Tuesday 12 May 2020

లాక్ డవున్ తరవాత ఇలా ఉండద్దు


10 comments:

  1. ఇలా ఉండే అవకాశాలే ఎక్కువ ... అని నా అనుమానం.

    ReplyDelete
    Replies


    1. విన్నకోట సార్,
      Survival of the fittest. నిరూపితం కాబోతోందనుకుంటున్నానండి!

      Delete
  2. ఆహా ఎన్ని బిరియానీ బర్డ్స్ ఓ!

    ReplyDelete
    Replies
    1. సూర్యగారు,
      కరోనా మొదటి రోజుల్లో గుడ్లు అమ్మకాలు లేక పారబోసారు.అవి పిల్లలై పోయాయండి, పారబోసిమ చోట. కేజి ల్లో ఉన్నకోళ్ళని కావాలన్నవాళ్ళకి ఇచ్చేసారు, కొన్నిటిని వదిలేసారు, పంచి పెట్టేరండి, మేపలేక. ఒక సారైతే బిరియానీ ఫెస్టివల్ కూడా చేసారండి.

      Delete
    2. కొన్ని చోట్ల కోళ్లను సజీవసమాధి చేశారు కూడా కదండి. వదిలేస్తే వాటి బతుకు అవి బతికేవి కదా (లేదా కొందరి కంచాల్లో పలావు అయ్యేవి అది వేరే సంగతి లెండి, కానీ వదిలేస్తే వాటికొక అవకాశం ఇచ్చినట్లయినా అయ్యేది). మనిషి క్రూరత్వం.

      Delete
    3. విన్నకోట సార్,
      లారీలలో వేసుకుని పట్టుకెళ్ళి పంచిపేట్టేరండి. కొంతమంది ఊరకనే తీసుకోడానికి కూడా ఇష్టపడలేదండి. కోళ్ళని వదిలెయ్యచ్చు. కాని ఇవి కొన్ని వేలు.ఒకటి రెండు ఫారాలు కాదు. ఇలా కోళ్ళని వదిలేస్తే వాటి మూలంగా మనుషులకి కొన్ని అనారోగ్యాలు వచ్చేసావకాశమండి. అందుకే గోతిలో కప్పెట్టేస్తారు.ఇది తప్పనిదేనండి.వదిలేస్తే కేస్ పెడతారండి. అందుకే వీడియో తీసి ఉంచుకుంటారు.

      Delete
    4. ఓహో, అ ప్రమాదం ఉంటుందా 😳 ? హేవిటో 😒.

      Delete
  3. ఇవాళ (మే 15) సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడి 217వ జయంతి. గోదావరి, కృష్ణా జిల్లాల వారు స్మరించుకునే మహానుభావుడు 🙏.

    Sir Arthur Cotton


    Sir Arthur Cotton

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      గంగా దేవిని లక్ష్మీ రూపంలో అందజేసిన మహానుభావుడు కాటన్. వారంటే మా గోజిలవారికి అభిమానం మెండు. మొదటగా కాటన్ విగ్రహం గోజిలలో మా వూరు దుళ్ళ గ్రామంలో కాలవగట్టున పెట్టించినవారు శ్రీ యన్నమని లక్ష్మీ పతి అనే ఒక రైతు. ఆ తరవాతనే ధవళేశ్వరంలో గుర్రం మీద ఉన్న కాటన్ విగ్రహం ఆవిష్కరించారు. నేనున్న నేటి నావూరు అనపర్తిలో కూడా చాలా కాలం క్రితమే కాటన్ విగ్రహాన్ని ఊరి మధ్య ఉన్న అమ్మవారి గుడిలో ప్రతిష్టించారు, నిత్యమూ ఎవరో ఒక రైతు నీటితో అభిషేకం చేస్తారు.

      .

      నేడు లాక్డవున్ సందర్భంగా వలస కూలీలు రైతులు చూపిన గొప్ప మనసుకు తార్కాణమైన విషయం చెప్పాలి కాని కూర్చుని రాయలేని అశక్తత.చెప్పాలని ఉంది మనసు విప్పాలని ఉంది :)


      ధవళేశ్వరం అనకట్ట నాలుగు భాగాలు. ధళేశ్వరం దగ్గరున్నదానిని ధవళేశ్వరం భాగం అంటారు. చివరిది విజ్జేశ్వరం పగోజిలోది. దానిని విజ్జేశ్వరం భాగం అంటారు. మధ్యలో వాటిని ర్యాలి భాగం, మద్దూరు భాగం, పిచుకలలంక భాగం అని వివిధ పేర్లతో పిలుస్తుంటారండి.

      Delete