తే గురజాడ గిరీశాన్ని పుట్టించారు. భాసుడు ఒక హీరోని,హీరోయిన్ గా ఒక వేశ్యను పుట్టించి, చివరికి వేశ్యను ఉదాత్త పాత్ర చేసేరు. అలాగే గురజాడ భాసుని హీరో విలన్ లను కలిపేసి గిరీశాన్ని తయారు చేసి,మథురవాణి అనే వేశ్యను ఉదాత్తం చేసేరు. గురజాడ నాటికకు భాసుని నాటిక ఉత్తేజమా? ఏమో తెలిసినవారు చెప్పాలి. ఇదీ అప్రస్తుత ప్రసంగమే! డామిట్ కథ అడ్డం తిరిగింది. ఎక్కడబ్బా?
ఇక అష్టావధానం అనేది ఒక కవితా ప్రక్రియ. చెళ్ళపిళ్ళ వారి ద్వారా అది ప్రజల దగ్గరకు చేరింది. అందులో ఒక అప్రస్తుత ప్రసంగితో ప్రసంగం కూడా ఒక ప్రక్రియ. ఇలా అప్రస్తుత ప్రసంగం కవులనూ చేరింది. ఇందులోనూ హాస్యంచోటు చేసుకుంది, ఒక్కొకపుడి అపహాస్యం కూడా అవుతోంది.
కొద్ది మోతాదులో అప్రస్తుత ప్రసంగం కూడా బాగుంటుందేమో సుమా!
ఇదీ నేటి కాలానికి అప్రస్తుత ప్రసంగం.
వివేచన-రసజ్ఞత.
నిన్నటి టపాకి వచ్చిన లక్కరాజువారికామెంటుకి సమాధానం రాయబోతే టపా ఐపోయింది. నిన్నటి టపాకి తదుపరి మరియు అనుసంధానం.
మొదటి ఉపమానంలో ఎదురుగా ఉన్నది నిశ్చలం,బుద్ధి లేనిది, అందుచేత వివేచన మనకే కావాలి. అది పైకి కనపడుతున్నట్టు అందమైనదో కాదో తేల్చుకోవలసింది మనమే!
ఇక రెండవదానిలో ఉపమానం బురదపంది కదులుతుంది, ఎలా కదులుతుందో మనం బుద్ధితో ఊహించాలి,దానికి నిశ్చయం ఉండదు. ఇక్కడా మనమే వివేకం ఉపయోగించాలి. ఉపమానం బురదపంది కాని అందంగా కనపడే బురద పంది లాటి మనుషులూ తారసపడతారు. వారు బుద్ధి ఉపయోగించరు, అందుచేత మనమే బుద్ధి ఉపయోగించి దూరంగా ఉండాలి. ఎంత దూరం అది తెలుసుకోగలగడమే విజ్ఞత, దానిని ఆచరించడమే రసజ్ఞత. ఇది హార్వర్డ్ లోనూ ఈటన్ లోనూ నేర్పరు,నేర్పలేరు. అదంతే! వయసుతో చదువుతో వివేచన పెరగాలి,బుద్ధి పెరగాలి.
ఇక మూడవదానిలో ఇద్దరూ చలనం,బుద్ధి ఉన్నవారే, చదువుకున్నవారే! ఎదుటివారు మూర్ఖులు అని తెలుసుకోగలగడమే విజ్ఞత,ఎవరు మూర్ఖులు? దీనికిదివరలో సమాధానం చెప్పడం జరిగింది,వెతుక్కోవచ్చు. అది తెలిసి ఎంతదూరంలో ఉండాలి? ఎంత మాటాడాలి ? ఎప్పుడు మాటాడాలి ? తెలుసుకోవడం విజ్ఞత , వీటిని తెలుసుకుని ఆచరించడమే రసజ్ఞత.
త్వం శుంఠ అంటే త్వం అంటారు, ఇది లోక రీతి. ఇది విజ్ఞత, చదుతో నిమిత్తం లేదు దీనికి. అందుకే చదువది ఎంతగల్గిన అన్నారు శతక కర్త! ఇదెవరిని ఉద్దేశించినది కాదు, ఎవరేనా భుజాలు తడుముకుంటే నాకు బాధ్యత లేదు. మన్నించండి.
అశుద్ధం మీద
అశుద్ధం మీద రాయి వేస్తే ముఖాన చిందుతుందని ఒక నానుడి. అశుద్ధం అని తెలిసి, రాయి వేస్తే చిందుతుందని తెలిసి, రాయి వెయ్యకూడదు. దూరంగా ఉండాలి.
బురద లో పొర్లిన పంది రోజుకుంటూ ఎదురొస్తే మనమే తప్పుకోవాలి. లేకపోతే ఒంటినిండా బురద విదిలించి పోతుంది, దీనికి జ్ఞానం ఉండదు, జ్ఞానం కల మనమే దూరంగాఉండాలి.
చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు అన్నది పెద్దలమాట. మూర్ఖుడు అని తెలిసి వారితో వాద,సంవాద,ప్రతివాదాలు చేయడమే మూర్ఖత్వం. అందుచేత మూర్ఖునికి దూరంగా ఉండాలి.
చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు గుణసంయుతులు మెచ్చ రెచ్చటం
బదునుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
పుణ్యానికి పోతే
పుణ్యానికి పోతే పులెత్తుకుపోయిందని సామెత! అలాగా శశి థరూర్,అసదుద్దిన్,కనిమొళి,ఇలా పార్లమెంటు సభ్యులు ఏడు బృందాలుగా ప్రపంచం మీద పర్యటిస్తూ పాక్ దుశ్చర్యలను ఎండగడుతూ మన దేశపు ఇబ్బందులను, ఎట్టి పరిస్థితులలో లక్ష్మణ రేఖను దాట వలసి వచ్చిందో వివరిస్తున్నారు.
ఈ బృందాల్లో శశిథరూర్,అసదుద్దీన్ ముఖ్యంగా మెరిసారు. శశి థరూర్ కాంగ్రెస్ వాడయి ఉన్నా, పార్లమెంటు లో విదేశీ వ్యవహారాల సబ్ కమిటీ అద్యక్షుడు, దేశం ముందు తరవాతే కుటుంబమని విషయాల్ని చెబుతోంటే వారి పార్టీ వారే తిట్టిపోస్తున్నారు. నిన్ను బి.జె.పి, విదేశీ వ్యవహారాల మంత్రిగా చేసుకుంటుందనీ వైన వైనాలుగా దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక సదుద్దీన్ ఏ పార్టీ వాడైనా మెచ్చుకోవలసిందే.
జయహో! విదేశాల్లో పర్యటిస్తున్న బృందాలకి, ముఖ్యంగా శశి థరూర్,అసదుద్దిన్ లకు జయ! జయహో!!
శశి థరూర్,అసదుద్దీన్ లకే నావోటు వారే పార్టీలో ఉన్నా! కారణం దేశద్రోహం చెయ్యలేరు,అదిచాలు.
నెహ్రూ పండితుడు కాలం చేసిన రోజు.
అప్పటి ఉద్యోగంలో చేరి మూడేళ్ళు. వేసిన వత్తికి పోసిన చమురుకి హాని హానిగా నడుస్తున్న రోజులు. ఈ బతుకింతే రేడియో కూడా లేదనుకుని బాధ పడుతున్నరోజులు. ట్రాన్సిస్టర్ లు బహు ఖరీదు మాట. సంసారంలో ఏం లేవు. అయ్యవార్లంగారి నట్టిల్లు. ఒక రేడియో షాపతను రేడియో ఇన్స్టల్మెంట్ లో అమ్మేవాడు,అదిన్నీ వాల్వు రేడియో, నాలుగొందలు. నెలకి ఇరవై చొప్పున తీర్చేందుకు ఒప్పుదల. ఇంటి మాస్టారు హామీ. ఆ మాస్టారికీ రేడియో లేదు, అంచేత,ఇంట్లో ఒక రేడియో ఉంటుందిలే అనుకున్నట్టున్నారు. ఓ చిన్న మాట కూడా తగిలించారు, రేడియో కరంటుకి రూపాయి అదనం, నెలకి అని చెబుతూ. ఆ రోజుల్లో వార్త తెలియాలంటే రేడియో నే గతి. ఇంట్లో రేడియో పెడితే అసలు గది కాళీ ఉండేదికాదు. ఇంటిల్ల పాదీ రేడియో దగ్గరే ఉండేవారు. ఎవరిని ఏం అనగలం, అందరూ ఇంటివారు,వారి పిల్లలు, మేము అక్కడే ఎక్కడో బిక్కు బిక్కుమని కాలక్షేపం చేసేవాళ్ళం.రేడియో కొనుక్కున కొత్త రోజులు. ఒక రోజు మధ్యాహ్నం అప్పుడే డ్యూటి నుంచి వచ్చి రెండు మెతుకులు తిని తలుపులేసుకుని రేడియో పెట్టి,గచ్చు మీద చల్లదనానికి పడుకున్నా. రేడియో పెట్టగానే విషాద సంగీతం వస్తోంది, ఏవరో బాల్చీ తన్నేసేరు, ఎవరబ్బా అనుకుంటూ లేచి కూచున్నా! ఈలోగా రెండయింది, ఇంగ్లీష్ వార్తలు మొదలయ్యాయి. నెహ్రూ గారి మరణవార్త వినిపించింది.హతవిధీ బారత్ కి దిక్కెవరు చర్చలు మొదలయ్యాయి.......
జయహో భారత్
ఆపరేషన్ సిందూర్ తరవాత భారత్ నుంచి 7MP బృందాలు ప్రపంచం మొత్తమ్మీద పర్యటిస్తున్నాయి,భారత్ కి గత ఏడు దశాబ్దాలుగా టెర్రర్ తో జరుగు తున్న అన్యాయం చెప్పడానికి,ఆపరేషన్ సిందూర్ ని వివరించడానికిన్నీ. ఆ బృందాల్లో హేమాహేమీలున్నారు.అమెరికాలో పర్యటిస్తున్న బృందం లీడర్ శశి థరూర్ మాటాడుతూ నేను మా ప్రభుత్వం మాటాడిస్తున్నది చెప్పటం లేదు, మా దేశానికి జరుగుతున్న అన్యాయం గురించి మాటాడుతున్నానని నిప్పులు కక్కారు. అలాగే అసదుద్దీన్,కనిమొళి,సుప్రియ ఇలా అందరూ పాక్ మాలో మాకు మతపరమైన విభేదాలు కల్పించి టెర్రర్ ను కాపాడుకుంటూ మమ్మల్ని పాక్ ఇబ్బంది పెడుతోంది. మా దేశం టెర్రరిస్టులపై దాడి చేసింది తప్పించి పాక్ మీద కాదు. కాని పాక్ అది గుర్తించలేదు సరి కదా, టెర్రరిస్టులను వెనకేసుకొస్తూ మా మిలిటరీ మీద దాడి జరిపితే మేం తిప్పికొట్టేం తప్పించి మేము దాడి చేయలేదు. వారు మా పై కాల్పులు జరిపితే మేం జరిపేం. వారికి నష్టం ఎక్కువ జరిగి కాల్పుల విరమణకి జండా ఎత్తి మేం కాల్పుల విరమణకి అడిగినట్టు ప్రచారం చేసుకుంటోంది. ఇది గుర్తించండని చెప్పుకొచ్చేరనమాట. జయహో భారత్!
పాక్ సెనేటర్ సభలో మాటాడుతూ మనమీద నీటి బాంబు పడింది, దీనిని జాగర్త్తగా సరిచేసుకోకపోతే దేశంలో నూటికి తొంభై మంది ఆకలికి చావాలి అని సున్నితంగానే మందలించారు వారి ప్రబుత్వాన్ని. మరో చిత్రం మనదేశం పార్లమెంటు సభ్యుల బృందాల్ని విదేశాలకు పంపుతున్నట్టు తమరు కూడా ప్రయత్నం చేస్తున్నారు,ఇదీ కాపీయే. అన్నీ కాపీ,పేస్టు సరుకులే,స్వంత ఆలోచన ఉన్నట్టు లేనిదే!!
మళ్ళీ కోవిడ్?
Health first everything next.
ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపిన కరోనా మరోసారి పురి విప్పిందట. సింగపూర్ లో రోజుకి 12500 మందికి సోకిందని వార్త. మాస్కులు,దూరాలు,చేతులు కడగటం,మూతుల ముచ్చట్లు బంద్! లాక్ డవున్ తప్పదా? మళ్ళీ హాస్పిటల్,బెడ్లు షరా మామూలే! ఈ సారి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కర్చు రాసేసినట్టే!
మనకి సింగపూర్ ఎంత దూరం? రెండు గంటలేగా! అసలే మనకి సింగపూర్ వాళ్ళంటే చచ్చేటంత ప్రేమాయె! ఎగిరొచ్చేస్తుంది, తస్మాత్ జాగ్రత.