Thursday, 19 June 2025

మాలిక ఇక కనపడనట్టే...నా?

 మాలిక ఇక కనపడనట్టే...నా?


ఒకప్పుడు బ్లాగులు కొల్లలు. ఆగ్రిగేటర్లు కూడా చెప్పుకోదగిన లెక్కలోనే ఉండేవి. ఆగ్రిగేటర్లు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయాయి, కారణాలనేకం. నేను బ్లాగుల్లోకొచ్చేనాటికి ఉచ్చ దశలో ఉంది,బ్లాగ్ ప్రపంచం. గొప్ప గొప్ప అగ్రిగేటర్లన్నీ కనుమరుగైపోయాయి, కాలంలో. నిన్న మొన్నటి దాకా ఉన్న మాలిక కూడా నెమ్మదిగా కనపడకుండా పోయింది, మరి కనపడుతుందా? 


ఇక మిగిలిన ఏకైక ఆగ్రిగేటర్ శోధిని. శ్రీ శ్రీనివాస్ గారి దయ మా ప్రాప్తి.   

Saturday, 14 June 2025

కరోనా-నింబస్

 కరోనా-నింబస్


కరోనాకి వేరియంట్ ఒమిక్రాన్ అది కొంతకాలం పీడించింది. నెమ్మదిగా కరోనా తగ్గింది. జనాలు శ్వేఛ్ఛావాయులు పీల్చుకున్నారు. నాలుగేళ్ళయిందేమో, కరోనా మళ్ళీ మొదలయింది. ఇది ప్రపంచంలో అన్ని దేశాలను చుట్టుముడుతోంది. చిన్న దేశాలు తప్పించి మిగిలినవారు పలకటం లేదు. అగ్నేయాసియా దేశాల్లో జోరుగా వుంది. పశ్చిమదేశాల్లో బ్రిటన్,కెనడా, మొదలైన దేశాల్లోనూ అమెరికాలోనూ ఉంది. చైనా సంగతి తెలీదనుకోండి.  ఐక్యరాజ్య సమితివారు ఈ వేరియంట్ కి నామకరణం చేయలేదుగాని నింబస్ గా అనధికారికంగా పిలుస్తున్నారీ బుజ్జిని. 


దీని ప్రత్యేకతేంటీ అదిగదా  కొచ్చను. దగ్గు,రొంప,వగైరావగైరా అన్నీ మామూలే లచ్చనాలు. ప్రత్యేకతేమంటే గొంతులో కత్తులు  నూరినట్టుంటుందిట. (రేజర్ బ్లేడ్స్)అంటున్నారు. చాలా తొందరగా వ్యాప్తి చెందుతుందిట. మరణాలూ ఉన్నాయి. మనదేశంలోనూ ఉన్నది కాని బహు నెమ్మదిగా వ్యాపిస్తున్నది. మొత్తం దేశం మీద ఏడు వేల కేసులుంటే అందులో ఎక్కువ కేరళా,గుజరాత్,ఢిల్లీ, పశ్చిమ బంగ లో ఉన్నాయట. మిగిలిన దేశం మీద తక్కువే ఉన్నాయట. ప్రభుత్వాలు జాగ్రత్తలు  చెబుతున్నాయి,తీసుకోండి. మన ప్రాంతంలో సోకరాదనే నా అభిలాష.  సోకితే మందులు వేసుకుంటూ,  గొంతులో రేజర్ బ్లేడ్స్ అనిపిస్తే వేడి నీళ్ళలో రాళ్ళ ఉప్పు కరిగించి గోరువెచ్చగా ఉండగా గొంతులో పోసుకుని గరగరలాడించి,ఉమ్మేయండి. ఇది రోజుకి మూడు నాలుగుసార్లు పైగా చేయచ్చు. ఆపై నిప్పుల కుంపటి దగ్గర కూచోండి,  కొద్ది దూరంగా కాలకుండా. ఆపై కుంపటి  మీదకి వంగి నోరు బాగ తెరిచి వేడి  గొంతులోకి పోయేటట్లు కాచండి,గొంతును. చాలా శమనగా ఉంటుంది.  

ఆరోగ్యమస్తు. 

 

https://www.thehealthsite.com/news/covid-19-cases-in-india-live-updates-13-june-2025-new-coronavirus-variant-nimbus-nb-1-8-1-sparks-panic-with-razor-blade-throat-and-severe-symptoms-active-cases-1229923

Thursday, 12 June 2025

ముక్కుపిండి వసూలు చేస్తా!

ముక్కుపిండి వసూలు చేస్తా!


ముక్కుపిండి వసూలు చేస్తా!నన్నమాట వింటుంటాం. ఏంటబ్బా అనుకున్నా ఇంతకాలమూ. 

శరీరం లో నొప్పులు మెడ నొప్పి,వెన్ను నొప్పి,సయాటికా నొప్పి ఇలా వివిధ నొప్పులకు అస్థిపంజరంలోని ప్రతి ఎముకను నొక్కి సరి చేసున్నవారు, డాక్టర్లు ఎక్కువ కనపడుతున్నారు, ఉత్తరాదిని. మనదాకా ఇంకా వచ్చినట్టు లేదిది.  ప్రతి భాగాన్ని విరిచినప్పుడు ఒక చిన్న శబ్దం, దాన్ని రోగికి వినిపించేందుకు డాక్టర్ చేతికో పరికరం, ఇలా నడిచిపోతోంది.  డాక్టరు  పడుకోబెట్టి,కూచోబెట్టి, మీదపడి, మెడవిరిచి ఇలా ఈ కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. చూడ్డానికి కొంత ఎబ్బెట్టుగానే ఉంది. ఇందులో డాక్టర్లు ఆడ మగ కూడా, ఈ మీదపడి కౌగలించుకున్నంత పని చేసిజేసి, సున్నితభాగాలని తడుముతూ కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగమే ముక్కు పిండడం కూడా అలా ముక్కు  దూలం విరిస్తే శ్వాస బాగా ఉన్నట్టు అలా  విరిపించుకున్నవారి హావ భావాలు తెలుపుతున్నాయి. మరి ఇలా ముక్కు పిండిన డాక్టరు డబ్బులు పుచ్చుకోడా?  అదే ముక్కుపిండి వసూలు చేయడం అనుకుంటా. 

 

ఒకప్పుడు పెద్దవాళ్ళైన స్త్రీలు పిల్లల పట్ల ప్రేమ తెలియచేయడానికి మెటికలు విరిచేవారు,గుర్తుందా? 


గురజాడ కన్యాశుల్కంలో ఒక పాత్రచేత మొల్లో చెయ్యేసి సొమ్ము వసూలు చేసుకురమ్మన్నాడు, మా పంతులు అంటాడు గిరీశం తో, సానిదానితో తీయించుకున్న ఫోటోల సొమ్ముకోసం. ఈ మొలలో చెయ్యివేసి వసూలు చేయడమేమిటన్నది కొచ్చను. పాత కాలంలో మొలలో దాచుకునేవారు రూపాయలు, దానిలోంచి తీసుకుంటానని అర్ధం అనుకున్నా! కాదని తెలిసింది. మొలలో చెయ్యేసి అంటే గుడ్డలూడదీసి వసూలు చేస్తాననిట. అంటే గుడ్డలిప్పి పరువుతీసి..... అదీ కత.పరువున్నవాడికైతే కదా! అదీ పాయింటు...   

Monday, 9 June 2025

అన్నీ..కొంచం..కొంచం..వార్తలు

అన్నీ..కొంచం..కొంచం..వార్తలు


ఋతుపవనాలు కరుణించలేదింకా. 40,41 మండుతూనే ఉంది. మరో నాలుగురోజులిలా అంటున్నారు.

**

కరోనా దేశాలన్నిటినీ చైనాను కూడా పట్టిపీడిస్తున్నట్టు వార్తలున్నాయి. మరి అమెరికా 

,యూరప్ ల సంగతే తెలీదు. భారత్ లో కూడా కాలు పెట్టింది,కాలు పెట్టి వారంపైగా ఐనా నిన్నటికి కేసులు 6000 లకి చేరలేదు. ఇంకా ఎక్కువ కాల/నందుకు ఎర్ర పత్రికలు ఏడుస్తున్నాయి. పుట్టింటివారి చుట్టాలు,మహరాష్ట్ర,ఢిల్లీ లో మాత్రమే కేసులు ఎక్కువగా ఉన్నాయి.పుట్టింటివారి చుట్టాల రాష్ట్రంలోనే ఎక్కువున్నాయి. మరో బూస్టర్ డోస్ అవసరం లేదన్నట్టు వార్తలు. ఇదివరలో చేసిన వాక్సీన్ పని చేస్తున్నట్టుందని వార్తలు. 

**

మరో పాథొజన్ పై ఒక చైనీయుడు అమెరికా యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్నాడు,చైనా నుంచి మొక్క తెప్పించుకుని. ఆ చైనీయుడి గర్ల ఫ్రెండ్ నఏనూ దానిమీద పరిశోధన చేస్తా అని ఆ మొక్కని చైనా నుoచి అమెరికా తెప్పించుకుంది. ఈ మధ్య చెకింగులు ఎక్కువయ్యాయై, అందునా యూనివర్సిటీ లపై,అమెరికాలో. ఇదేమి మొక్క వివరాలు తీగ లాగితే డొంక కదిలింది. ఈ పాథోజన్ ను మొక్కలపై ప్రయోగిస్తే ఆహార పదార్ధాలు పండించే అన్ని మొక్కలూ నెమ్మది నెమ్మది ఉత్పాదన తగ్గి, తరవాత చచ్చిపోతాయని తేలింది. దీంతో ఆ ఇద్దరిని పట్టుకుని అరస్టు చేసి తీగ లాగితే ఇద్దరూ చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యులని, గూధచారులు కావచ్చేమోనని అనుమానం.    

**

గ్రేటా  తన్ బర్గ్ గుర్తుందా? ఒకప్పుడు భారత్ ను అల్లరిపెట్టింది. ఇప్పుడు ఇస్రయెల్ ని అల్లరిపెట్టాలని బయలుదేరింది. ఇస్రయెల్ ఒకటే మాట చెప్పింది. ఇస్రయెల్ జలాలలోకి అనుమతింపబడని నౌక ఏదీ రాలేదు. వెనక్కి తిరిగిపో! గౌరవంగా ఉంటుంది. నువు తెచ్చే ఒక మూటా సరుకులు ఒకళ్ళికి కూడా సరిపోవు. కాదని మొండికేసి ముందుకొస్తావా? చేయవలసిన పని నా నౌకాదళం  చేస్తుంది అని ఒక్కటే వారినింగ్ ఇచ్చింది...చూడాలి...  

**

బీహార్,బెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కాంగ్రెస్ కి మళ్ళీ ఓటింగ్ మెషీన్ల భూతం పట్టుకుంది. 

** 

Monday, 2 June 2025

అప్రస్తుత ప్రసంగం.

 అప్రస్తుత ప్రసంగం.


నేను పుట్టినకాలం నాటి ముచ్చట. ఆ రోజుల్లో వినోదం అంటే తోలుబొమ్మలాట. ఈ తోలుబొమ్మలాడించే కళాకారులు రామాయణ,భారత,భాగవతాల్లో అంశాలు చెబుతుండేవారు,తోలుబొమ్మల సాయంతో. ఈ ఆట కొంత నడిచిన తరవాత తెరపై కేతిగాడు ఉరఫ్ జుట్టుపోలిగాడు ఉరఫ్ గాందోళిగాడు,బంగారక్కల బొమ్మలను తెరపై వేసి అసందర్భ ప్రసంగం చేసి హాస్యం పుట్టించేవారు. ఆ తరవాత కాలంలో ఈ హాస్యం శృతి మించి రాగానపడినట్టు బూతులు చోటు చేసుకున్నాయి.  సరే ఆ తరవాత అవి సినిమా,టివి లకీ చేరిపోయాయి.  హాస్యం అపహాస్యమూ అయింది. 


ఇంతకీ ఇదెందుకు గుర్తొచ్చిందీ? అదీ కొచ్చను. 96 ఏళ్ళ వృద్ధ తోలుబొమ్మలాట కళాకారిణికి పద్మ అవార్డు ఇవ్వడం జరిగింది. అప్పుడు గుర్తొచ్చింది, నాటి కాలంలో,   ఆంధ్ర ప్రాంతంలో మా వూరు నరిసిపూడి, ఈ తోలు బొమ్మలాటకి ప్రసిద్ధి పొందింది. అంతే కాదు నాటి తోలుబొమ్మలాట కళాకారులకు  మా పూర్వీకులు గురువులు. అదీ బాదరాయణ సంబంధం,ఇదో అప్రస్తుత ప్రసంగం.               

 

కాలంలో ఇది సాహిత్యంలోనూ చోటు చేసుకుంది. భాసుని మృఛ్ఛకటిక నాటకంలో శకారుడు,(రాణీగారి తమ్ముడు, అనధికార కేంద్రం),  మాటల ద్వారా హాస్యం పండింప జేసేరు. ఆ తరవాత కాలంలో తెనుగులో గురజాడవారు  తమ కన్యాశుల్కం నాటకం ద్వారా ఈ రకపు హాస్యాన్ని పండించడం చేసేరు. గిరీశం, బుచ్చమ్మల ద్వారా     అపహాస్యపు మాటల  ద్వారా, హాస్యం కొంత పండింప జేసేరు. ఆ నాటిక అవసరం నేటి కాలానికి లేకపోయినా,ఆ సమస్య చచ్చిపోయినా,కొందరు నేటికీ ఆ నాటికను వేస్తూ,చచ్చిన గుర్రాన్ని తోలుతూనే ఉన్నారు ( ఏదో కారణం ఉండి ఉంటుంది) ఇది నేటి కాలానికి అప్రస్తుతం .    మృఛ్ఛకటకం, కన్యాశుల్కాలని పోలిస్తే భాసుడు శకారుణ్ణి సృష్టిస్తే గురజాడ గిరీశాన్ని పుట్టించారు. భాసుడు ఒక హీరోని,హీరోయిన్ గా ఒక వేశ్యను పుట్టించి, చివరికి వేశ్యను ఉదాత్త పాత్ర చేసేరు. అలాగే గురజాడ భాసుని హీరో విలన్ లను కలిపేసి గిరీశాన్ని తయారు చేసి,మథురవాణి అనే వేశ్యను ఉదాత్తం చేసేరు. గురజాడ  నాటికకు భాసుని నాటిక ఉత్తేజమా? ఏమో తెలిసినవారు చెప్పాలి. ఇదీ అప్రస్తుత ప్రసంగమే! డామిట్ కథ అడ్డం తిరిగింది. ఎక్కడబ్బా? 

  

ఇక అష్టావధానం అనేది ఒక కవితా ప్రక్రియ. చెళ్ళపిళ్ళ వారి ద్వారా అది ప్రజల దగ్గరకు చేరింది. అందులో ఒక అప్రస్తుత ప్రసంగితో ప్రసంగం కూడా ఒక ప్రక్రియ. ఇలా ప్రస్తుత ప్రసంగం కవులనూ చేరింది. ఇందులోనూ  హాస్యంచోటు చేసుకుంది, ఒక్కొకపుడి అపహాస్యం కూడా అవుతోంది.  


కొద్ది మోతాదులో అప్రస్తుత ప్రసంగం కూడా బాగుంటుందేమో సుమా!

 ఇదీ నేటి కాలానికి అప్రస్తుత ప్రసంగం.  

Sunday, 1 June 2025

వివేచన-రసజ్ఞత.

 వివేచన-రసజ్ఞత.   


నిన్నటి టపాకి వచ్చిన లక్కరాజువారికామెంటుకి సమాధానం రాయబోతే టపా ఐపోయింది. నిన్నటి టపాకి తదుపరి మరియు అనుసంధానం. 


మొదటి ఉపమానంలో ఎదురుగా ఉన్నది నిశ్చలం,బుద్ధి లేనిది, అందుచేత వివేచన మనకే కావాలి. అది పైకి కనపడుతున్నట్టు అందమైనదో కాదో తేల్చుకోవలసింది మనమే!

 

ఇక రెండవదానిలో ఉపమానం బురదపంది కదులుతుంది, ఎలా కదులుతుందో మనం బుద్ధితో ఊహించాలి,దానికి నిశ్చయం ఉండదు. ఇక్కడా మనమే వివేకం ఉపయోగించాలి. ఉపమానం బురదపంది కాని అందంగా కనపడే బురద పంది లాటి మనుషులూ తారసపడతారు. వారు బుద్ధి ఉపయోగించరు, అందుచేత మనమే బుద్ధి ఉపయోగించి దూరంగా ఉండాలి. ఎంత దూరం అది తెలుసుకోగలగడమే విజ్ఞత, దానిని ఆచరించడమే రసజ్ఞత.  ఇది హార్వర్డ్ లోనూ ఈటన్ లోనూ నేర్పరు,నేర్పలేరు. అదంతే! వయసుతో చదువుతో వివేచన పెరగాలి,బుద్ధి పెరగాలి.  


ఇక మూడవదానిలో ఇద్దరూ చలనం,బుద్ధి ఉన్నవారే, చదువుకున్నవారే!  ఎదుటివారు మూర్ఖులు అని తెలుసుకోగలగడమే విజ్ఞత,ఎవరు మూర్ఖులు? దీనికిదివరలో సమాధానం చెప్పడం జరిగింది,వెతుక్కోవచ్చు.  అది తెలిసి ఎంతదూరంలో ఉండాలి? ఎంత మాటాడాలి ? ఎప్పుడు మాటాడాలి ? తెలుసుకోవడం విజ్ఞత , వీటిని తెలుసుకుని ఆచరించడమే రసజ్ఞత. 

త్వం శుంఠ అంటే త్వం అంటారు, ఇది లోక రీతి.    ఇది విజ్ఞత, చదుతో నిమిత్తం లేదు దీనికి. అందుకే చదువది ఎంతగల్గిన అన్నారు శతక కర్త! ఇదెవరిని ఉద్దేశించినది కాదు, ఎవరేనా భుజాలు తడుముకుంటే నాకు బాధ్యత లేదు. మన్నించండి.     

   


 

Saturday, 31 May 2025

అశుద్ధం మీద

 అశుద్ధం మీద 


అశుద్ధం మీద రాయి వేస్తే ముఖాన చిందుతుందని ఒక నానుడి. అశుద్ధం అని తెలిసి, రాయి వేస్తే చిందుతుందని తెలిసి, రాయి వెయ్యకూడదు. దూరంగా ఉండాలి.


బురద లో పొర్లిన పంది రోజుకుంటూ ఎదురొస్తే మనమే తప్పుకోవాలి. లేకపోతే ఒంటినిండా బురద విదిలించి పోతుంది, దీనికి జ్ఞానం ఉండదు, జ్ఞానం కల మనమే దూరంగాఉండాలి.


చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు అన్నది పెద్దలమాట. మూర్ఖుడు అని తెలిసి వారితో వాద,సంవాద,ప్రతివాదాలు చేయడమే మూర్ఖత్వం. అందుచేత మూర్ఖునికి దూరంగా ఉండాలి. 



చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా

చదువు నిరర్థకంబు గుణసంయుతులు మెచ్చ రెచ్చటం

బదునుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం

పొదవెడు నుప్పు లేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!

Friday, 30 May 2025

పుణ్యానికి పోతే

 పుణ్యానికి పోతే


పుణ్యానికి పోతే పులెత్తుకుపోయిందని సామెత! అలాగా శశి థరూర్,అసదుద్దిన్,కనిమొళి,ఇలా పార్లమెంటు సభ్యులు ఏడు బృందాలుగా ప్రపంచం మీద పర్యటిస్తూ పాక్ దుశ్చర్యలను ఎండగడుతూ మన దేశపు ఇబ్బందులను, ఎట్టి పరిస్థితులలో లక్ష్మణ రేఖను దాట వలసి వచ్చిందో వివరిస్తున్నారు.


ఈ బృందాల్లో శశిథరూర్,అసదుద్దీన్ ముఖ్యంగా మెరిసారు. శశి థరూర్ కాంగ్రెస్ వాడయి ఉన్నా, పార్లమెంటు లో విదేశీ వ్యవహారాల సబ్ కమిటీ   అద్యక్షుడు, దేశం ముందు తరవాతే కుటుంబమని విషయాల్ని చెబుతోంటే వారి పార్టీ వారే  తిట్టిపోస్తున్నారు. నిన్ను బి.జె.పి, విదేశీ వ్యవహారాల మంత్రిగా చేసుకుంటుందనీ వైన వైనాలుగా దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక సదుద్దీన్ ఏ పార్టీ వాడైనా మెచ్చుకోవలసిందే.    


జయహో! విదేశాల్లో పర్యటిస్తున్న బృందాలకి, ముఖ్యంగా శశి థరూర్,అసదుద్దిన్ లకు జయ! జయహో!! 


శశి థరూర్,అసదుద్దీన్ లకే నావోటు వారే పార్టీలో ఉన్నా! కారణం దేశద్రోహం చెయ్యలేరు,అదిచాలు.  

Tuesday, 27 May 2025

నెహ్రూ పండితుడు కాలం చేసిన రోజు

 నెహ్రూ పండితుడు కాలం చేసిన రోజు. 


అప్పటి ఉద్యోగంలో చేరి మూడేళ్ళు. వేసిన వత్తికి పోసిన చమురుకి హాని హానిగా నడుస్తున్న రోజులు. ఈ బతుకింతే రేడియో కూడా లేదనుకుని బాధ పడుతున్నరోజులు. ట్రాన్సిస్టర్ లు బహు ఖరీదు మాట. సంసారంలో ఏం లేవు. అయ్యవార్లంగారి నట్టిల్లు. ఒ రేడియో షాపతను రేడియో ఇన్స్టల్మెంట్ లో అమ్మేవాడు,అదిన్నీ వాల్వు రేడియో, నాలుగొందలు. నెలకి ఇరవై చొప్పున తీర్చేందుకు ఒప్పుదల. ఇంటి మాస్టారు హామీ. ఆ మాస్టారికీ రేడియో లేదు, అంచేత,ఇంట్లో ఒక రేడియో ఉంటుందిలే అనుకున్నట్టున్నారు. ఓ చిన్న మాట కూడా తగిలించారు, రేడియో కరంటుకి రూపాయి అదనం, నెలకి అని చెబుతూ.  ఆ రోజుల్లో వార్త తెలియాలంటే రేడియో నే గతి.  ఇంట్లో రేడియో పెడితే అసలు గది కాళీ ఉండేదికాదు. ఇంటిల్ల పాదీ రేడియో దగ్గరే ఉండేవారు. ఎవరిని ఏం అనగలం, అందరూ ఇంటివారు,వారి పిల్లలు, మేము అక్కడే ఎక్కడో బిక్కు బిక్కుమని కాలక్షేపం చేసేవాళ్ళం.రేడియో కొనుక్కున కొత్త రోజులు. ఒక రోజు మధ్యాహ్నం అప్పుడే డ్యూటి నుంచి వచ్చి రెండు మెతుకులు తిని తలుపులేసుకుని రేడియో పెట్టి,గచ్చు మీద చల్లదనానికి పడుకున్నా. రేడియో పెట్టగానే విషాద సంగీతం వస్తోంది, ఏవరో బాల్చీ తన్నేసేరు, ఎవరబ్బా అనుకుంటూ లేచి కూచున్నా! ఈలోగా రెండయింది, ఇంగ్లీష్ వార్తలు మొదలయ్యాయి. నెహ్రూ గారి మరణవార్త వినిపించింది.హతవిధీ బారత్ కి దిక్కెవరు చర్చలు మొదలయ్యాయి.......  

Monday, 26 May 2025

జయహో భారత్

 జయహో భారత్

ఆపరేషన్ సిందూర్ తరవాత భారత్ నుంచి 7MP బృందాలు ప్రపంచం మొత్తమ్మీద పర్యటిస్తున్నాయి,భారత్ కి గత ఏడు దశాబ్దాలుగా టెర్రర్ తో జరుగు తున్న అన్యాయం చెప్పడానికి,ఆపరేషన్ సిందూర్ ని వివరించడానికిన్నీ. ఆ బృందాల్లో హేమాహేమీలున్నారు.అమెరికాలో పర్యటిస్తున్న బృందం లీడర్ శశి థరూర్ మాటాడుతూ నేను మా ప్రభుత్వం మాటాడిస్తున్నది చెప్పటం లేదు, మా దేశానికి జరుగుతున్న అన్యాయం గురించి మాటాడుతున్నానని నిప్పులు కక్కారు. అలాగే అసదుద్దీన్,కనిమొళి,సుప్రియ ఇలా అందరూ పాక్ మాలో మాకు మతపరమైన విభేదాలు కల్పించి టెర్రర్ ను కాపాడుకుంటూ మమ్మల్ని పాక్ ఇబ్బంది పెడుతోంది. మా దేశం  టెర్రరిస్టులపై దాడి చేసింది తప్పించి పాక్ మీద కాదు. కాని పాక్ అది గుర్తించలేదు సరి కదా, టెర్రరిస్టులను వెనకేసుకొస్తూ మా మిలిటరీ మీద దాడి జరిపితే మేం తిప్పికొట్టేం తప్పించి మేము దాడి చేయలేదు. వారు మా పై కాల్పులు జరిపితే మేం జరిపేం. వారికి నష్టం ఎక్కువ జరిగి కాల్పుల విరమణకి జండా ఎత్తి మేం కాల్పుల విరమణకి అడిగినట్టు ప్రచారం చేసుకుంటోంది. ఇది గుర్తించండని చెప్పుకొచ్చేరనమాట. జయహో భారత్!


పాక్ సెనేటర్ సభలో మాటాడుతూ మనమీద నీటి బాంబు పడింది, దీనిని జాగర్త్తగా సరిచేసుకోకపోతే దేశంలో నూటికి తొంభై మంది ఆకలికి చావాలి అని సున్నితంగానే మందలించారు వారి ప్రబుత్వాన్ని. మరో చిత్రం మనదేశం పార్లమెంటు సభ్యుల బృందాల్ని విదేశాలకు పంపుతున్నట్టు తమరు కూడా ప్రయత్నం చేస్తున్నారు,ఇదీ కాపీయే. అన్నీ కాపీ,పేస్టు సరుకులే,స్వంత ఆలోచన  ఉన్నట్టు లేనిదే!!   

ఈ సందర్భం లో పాక్ ని సమర్ధిస్తూ ఆయుదాలు ఇచ్చిన చైనా,టర్కీ, అజర్ బైజాన్ లు టెర్రరిస్టులను సమర్ధించే నైజం  వెళ్ళగక్కేయి, బోర్లపడ్డాయి. 
దేశంలో ఈ బృందాలని పంపడంలో రాజకీయాలు నడిపిన రాహుల్ గాంధి,మమత బెనర్జీలు అపహాస్యం పాలయ్యారు. 

Friday, 23 May 2025

Notification

 Notification


మళ్ళీ కోవిడ్?


మళ్ళీ కోవిడ్?

Health first everything next.

ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపిన కరోనా మరోసారి పురి విప్పిందట. సింగపూర్ లో రోజుకి 12500 మందికి సోకిందని వార్త. మాస్కులు,దూరాలు,చేతులు కడగటం,మూతుల ముచ్చట్లు బంద్! లాక్ డవున్ తప్పదా? మళ్ళీ హాస్పిటల్,బెడ్లు షరా మామూలే! ఈ సారి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కర్చు రాసేసినట్టే! 


మనకి సింగపూర్ ఎంత దూరం? రెండు గంటలేగా! అసలే మనకి సింగపూర్ వాళ్ళంటే చచ్చేటంత ప్రేమాయె! ఎగిరొచ్చేస్తుంది, తస్మాత్ జాగ్రత.



Sunday, 4 May 2025

ఆణి ముత్యాలు.

 ఆణి ముత్యాలు.


మాయలు గల్గుదుష్టులకు మాయపుభంగులె మందు గాక ని

ర్మాయత నులసిల్లెడుపరాక్రమలీలలు గొల్చు నెట్లు దై

తేయులు దొల్లి మాయల నతిప్రబలాత్మకు లైన  దద్వధో

పాయములన్ జయింపరె నృపాలక విష్ణుడు నింద్రుడున్ దగన్. 

" శ్రీకృష్ణుడు. " 

ఆంధ్ర మహాభారతం.శల్యపర్వం.ద్వి.ఆ.52


మాయలు గల్గిన ప్రబలమైన దుష్టులను మాయలతోనే జయించాలి.



ప్రపంచం మొత్తం ఛీకొడితే మీ తాటతీస్తామమని భారత్ అంటే పాక్ మంత్రులనోట వెలువడుతున్న నిజపు ఆణిముత్యాలు.  


టెర్రరిసం అనే పాకీ పని (డర్టీ జాబ్) అమెరికా బ్రిటన్,పశ్చిమదేశాలకోసం,వాటి పనుపున గత మూడు దశాబ్దాలుగా చేస్తూనే ఉన్నాం, అని పాక్ విదేశాంగ మంత్రి మాట. 


మరోమంత్రి బిలావల్ భుట్టో, జుల్ఫికార్ ఆలీ భుట్టో గుర్తున్నాడా? ఆయన మనవడే,కూతురు కొడుకు. ఈయన తల్లిని టెర్రరిస్టులే చంపేరు. తాత  ఉరితీయబడ్డాడు. వారు శలవిచ్చిన మాట. టెర్రరిస్టులని మేము పెంచి,పోషిస్తున్న మాట్ జగద్విదితం, ఈవేళ కొత్తమాట కాదు..


 

Tuesday, 15 April 2025

మనమే!

మనమే!


 ఆఫీసు వారిచే “రిటైర్డ్” అని ప్రకటించబడిన తర్వాత, అప్పటి నుండి సమయాన్ని గడపడం అనేది అన్ని ఉద్యోగులకు మరియు ఎగ్జిక్యూటివ్‌లకు తలపోటుగా మారుతుంది. 


ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి, ప్రజలు వివిధ మార్గాలు మరియు పద్ధతులను అభివృద్ధి చేసుకున్నారు.  


1. కొంతమంది కష్టపడే బృందానికి చెందిన వ్యక్తులు వెంటనే ‘రామూ కాకా’ పాత్రలోకి మారిపోతారు. ఉదయం త్వరగా లేచి, తలకు తువ్వాలు వేసుకొని, ఇంటిని శుభ్రపరచడం, వంటలు చేయడం మొదలుపెట్టేస్తారు. మిగతా రోజంతా భార్యకు డ్రైవర్ సేవలు అందించడం, షాపింగ్ చేయడం, సినిమాలు చూపించడం వంటివి చక్కగా నిర్వహిస్తారు. ఇలాంటి వ్యక్తుల భార్యలు గత జన్మలో ఎంతో పుణ్యాలు చేసి ఉండాలి, అందుకే ఈ అమృత సమాన జీవితాన్ని అనుభవిస్తున్నారు!  


2. మరికొంతమంది రిటైర్మెంట్ తర్వాత అకస్మాత్తుగా మతపరంగా మారిపోతారు. ఉదయం, సాయంత్రం రెండు గంటలపాటు దేవాలయాల్లో పూజలు, భజనలు, కీర్తనలతో సమయం గడుపుతారు. కానీ గతంలో ఒక్కసారి కూడా దేవాలయంలోకి పాదం పెట్టని వారు, ఇప్పుడు తమ పాపాలు క్షమించబడతాయని భావిస్తున్నారు.  


3. *ఇంకొంతమంది రిటైర్ అయిన వెంటనే తమలో వాల్మీకి, తులసీదాస్ ఆత్మలు ప్రవేశించినట్లు కవులు, రచయితలు అయిపోతారు. ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో తమ రచనలతో మిత్రులను ఇబ్బంది పెట్టినా, వారు మౌనంగా ప్రశంసించక తప్పదు.  


4. *కొందరికి ఉద్యోగ జీవితంలోనే రాజకీయాలపై ఆసక్తి ఉంటుంది. తమకు ప్రజాదరణ ఎంతో ఉందనే భ్రమలో, రిటైర్మెంట్ తర్వాత ఏదో రాజకీయ పార్టీలో చేరి ఎన్నికల బరిలోకి దిగుతారు. కానీ ఘోరంగా ఓటమి చెంది, ఆరాధన అంటే అధికారం ఉన్నప్పుడు మాత్రమే అని గ్రహిస్తారు. తర్వాత పార్టీ ఆఫీసుల బయట శనగలు తింటూ కనిపిస్తారు.  


5. ఇంకొందరికి వారు ఎన్నో సంవత్సరాలుగా వుంటున్న కాలనీ లో సర్వీస్ లో ఉన్నన్ని రోజులు ఏ సమస్యని పట్టించుకోని వారు రిటైర్ అవుతూనే తాము ఎప్పుడో చదివిన సర్టిఫికెట్స్ బైటకి తీసి లాయర్ గా రిజిస్టర్ చేసుకొని వారు ఉంటున్న ప్రాంత రాజకీయాలపై ఆసక్తి చూపిస్తూ తాము ఇబ్బంది పడుతూ అందరినీ ఇబ్బందిపెడుతూ అలా అని వారికి ఇక డబ్బుతో అవసరం ఉండదు కాబట్టి సేవ చేస్తామని ఉబలాట పడుతుంటారు.


6. *ఇంకొంతమంది రిటైర్డ్ పెద్దలు ఇంట్లో పనికిరాని వ్యక్తులుగా భావించబడతారు. అందుకే వారు ఇంటి నుండి బయటకు వెళ్లడానికి ఒక ఎత్తుగడ కనుగొంటారు—ఉదయం పది అయ్యాక బ్యాంక్ పాస్‌బుక్‌లు తీసుకుని ఏదైనా బ్యాంకులోకి వెళ్లి గంటన్నర సమయం గడుపుతారు. బ్యాంక్ ఉద్యోగులు వీరిని కస్టమర్లకంటే స్టాఫ్‌గానే భావిస్తారు.  


7. పైవన్నింటికంటే ఎక్కువమంది రిటైర్డ్ వ్యక్తులు స్నేహితులతో కలిసి కాలనీ పార్క్‌లలో కూడి, ప్రభుత్వాన్ని దూషించడం, తమ సాహస కథలు చెప్పడం వంటి పనులతో కాలం గడుపుతారు. కానీ వీరిలో ఎవరూ తమ ఉద్యోగ కాలంలో ఏమీ ప్రత్యేకం చేయనట్లు కనిపిస్తుంది.  


8. *కొంతమంది రిటైర్డ్ స్నేహితులు ఇంట్లోనే ఎక్కువ సమయం గడపడాన్ని ఇష్టపడతారు. వారి పిల్లలు, కోడళ్ళు చిన్న పిల్లల్ని వారికి అప్పగించి ఆఫీసు లేదా సినిమాలు చూడటానికి వెళ్తారు. అప్పుడు వారు తాతలుగా మారి, పిల్లల సంరక్షణలో విలువైనవారవుతారు. కొందరు విదేశాల్లో ఉన్న తమ పిల్లల వద్ద నెలల తరబడి బాలల సంరక్షణ సేవలు అందిస్తూ ధన్యతను అనుభవిస్తారు.  


9 మరికొందరు ముఖంలో ఇప్పటికీ ప్రకాశించే ఉత్సాహం కలిగి ఉంటారు. అలాంటి వారిని చూసి అనేకులు వారి అనుభవాలు వినడానికి, గౌరవించడానికి చుట్టూ సేకరిస్తారు.  


10. *ఇంకొంతమంది తమ ఉద్యోగ జీవితంలోని కథలు చెప్పాలనే ఆశతో పార్కుల్లో తిరుగుతుంటారు. ఎందుకంటే ఇంట్లో భార్యకు విసుగు, పిల్లలు మొబైల్‌లో మునిగిపోయి వినరు.  


11. ఇంకొందరు ఆఫీసు రోజుల్లో తాగిన చాయ్‌ను మిస్ అవుతూ, వీధి మూల టీ స్టాల్స్ మరియు పాత మిత్రులను వెతుక్కుంటూ తిరుగుతుంటారు—కానీ ఇంట్లో షుగర్, వయస్సు అనే పేరుతో నిషేధాలు ఎదురవుతాయి.  


ఈ వివరణలో మీకు మీరే కనిపిస్తున్నారా?  


ఈ సందేశాన్ని ఇతరులకు పంపండి—వారు త్వరలోనే ఈ జాబితాలో చేరవచ్చు!  


మీ స్థానం మీరు ఎంచుకోండి.  

మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను!

COURTESY:Whats app

Friday, 11 April 2025

కత మొదలయింది.

 కత మొదలయింది. 


ముంబై పేలుళ్ళ సూత్రధారి,పాక్ లో పుట్టి,అక్కడ సైన్యంలో పనిజేసి కెనడా పౌరుడిగా చెలామణీ అవుతున్న తహవ్వుర్ హుసైన్ రాణా ను అమెరికా ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి ఢిల్లీలో అప్పగించింది,ఒప్పందం ప్రకారం,ఆదేశపు కోర్ట్లు తీర్పులిచ్చిన తరవాత. ఇంకిప్పుడు మొదలయింది భారత్ లో కత......అదెటులంటేని...


అతను మా దేశపు పౌరుడు కాదు, చాలా కాలం కితమే దేశం వదలిపోయాడు అని సన్నాయి నొక్కులు నొక్కింది పాక్ ఎంబసీ.


తహవ్వుర్ని అమెరికా తీసుకొచ్చి అప్పజెప్పింది తప్పించి అతన్ని అమెరికాలో అరస్టు చెయ్యలేకపోయారు,ఇక్కడికొచ్చాకానే అరస్టు చేసి కోర్టుకి తీసుకెళ్ళేరు,ఇందులో మీగొప్పమే అని ఇంకా ఎవ్వరూవాక్రుచ్చలేదు. 


అది మీ గొప్పేం కాదు,మేమెప్పుడో ఉత్తరం రాశాం  అమెరికాకి,అన్నారు కాంగ్రెస్ వాదులు.


కేస్ ఆరునెలల్లో తేల్చెయ్యచ్చు అన్నారు చిదంబరం మహాశయులు. అదేమో?


ఇతను ఒక చిన్న చేప పెద్దచేపలు ఇంకా దొరకనే లేదూ అని శలవిచ్చారో మాజీ.....


హక్కుల సంఘాలవారింకా రాగం మొదలెట్టలేదేమో.... మందులు,వైద్యం సరిగా అందటం లేదు.బిరియానీ పెట్టటం లేదు వగైరా వగైరా...ఎర్రమిత్రుల మాటే వినబడలా....


కపిలులు,మనువులు,గొపగొప్ప కొమ్ములు తిరిగినవారు ఏం వాదిస్తారో చూడాలి. 


అతను హిందువయ్యా! పేరు చివర రాణా లేదూ? అది హిందువుల పేరు. ఆర్.ఎస్.ఎస్ తమవాడినొకడిని పాక్ పంపి ఇదంతా చేయించి ప్లాన్ చేసింది అని ఇంకా ఏ డిగ్గీగారూ అనలేదేమా?


నడుస్తున్న కత చూడాలి..

Wednesday, 9 April 2025

గొప్ప

 గొప్ప

ఒకప్పుడు ఒకరి గొప్ప మరొకరు గుర్తించి చెప్పేవారు.

నేడు ఎవరిగొప్ప వారే చెప్పేసుకుంటున్నారు,మరికరికి ఆ సావకాశం ఇవ్వడమెందుకని 🤣👌❤

Monday, 7 April 2025

బందీ!

 బందీ!

బందీ!
ఉదయమే ఆరు గంటలకి బాలభాస్కరుడు రెండు బిల్డింగుల మధ్య ఇలా బందీ ఐ చిక్కాడు. హన్నా! ఎ0త ధైర్యం రా నీకు నీ పని చెప్తా అని చురచురా చూసాడు,మరో మాట లేదు,ఒక నమస్కారం చేసుకుని మన్నించవయా, నీ పేరెట్టుకున్నవాణ్ణి ఆ మాత్రం దయలేదా అంటూ పారిపోయా,లోపలికి. మళ్ళీ బయటికి తొంగి చూస్తే ఒట్టు,మర్నాడు ఉదయం దాకా!!!! ఎవరు ఎవరికి బందీ చెప్మా!!!!

Sunday, 6 April 2025

జై శ్రీరాం. జయ జయ శ్రీరాం.

 జై శ్రీరాం. జయ జయ శ్రీరాం


జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః

రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ।
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః ।
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ॥

*****

ఇల్లలకగానే పండగకాదు.

నడిచే ఎద్దునే పొడుస్తారు.

పారా హుషార్!

జై శ్రీరాం. జయ జయ శ్రీరాం

Wednesday, 26 March 2025

నడుస్తున్న చరిత్ర.-విశ్వావసు

 నడుస్తున్న చరిత్ర.-విశ్వావసు


భద్రం నో అపివాయః మనః శాంతిః శాంతిః శాంతిః 


కొత్త సంవత్సరం విశ్వావసు ఈ నెల 30 వ తారీకున మొదలవుతోంది. అంతకు ముందురోజు శనివారం సూర్యగ్రహణం,ఎక్కడెక్కడ కనపడుతుంది? అదీ కొచ్చను. కలనైనా నీ తలపే కలవరమందైనా నీ తలపే అన్నట్టు ఆమెరిక.సం.రా ల ఉత్తరభాగంలో,కెనడా,గ్రీన్ లాండ్,యూరప్, టర్కీ మధ్య ప్రాచ్యంలో కొద్దిగా,ఆఫ్రికా పశ్చిమ భాగంలో కొద్దిగా కనపడుతుంది. మిగతా ప్రపంచానికి కనపడదుగాని దాని ప్రభావం ఇతరచోట్లా ఉంటుంది,ఎలా? 


ఇక ప్రపంచ రాజకీయ చరిత్ర ఎలా నడుస్తోందీ? అమెరికా గ్రీన్లాండును కొంటానంటోంది? ఎందుకూ అక్కడ మంచేకదా? అక్కడ రేర్ ఎర్థ్స్ దొరుకుతాయి. ఇది చాలాకాలంగా డెన్మార్క్ చేతిలో ఉండి. జనాభా చాలా తక్కువ. మాఊరంత జనాభా! మా స్వాతంత్య్రం వదులుకోమంటున్నారు. 

కెనడా లో ట్రూడి రాజీనామా చేసాకా కొత్త ప్రధాని వచ్చారు. ఆయన మళ్ళీ నెల చివరలో ఎలక్షన్లు ప్రకటించారు. ఆయనంటారు మా రాజకీయాల్లో చైనా,INDIA లు వేలు పెట్టడానికి వీలుందని. నానోట్లో నీ వేలు పెట్టు,నీకంట్లో నా వేలు పెడతా అంటే కుదురునా? ఈ ఊరికి ఆవూరెంత  దూరమో ఈ వూరికి ఆవూరూ అంతే కదా?  

ఇక యూరప్ ఉడుకుతోంది. అటుపెద్దన్నను కాదని స్వతంత్రంగా యూక్రైన్ ని చేర్చుకుని యుద్ధం  కొనసాగించలేదు, కాదనుకుని ఊరుకోలేదు. మింగలేక కక్కలేక అవస్థపడుతోంది. మిగడానికి సరిపోయినదానికంటే ఎక్కువ కొరికితే ఏమవుతుంది? అదే పరిస్థితి యూరప్ ది నేడు. ఇంక రష్యా  చర్చ లు చేస్తూనే ఉంది యుద్ధం ఆపడానికి, కాని కొలిక్కి రావటం లేదు. చాలాplan లు ఉన్నా,దేనికీ ఒప్పుదల కావటం లేదు. చివరిగా ఒక మెలికపెట్టింది. కొన్ని దేశాలు,యు.ఎన్ కూడా చర్చలో పాల్గోవాలి అంటోంది. యూక్రైన్ తో అమెరికా రేర్ ఎర్థ్స్ ఒప్పందమూ సంతకాలు కాలేదు. జలనిస్కీ ఇటూ అటూ తిరగడం తప్పించి ఉపయోగమే కనపడటం లేదు. 


ఇక టర్కీలో కొద్దికాలం కితం జరిగిన ఎన్నికల్లో ఎర్డోగన్ మళ్ళీ ఎన్నికయారు. ప్రతిపక్ష నాయకుని అరెస్టు చేయ్యడం తో దేశం అతలాకుతలం అవుతోంది. ఇక మధ్య ప్రాచ్యం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇస్రయెల్ హమాస్ల  మధ్య శాంతి ఒప్పదం కొనసాగదు. 


ఆఫ్గాన్ పాకిస్థాన్ మధ్య వైరం నడుస్తూనే ఉంది. బలూచ్ నాయకురాల్ని అరస్టు చేసింది పాకిస్థాన్.  మొన్న జరిగిన క్వెట్టా  ట్రైన్ పై దాడితో అట్టుడికి బలూచ్ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. పాక్ కి కంటిమీద కునుకు లేదు.  ఈలోగా తను దాచిపెట్టుకున్న  తీవ్రవాదులను గుర్తు తెలియనివాళ్ళు కాల్చి చంపుతున్నారు. అందులో మనదేశం మీద 26/11 తారీకున దాడికి మూలకారకుణ్ణి ఎవరో లేపేసేరట, నిజం ఇప్పటికీ ఇంకా పాక్ ప్రకటించలేదు. 

మనదేశం ఒక ఉగ్రవాదిని పంపించెయ్యమని అమెరికాను చాలాకాలంగా కోరుతోంది. అలా పంపడానికి ఏర్పాట్లు జరుగుతోంటే ఆ తహావూర్ రాణా గారు, నన్ను భారత్ పంపితే మరి బతకను నన్ను చంపేస్తారు, నాకు సుగర్,బి.పి.కేన్సర్ ఇలా లక్ష అనా రోగ్యా లున్నయి. అంచేత పంపడానికి లేదని అక్కడ సుప్రీం కోర్టుకి మొరబెట్టుకుంటే కాదoది. ఇంకా ఆశ వదలుకోక ఛీఫ్ జస్టిస్ కి తన అపీలు రిఫర్ చేసాడు. ఇప్పుడది విచార్ణలో ఉంది. భారత్ రాక తప్పదు. ఇక్కడికొస్తే మా మిత్రులకి పండగే పండగ. కొంతమంది లాయర్లకి చెప్పేదే లేదు. రాబోయే కాలంలో మన కోర్టుల్లో ఏం జరుగుతుందో వేచి చూదాం. ఇంతకు మించి లోతుగా దేశీ వ్యవహారాలోకి పోవద్దు. హిందీ చీనీ భాయి భాయి, ట్రంప్ సుంకాల దాడి తట్టుకోవాలంటే మనం కలసి పని చెయ్యాలంటోంది,చిత్రం చూడాలి.

ఇక బర్మాలో ప్రభుత ఉందా? ఏమో తెలియనట్టే ఉంది. రఖైన్ ప్రాంత ఆర్మీ తమప్రాంతాన్ని చేతుల్లో ఉంచుకుంది. బంగ్లాదేశ్ లో చిత్రం జరుగుతోంది. ఆర్మీ నాయకుడు పై తిరుబాటన్నారు. ఆయన మాత్రం సైన్యాన్ని దేశం  లో వివిధ ప్రాంతాలకి పంపి  దేశం లో శాంతి ఉంటుందని ప్రాధానిపై తిరుగుబాటును సహించాను, కాని   శాంతి కనపడటం లేదు, చెప్పలేదంటనకపొయ్యేరు. శాంతి స్థాపించుకోండి, లేదూ శాంతి స్థాపించి మేం barocks లకి తిరిగి వెళతామంటున్నాడు. జరగనున్నది చూడాలి. 

ప్రాచ్యంలో  మరో వింత చైనా,ద.కొరియా,జపాన్ లకి ఎప్పుడూ ఉప్పూ ,నిప్పే! కాని మొన్న ఈ మూడు దేశాలూ కలుసుకున్నాయి. ట్రంప్ను   తట్టుకోవాలంటే మనం ఒకటి కావాలంటున్నాయి. చూడాలి. ఇక ఆస్ట్రేలియా,న్యూజిలాంద్ లు మాదేశం నుంచి ఉగ్రవాదాన్ని సహించం అంటున్నాయి. దీని భావమేమి తిరుమలేశా?            

Monday, 24 March 2025

దూడంత దుఃఖం

 దూడంత దుఃఖం  పాడంత సుఖం  లేదు.

ఇది పల్లెలో తరచుగా వాడుకునే మాట, ఒక నానుడి.

పాడి పశువుల్ని దూడలని అనడం పల్లెపట్టున మా అలవాటు. ఒక పాడి పశువు ఇంట్లో ఉంటే దాని ఆలనా పాలనా చూడాలి, లేకపోతే పాలు పితుక్కోడానికి తపేలా పట్టుకెల్తే ముఖొం పగిలేలా తన్నుతుంది. దూడని మన నివాసానికి కొంచం దగ్గరగానే ఆవాసం ఏర్పాటు చేయాలి. దానికి గూడు ఉండాలి. గాలి వెలుతురూ రావాలి. కట్టుగొయ్యకి దగ్గరగా కుడితిగోలెం ఉండాలి, దగ్గరగానే మేతకి పచ్చిగడ్డి ఎండుగడ్డి జనపకట్ట ఉండాలి. పగటి పూట తెలగ పిండి,పత్తి విత్తనాలూ పెడుతుండాలి వారానికి ఒక సారైనా. తిండి పెట్టినంతలో సరిపోలేదు. అక్కడ దోమలు లేకుండా చూసుకోవాలి,శుభ్రం చేయాలి. రోజూ కట్టుగొయ్యనించి విప్పి బయటకి తీసుకుపోవాలి. ఇక ఆవు ఎంత ఎండైనా సహిస్తుంది కాని వాన చినుకు మీదబడితే సహించలేదు. గేదె వాన ఎంతైనా హాయిగా సహిస్తుంది,ఎండకి ఓర్చుకో లేదు. ఇది గమనించాలి.  ఏ రాత్రిపూటో అరిస్తే లేచి చూడాలి, దాని అవసరం తీర్చి అప్పుడు పడుకోవాలి. ఇలా అన్నీ అవస్తలే. పాడి పశువును పెంచడం పురిటిలో పాను చూసుకున్నంత శ్రద్ధగా  చూసుకోవాలి. పాడి పశువును పెంచడం ఒక కళ,కల కూడా. ఇది అందరికి చేత కాదు.

పాలు తీయడానికి ఒక నియమిత సమయం ఉండాలి. పాలతపేలా శుభ్రంగా తోముకోవాలి. ఏమాత్రం శుభ్రం లేకపోయినా పాలు విరిగిపోతాయి, చింతపండేసి శుభ్రంగా తళతళా  మెరిసేలా లోపలా బయటా తోమి ఎండలో బోర్లించాలి. అన్ని చేతులతో నూ పాల తపేలా ముట్టుకోకూడదు. మంచి నీళ్ళు నింపి పాలు తీసేవారికి కివ్వాలి. పాలు తీసేవారు కాళ్ళూ చేతులూ శుభ్రంగా తోముకుని పాలు తియ్యాలి.పాలుతీసే చోటు శుభ్రంగా ఉండాలి. పశువుకు ఆహ్లాదం కలిగేలా వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. వెనకకాళ్ళకి బంధం వేయాలి.  తపేలాలో పట్టుకువెళ్ళిన నీళ్ళతో పొదుగును కడగాలి,శుభ్రంగా. అప్పుడు దూడను వదలాలి. దూడ కుమ్మితే ఆవు పాలు వదలిపెడుతుంది. ఒక సారి కనక ఆవు పాలు చేపితే మరి ఆపుకోలేదు,వెనక్కి తీసుకోలేదు. అప్పుడు నాలుగు చేర్లనుంచీ పాలు మార్చిమార్చి పితుక్కోవాలి. పాలు పితికేవారు పశువు కాళ్ళ దగ్గర గొంతు కూచోగలగాలి. పాల తపేలాను కాళ్ళ మధ్య జాగ్రత్తగా పట్టుకోగలగాలి. పాలు తీయడం కబుర్లు చెప్పినంత తేలికేం కాదు,పాలు కమ్మహా తాగినంత తేలికా కాదు. పాలు తీయడం ఒక కళ.  మరో ముఖ్యమైన మాట రోజూ ఒకరే పాలు పితకాలి,రోజుకొకరు తయారైపోకూడదు. ఇన్ని కష్టాలున్నాయి.      

 పాడి పశువును పెoచడానికి ఇన్ని పాట్లుంటాయి మరి ఇదంతా దుఃఖమే.


ఇక పాడంత సుఖం. ఇంట్లో పాడి  ఉంతే కల్తీ లేని పాలు తాగచ్చు.  పిల్లలికి గుమ్మపాలూ పట్టించచ్చు. పిల్ల లు  బలే బలంగా పెరుగుతారు. ఆపైన ఇంట్లో వాడుకోవచ్చు,గడ్డపెరుగు పోసుకుని కమ్మగా లాగిoచచ్చు. మీగడ,వెన్న,నెయ్యి కమ్మహా తినచ్చు. ఇంకా పాలు మిగిలితే అమ్ముకోవచ్చు,లేదా కేంద్రానికి పోసి డబ్బు చేసుకోవచ్చు. మనవాళ్ళ లో గొప్పచెప్పుకోవచ్చు,ఇంటికొచ్చినవాళ్ళకి చూరు నీళ్ళ కాపీ కాక మంచి చిక్కటి కాఫీ ఇవ్వచ్చు.  పాడి ఉన్నంత సుఖం లేకుంటే ఉంటుందా? 


పళ్ళచెట్టు,అదిన్నీ మామిడి,కొత్తపల్లి కొబ్బరైతే ఎంత బాగుంటుంది. ఊరగాయెట్టుకోవచ్చు,పులుపే పులుపు,పండితే ఆబ్బ ఆ రుచే వేరు. పండు చేతిలోకి రావాలంటే ఎంత కష్టం? చెట్టుని సంరక్షించాలి. ఆకులు రాలుతుంటాయి,తుడుచోకోవాలి,రోజూ. ఇది చాలా పెద్దపని. ఆపై పూత వస్తే దాని సంరక్షణ చెయ్యాలి. పూసిన పూతంతా కాపు కాదు. చాలాపూత రాలుతుంది. కాడలు రాలతాయి. ఎప్పటికప్పుడు తుడుచుకున్నా పెద్ద తలనొప్పి రెండు నెలలు. ఆపై కాసిన కాపంతా నిలబడదు. పిందే రాలుతుంది,కాయా రాలిపోతుంది,ఎంత? గంపలకొద్దీ. ఎత్తిపోసుకోవాలి. ఆపై ప్రకృతి కరుణించాలి,వాన,గాలి లేక. ఆ తరవాత పరువు కొచ్చిన కాయను కింద పడకుండా కోయాలి. ఊరగాయి పెట్టుకోవచ్చు. పండేసుకోవచ్చు. అన్నీ పండవు,కుళ్ళిపోతాయి,వాటిని పారేయక తప్పదు. లేదూ తాండ్రపోసుకోవచ్చు. పండెయ్య డానికి గడ్డి,అనువైన ప్రదేశం కావాలి,మిద్దెలాటిది. అప్పుడు కదా పండిన పండు తినేది. ఇంత కష్టం ఉన్నది మరి.అదే దూడంత దుఃఖం  పాడంత సుఖం లేదన్న సామెత. 

సుఖస్యానంతరం దుఃఖం   
దుఃఖస్యానంతరం సుఖం. 
న నిత్యం  లభతే దుఃఖం   
న నిత్యం లభతే సుఖం 

Friday, 21 March 2025

ట్రెండు

 ట్రెండు


ఫిబ్రవరి మధ్యనుంచే సూరిబాబుగారు నలభైకి ఒకడుగు అటూ ఇటూ వేస్తూ 'తగ్గేదేలే....' అంటున్నాడు. పది పరీక్షలు మొదలవగానే ఒక స్టూడెంట్ కుర్రాడు సీకాకులంలో 'దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరూ...'అని ఒక డయలాగ్ పరీక్షాకేంద్రం గోడమీద రాసాడట. ఇక జూసుకోండీ అది వీడియో వైరల్ జేసేరట,కుర్రోళ్ళు,టీచర్లు, మేధావులు. అబ్బ ఇంత గొప్ప డయలాగ్ రాయగలిగినవాణ్ణి తయారు చేయగలిగినందుకూ,అంత ధైర్యవంతుడు మా స్టూడెంట్ అని చెప్పుకోడానికీ, ఇటువంటి మేధావి రేపు ఫీల్డ్ కొస్తే కాసులు గలగలే అని మేధావులూ ఎదురు చూస్తన్నారట. శుభం. 

పొద్దుటే అంబష్టుడు తల చీదర వదల్చేడు,పొన్నకాయలా గుండు చేసి. గుండు చేస్తూ గుండు ఇప్పుడు ఫేషను తెలుసాండీ, పిలక కూడా. పట్టెడు పిలక ముడి చుట్టుకోడం నేటి ట్రెండు. గుండు చేయించుకుని గడ్డం మీసం దుబ్బులా పెంచుకుని కండలు కనపడేలా  టి షర్టులేసుకుని తిరగడమూ ట్రెండ్ అండీ అన్నాడు. అమ్మో! గుండు కెంత ట్రెండూ అనుకున్నా!    

దూడంత దుఃఖం పాడంత సుఖం లేదన్నట్టు, ఊరుకున్నంత ఉత్తమం బోడగుండత సుఖం లేదుగా

Tuesday, 18 March 2025

ఒక్క సినిమాఛావా

ఒక్క  సినిమాఛావా


ఛావా సినిమా తెలుగులో కూడా విడుదలైందిట. ఔరంగజేబ్ పరిపాలనలో జరిగిన ఒక్క సంఘటన సినిమాగా తీస్తేనే ఔరంగజేబ్ వారసులనుకునేవారికి (వీరి తాతముత్తాతలు ఈ దేశంవాళ్ళే హిందువులు కూడా, డబ్బు,పదవులు,హింస కారణాలుగా  మహమ్మదీయ మతం తీసుకున్నారు.) ఔరంగజేబ్ అభిమానులకి ( వీరు ఈ దేశం వాళ్ళమేనంటారు, సెకులర్లం,మాకన్ని మతాలూ సమానం అంటారు. కాని హిందూ మతాన్నే తిడుతుంటారు. విదేశపు పాట పాడుతుంటారు) గంగవెర్రులెత్తిపోయింది. నిజంగానే ఔరంగజేబ్ సమాధిలోంచి లేచొచ్చి నేనే హిందువుల గుడులు కూల్పించాను,మతం మారని లక్షలమందిని చంపించాను, అని చెప్పినా,  నమ్మంగాక నమ్మం, అంటారు.   వీళ్ళు జహాపనా! తమరు గోరీలో పడుకుని  మూడువందలఏళ్ళు ఐయింది కదా అందుకు తమకు మరుపొచ్చింది. తమరు తమపరిపాలనా కాలంలో పదేళ్ళ తరవాత చరిత్ర రాయద్దన్నారు కదా! ఆ తరవాత కాఫిర్లు ఈ చరిత్ర  రాయించారు మహాప్రభో! అని చెప్పి ఔరంగజేబ్ నోరు బలవంతంగా నొక్కేసి మళ్ళీ గోరీలో పడుకోబెట్టెయ్యగలరు, అంతటి మేధావులు కదా!   ఔరంగజేబ్ పరిపాలనా  చరిత్రలో ఒక్క సంఘటనకే వీళ్ళిలా ఐతే ఔరంగజేబ్ మొత్తంచరిత్రని సినిమాగా తీస్తే ఏమవుతారబ్బా!       


ఔరంగజేబ్ పరిపాలన గురించి చదువుతారా! ఈ కింద లింక్ లో కొంచం ఉంది. 

https://www.quora.com/Which-Hindu-temples-were-destroyed-by-Aurangzeb

కాదు మొత్తం చదవాలనుకుంటే ఒక రచయిత రాసిన చరిత్ర చదవండి. 

 Maasir-A-'Alamgiri is the history of the Emperor Aurangzib-'Alamgir (reign 1658-1707 A.D.) Authored by Saqi Mustaid Khan. · Written in the original Persian, 

It was composed after the death of the emperor by Saqi Musta'd Khan at the behest of Inayetullah Khan Kashmiri, the emperor's last secretary.

Friday, 14 March 2025

తప్పెవరిది?

 

'విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన: HM

AP: పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని స్కూల్ హెడ్మాస్టర్ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. 
* 'పిల్లలు చదువులో వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన బొబ్బిలి మం. పెంట జడ్పీ స్కూల్ HM రమణ... వారి ముందు సాష్టాంగ నమస్కారం చేసి, గుంజీలు తీశారు. 

'మేము కొట్టలేము.. తిట్టలేము.. ఏమీ చేయలేము.. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది' అని ఆవేదన వ్యక్తం చేశారు. 
Courtesy:Whats app

మాస్టారు ఎంత ఆవేదన చెంది ఉంటారు? సమాజం ఎటుపోతోంది? ఇoతకీ తప్పెవరిది?

Monday, 3 March 2025

మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా?

  మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా?

ఏ దేశానికైనా విదేశాంగ విధానం ఒకటే! అదే స్వార్ధం. తమ దేశపు అవసరాలు ముందు,ఇదే అన్ని దేశాలకి వర్తిస్తుంది.


అంతర్జాతీయ రాజకీయం చాలా వేగంగా మారిపోతోంది, మరో సారి ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి. రెండు యుద్ధాలు నడుస్తున్నాయి. ఒకటి యూక్రైన్ రష్యా మధ్య,మరొకటి హమాస్ ఇస్రయెల్ మధ్య. మొన్న శుక్రవారం అమెరికా ఓవల్ ఆఫీసులో జరిగిన రగడ, అదిన్నీ పాత్రికేయుల ఎదురుగా, ఒక పెద్ద చరిత్ర . జలనిస్కీ ట్రంప్ ల మధ్య జరిగిన సంభాషణ వేడి పుట్టించింది. అమెరికా అధ్యక్షుని  నోట జలనిస్కీ మూడవ ప్రపంచయుద్ధంకి తెర తీస్తున్నాడన్న మాట వినపడింది. జలనిస్కీ సంధికి ఇష్టపడటం లేదన్న సంగతీ తెలుస్తూనే ఉంది, ఇది మిత్ర దేశాలలో వేడి పుట్టించింది. ఈ సమావేశానికి ముందే ఫ్రాన్స్,బ్రిటన్, జర్మనీలు  ట్రంప్ ను కలిసాయి. రాజకీయాల్లో బ్రిటన్ అమెరికా ఎప్పుడు విభేదించవు,  కాని కొంత విరుగు చూపి, Britan యూక్రైన్ కి పెద్ద లోన్ ఇవ్వడానికి ఒప్పందం చేసేసుకుంది, దీని తరవాతే .  బ్రిటన్ సైన్యం ఒంటరిగా రష్యాను ఎదుర్కోగలదని ట్రంప్ ఎగతాలిగా మాటాడినది కూడా బయట పడింది. ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోతున్నట్టుంది. ఏదో రకంగా ఆయుధాలు అమ్ముకోడమే ధ్యేయంగా ఉండే అమెరికా శాంతి అంటోంది, ఇదే ఒక చిత్రం. మొన్న జరిగిన మీటింగ్ లో  ట్రంప్, నీకు సంధి కావాల న్నపుడే వద్దువులే అని కూడా అనేసేరు,జలనిస్కీతో. జలనిస్కీ, నీ చాపకిందికి నీళ్ళొస్తున్నాయి చూసుకోమనీ ట్రంప్ కి చెప్పేసేరు. ఇంతదాకా మీ కోసం సరఫరా చేసిన ఆయుధాల ఖరీదుకుగాను నీ దేశంలోని రేర్ మెటల్స్ గురించి ఒప్పందం మీద సంతకం చేయమంటే జలనిస్కీ చేసినదీ తిరుగుబాటు.  పల్లెటూరి రచ్చబండ రాజకీయంలా వ్యవహారం సాగిపోయింది.  బ్రటన్ లోన్ ఇవ్వడం ఆయుధాలు అమ్ముకోడానికే! ఇతర నాటో దేశాలన్నీ చిన్నవి జర్మనీ, ఫ్రాన్స్ తప్పించి. అమెరికా ఇక ముందు ఆయుధాలు ఇవ్వననీ,యుద్ధం కాదు ఇప్పుడు నీకు సంధి మాత్రమే అవసరం అని చెప్పినా జలనిస్కీ వినలేదు.  బ్రటన్ ఆయుధాలతో యూక్రైన్ పోరాటం  దేశ వినాశనమే అవుతుందని సోషల్ మీడియా ఉవాచ, ఆయుధాలున్నా పోరాట యోధులు లేని చందమైపోయింది యూక్రైన్ కి.   నాటో దేశాలు   ఉమ్మడిగా యూక్రైన్ తరఫున రష్యాను ఎదుర్కొంటాయా! తెల్లారి లెస్తే పొయ్యిలో పిల్లి వెలగాలంటే నాటో దేశాలన్నీ రష్యా ఇచ్చే గేస్ మీద ఆధారపడక తప్పదు. ఒక గేస్ పైప్ లైన్ యూక్రైన్ ద్వారా వెళ్ళేదానిని పాడు చేసేరు. ఎవరిగోల వారిదే,ఎవరి అవసరమూ వారిదే.యూరప్ మంటల్లో ఉంది.  


ఇదిలా ఉండగా ట్రంప్ ఆఫ్గనిస్తాన్ లో వదిలేసిన ఆయుధాలు,అప్పుడు యుద్ధంలో మీకిచ్చిన ఆయుధాల ఖరీదు చెల్లించమని ఆఫ్గనిస్తాన్ పీకమీద కూచునేలా ఉంది.ఎందుకిప్పుడు ఇది గుర్తొచ్చింది? ఆఫ్గాన్ లో ఉన్న కొన్ని మెటల్స్ ని స్వంతం చేసుకోవాలని చైనా చూస్తోంది. వాటిని చైనాకి దక్కకుండా చేయాలని అమెరికా ప్రయత్నం.  ఇక మధ్య ప్రాశ్చంలో ఇస్రయెల్ అమెరికా మాటకి బుర్ర ఊపుతోంది,యుద్ధం కొనసాగుతోంది.   

 

మరోపక్క చైనా ఆఫ్గాన్ మీద కన్నేసి ఉంచింది. అమెరికా దిగితే తానూ దిగేందుకు సిద్ధoగానే ఉంది. ఆస్త్రేలియా,జపాన్ లు అమెరికా పాటపాడుతున్నాయి. ఇండియా తటస్తంగా ఉంది.

భారత్ కి అంతర్గత శత్రువులే! బయటి శత్రువులు తెలిసినవారే!!  అంతర్గత శత్రువులు  స్వయంప్రకటిత మేధావులు,అర్బన్ నక్సల్స్,ఆందోళన జీవులు. వీరికి జనం సుఖంగా బతకడం ఇష్టముండదు. వీరు అధికవిద్యావంతులు,శేషప్పకవి చెప్పినట్టు ఈ అధిక విద్యావంతులు అప్రజోజకులే అవుతున్నారు, ఎంగిలి మెతుకులకోసం దేశాన్ని తాకట్టు పెట్టెయడానికి కూడా వీరు వెనుకాడరు. డీప్ స్టేట్ వారి ఎంగిలి  నీళ్ళు,మెతుకులకి ఆశపడే జీవులు. వీర్నేదైనా అంటే భోరున ఏడుస్తారు, మమ్మల్ని అనేసేరు,చూశావా దేశంలో వాక్కు స్వాత్రత్ర్యం లేదు వగైరా వగైరా వాగుతారు, ఇది వీరి జన్మహక్కు.  పట్టించుకుంటే రెచ్చిపోతారు. ఎదో చెయ్యాలి ఊరుకే వదిలేస్తే లాభం లేదు. 


ఇంతకీ అమెరికా యూక్రైన్లో శాంతి వచనాలు పలకడానికి కారణం  చూస్తే,ఇంతవరకు జరిగిన యుద్ధంలో రష్యా ఆక్రమించుకున్న ప్రాంతంలో యూక్రైన్ దేశపు రేర్ మెటల్స్ లో 60 శాతం ఉన్నాయి. రష్యాని అక్కడినుంచి తొలగించి,ఆమెటల్స్ ని స్వంతం చేసుకోవాలని అమెరికా ఆరాటం. ఇక బ్రిటన్ అవసరం? మిగిలిన 40 శాతం రేర్ మెటల్స్ ప్రాంతం చిన్న దేశాలకి మిత్ర దేశాలకి చేరువగా ఉంది. దాన్నికైవసం చేసుకోవాలని బ్రిటన్ ఎత్తుగడ. రష్యా మాట ఒకటే. నాటో కూటమిలో యూక్రైన్ చేరకూడదు,ఒప్పందం ప్రకారం. క్రిమియాను వదులు కోవాలి. ఇలా యూక్రైన్ కుక్కలు చింపిన విస్తరి కాబోతోందేమో!


చివరగా ఇస్రయెల్ హమాస్ లది బతుకుపోరాటం. కలసిబతుకుదామనుకుంటె సమస్య లేదు. ఒకరినొకరు లేకుండా చేసుకోవాలని చూస్తే చివరికి మిగిలేది బూడిద. 

Saturday, 1 March 2025

ఇవి ఏమి పళ్ళు?

ఇవి ఏమి పళ్ళు?



ఇవి ఏమి పళ్ళు?




ఫోటోలో ఉన్న పళ్ళు ఈ మొక్కని కాసినవే. చిన్నగా ఉన్నాయి. పచ్చిగా ఉన్నపుడు పచ్చగా ఉన్నాయి. మొక్కనే ఎరుపు రంగుకు మారాయి. ఇది ఏమి మొక్కయో తెలియలేదు. పళ్ళు బహుపుల్లగా ఉన్నాయి.

 

Monday, 24 February 2025

కూరలు,పళ్ళు..

కూరలు. రెండు రకాల వంకాయలు.వాటిలో మళ్ళీ రకాలు. ఉల్లిపాయ.ములక్కాడ సీజనైపోతోంది. టమేటో.చిక్కుళ్ళు. పచ్చి మిర్చి,అందులో రెండు రకాలు.బంగాళాదుంప. అల్లం.కేరట్,బెండకాయ(పూసా పర్పుల్)



ఉల్లికోళ్ళు.జేగురుపాడు వంకాయ. వేరుశనగ.రాచౌసిరి(సీజన్ చివరకొచ్చేసింది)


రేగుపళ్ళు,అందులో రెండు రకాలు.పెండలం. సూర్య గుమ్మడి. బూడిదగుమ్మడి.

 కమలా నారింజ.దానిమ్మ.ఆపిల్.నల్ల ద్రాక్ష,తెల్లద్రాక్ష.పుచ్చకాయ.డ్రాగన్ ఫ్రూట్.

మైన్ రోడ్ చాలా వెడల్పుగా ఉంటుంది. అంతా సిమెంట్ రోడ్,కిలో మీటర్ పొడవు. మధ్యలో ఈ పళ్ళకొట్లు. పెద్ద సంత పక్కనే నాలుగెకరాలలో షెడ్డుల్లో కొంత ఆరు బయటకొంత. ఇలా కొనసాగుతుంటుంది. పల్లెటూళ్ళలో పళ్ళ వినియోగం బాగా పెరిగింది.ఈ సంవత్సరం వెలగపళ్ళు దొరకలేదు,

కర్ర పెండలం సీజనిదే అయిపోవచ్చింది. మామిడి,పనస, నేరేడు  వగైరాసీజన్ రాబోతోంది.
T centre(దుర్గాసెంటర్ అంటాం) సెంటర్లో ఇంకా పెద్ద పళ్ళకొట్లు ఉన్నాయి.

Saturday, 22 February 2025

Thursday, 20 February 2025

తాత తాగినబోలి...


తాత తాగినబోలి...

🍁.నాన్న వదిలేసి వెళ్లిన ఆ చేతి ముద్రలు నన్ను వెంటాడుతూనే ఉన్నయ్🍁.


నాన్న వయస్సు పెరిగే కొద్దీ శరీరం కూడా బాగా బలహీన పడిపోయింది. గదిలోనే అటూఇటూ నడవడానికి గోడ ఆసరా అవసర మవుతోంది. తన చేతులు పడినచోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి.


నా భార్యకు అది చిరాకు. తరచూ నాతో చెబుతోంది గోడలు మురికిగా కనిపిస్తున్నా యనేది ఆమె కంప్లయింట్. ఓరోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండటంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు. అవే చేతులతో గోడను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద.


నా భార్య నామీద అరిచింది. నేనూ సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను. నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను. గాయపడ్డట్టుగా తన కళ్లు… నావైపు అదోలా చూశాడు. నాకే సిగ్గనిపించింది. ఏం మాట్లాడాలో ఇక తెలియ లేదు.


ఆ తరువాత గోడలను పట్టుకుని నడవగా చూడలేదు నేను. ఓరోజు బ్యాలెన్స్ తప్పి మంచం మీద పడిపోయాడు. తరువాత కొన్నాళ్లకే కన్నుమూశాడు.


నాలో అదే దోష భావన. ఆరోజు తను నావైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది

నన్ను నేను క్షమించుకోలేకపోతున్నా.


కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించు కున్నాం. పెయింటర్స్ వచ్చారు. తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్లిన ఆ గోడ మీద మాత్రం కొత్త పెయింట్ వేయకుండా అడ్డుకున్నాడు... అరిచాడు.


ఆ పెయింటర్స్ సీనియర్లు, క్రియేటివ్ కూడా.


మీ తాత చేతిముద్రలు చెరిగిపోకుండా చూస్తాం. వాటి చుట్టూ సర్కిళ్లు గీసి, డిజైన్లు వేసి, ఓ ఫోటో ఫ్రేములా మార్చి ఇస్తాం సరేనా అని సముదా యించారు.


అలాగే చేశారు. ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం. ఆ డిజైన్‌ను మా ఇంటికొచ్చిన వాళ్లు అభి నందించే వాళ్లు… వాళ్లకు అసలు కథ తెలియదు… తెలిస్తే నన్ను ఎంత అసహ్యించు కునేవాళ్లో.


కాలం ఆగదు కదా, వేగంగా తిరుగుతూనే ఉంది. 


నాకూ వయస్సు మీద పడింది. శరీరం నా అదుపులో ఉండటం లేదు కొన్నిసార్లు. నాకిప్పుడు అదే గోడ ఆసరా కావల్సి వస్తోంది.


నాన్న పడిన బాధ ఏమిటో నాకిప్పుడు తెలిసొస్తోంది.


ఎందుకని పించిందో తెలియదు, గోడ ఆసరా లేకుండానే నడవటానికి ప్రయత్నిస్తు న్నాను.


ఓరోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చాడు, నా భుజాలు పట్టుకున్నాడు. గోడ ఆసరా లేకుండా అస్సలు నడవొద్దు, పడిపోతావ్ అని మందలించాడు.


మనవరాలు వచ్చింది. నీ చేయి నా భుజాల మీద వేసి నడువు తాతా అంది ప్రేమగా. 


నాలో దుఖం పొంగుకొచ్చింది. అసలే తండ్రిని నేనే పోగొట్టు కున్నాననే ఫీలింగు. అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు. 


నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్లు బతికేవాడు కదా అనే బాధ.


నా మనవరాలు మెల్లిగా నన్ను నడిపించుకు వెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది. 


తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది. గదిలోని గోడ మీద నాన్న చేతి ముద్రలనే ఆమె డ్రాయింగ్ బుక్‌‌లో గీసింది. టీచర్ బాగా అభి నందించిందని చెప్పింది. ‘పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి’ అని రాసిందామె ఆ స్కెచ్ మీద.


నా గదిలోకి వచ్చి పడుకున్నాను. మౌనంగా రోదిస్తున్నాను. నన్ను వదిలి వెళ్లిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను. 


తరువాత మెల్లగా నిద్ర పట్టేసింది. ఏమో… తరువాత ఏమైందో నాకు తెలియదు. నా ఆత్మ నాన్న వైపే వేగంగా పయనిస్తున్నట్టే ఉంది.


(ఓ మిత్రుడు పంపించిన ఇంగ్లిష్ పోస్టుకు తెలుగు అనువాదం ఇది…)🙏🙏🙏

Courtesy:What's app

Wednesday, 19 February 2025

60 లో 20




 మేము అరవై లో ఇరవై 


పచ్చగా మెరిసే పండుటాకులమే గాని

             చప్పుడు చేసే ఎండుటాకులం కాదు


కలలు పండినా పండకపోయినా

            మేము తలలు పండిన తిమ్మరుసులం


కొరవడింది  కంటి చూపు గాని

          మందగించలేదు ముందు చూపు


అలసిపోయింది దేహమే గాని

          మనసుకు లేనే లేదు సందేహం


ఎగిరి అంబరాన్ని అందుకోకున్నా

                      ఈ భూమికి కాబోము భారం


అరవై లో ఇరవై కాకున్నా

                      అందని ద్రాక్ష కై అర్రులు చాచం


కుందేళ్ళమై పరుగులు తీయకున్నా

               తాబేళ్లమై గెలుపు బాట చూపగలం


చెడుగుడు కూతల సత్తా లేకున్నా

              చదరంగపు ఎత్తులు నేర్పగలం


సమయం ఎంతో మాకు లేకున్నా

            సమయమంతా మీకు సమర్పిస్తాం


అనుకోకుంటే అధిక ప్రసంగం

              అనుభవ సారం పంచుకుంటాం


వాడిపోయే పూవులమైనా

                        సౌరభాలు వెదజల్లుతాం


రాలిపోయే తారలమైనా

                        కాంతి పుంజాలు వెదజల్లుతాం


DEDICATED TO SENIOR CITIZENS.

Courtesy: What'sapp

Thursday, 6 February 2025

Cry of a police officer

 

Cry of a police officer


నా పేరు శ్రీను నాయక్

సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్

 అనపర్తి పోలీస్ స్టేషన్ 


తల్లిదండ్రులకు చేతులు జోడించి 🙏 నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా

                 ****


క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు.  ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు.


తల్లిదండ్రులకు  తమ పిల్లలపై  శ్రద్ద, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు.


క్రమశిక్షణ మాటలతో రాదు.  కొద్దిపాటి దండన, భయభక్తులు ఉంటేనే వస్తుంది.


పిల్లలకి బడిలో భయంలేదు.

ఇంట్లో భయం లేదు.

అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకి గురి అవుతున్నది.

వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు. 

అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు.

ఆ తర్వాత పోలీసు వారి చేతుల్లో పడి కోర్టులలో శిక్షలకి గురవుతున్నారు.


గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది.

ఇది నిజం.


గురువంటే భయం లేదు మరియు గౌరవం లేదు. ఇక చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది?


కొట్టొద్దు!తిట్టొద్దు! బడికి రానివాడ్ని ఎందుకు రావట్లేవు అని అడగొద్దు!  చదవాలని, హోమ్ వర్క్ అని, కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు! 


5వ తరగతి నుండే కటింగు స్టైలు, చినిగిన జీన్స్ గోడల మీద కూర్చోవడం. వెళ్ళే వారిని వచ్చే వారిని కామెంట్స్ చేయడం.  అరేయ్ సార్ వస్తున్నారురా! అని అంటే, వస్తే రానియ్ అనే పరిస్తితి.


దరిద్రం ఏంటంటే,  కొంతమంది తల్లి  దండ్రులే మావాడు చదవకున్నా ఏమి కాదు, మావాడిని మాత్రం కొట్టవద్దు అంటున్నారు.


ఇంకొక విషయం ఏమిటంటే ఎవరు బాబు నీకు కటింగ్ చేయించినది అంటే మా నాన్న సార్ అంటున్నారు. 


పెన్ను ఉంటే పుస్తకం ఉండదు,

పుస్తకం వుంటే పెన్ను వుండదు.  కొనరు, తెచ్చుకోరు. 

భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటునుంచి పోయి ఎటువస్తాదో అని భయం. 

ఇవన్నీ చూస్తుంటే పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువగా వుంది.


కొట్టకుండా, తిట్టకుండా, భయం లేకుండా చదువు వస్తుందా...?


భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందంట!

అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం.


స్కూల్లో తప్పుచేసినా కొట్టకూడదు, తిట్ట కూడదు, కనీసం మందలించ కూడదు ప్రేమతో చెప్పాలట.

ఇదెలా సాధ్యమ్?


మరి సమాజం ఎందుకు అలా చేయదు? మొదటి తప్పేకదా అని ఊరుకుంటుందా?


మంచి నేర్పేవాళ్ళకి (స్కూల్లో) హక్కులుండవు.  ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం.  వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం.


తల్లిదండ్రులకు నా మనవి. పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయుల తోనే జరుగుతుంది. ఎక్కడో ఒకటో అరో ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు, అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు.


 90 శాతం టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు. 

ఇది యదార్ధం.  


ఇకనైనా ప్రతీ చిన్న విషయానికి టీచర్లను నిందించవలదు.

       

మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని కొట్టేవారు.


అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు. 

మా బాగు కోసమే అని అనుకునేవారు.

        

ముందుగా తల్లి దండ్రులు టీచర్ అంటే గౌరవం, భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలని మనవి.


తల్లి తండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిషత్ పై ఆలోచించండి..


పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఫోన్లు, మీడియా 60 % , కానీ 40% మాత్రం తల్లి దండ్రులే..!🙏


పిల్లల్ని గారాబం శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది..  పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢ నమ్మకాలు, స్వార్థం, అతి  ప్రేమ వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తూ వారిని నాశనం చేస్తున్నారు.


ఇప్పుటి తరం 70% పిల్లలు..


👉తల్లిదండ్రులు కారు, బండి శుభ్రం మంటే తుడవరు.


👉మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు.


👉లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు.


👉కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు.


👉రాత్రి 10 గంటలలోపు పడుకుని, ఉదయం 6 లేదా 7 గంటలలోపు నిద్ర లేవరు.


👉గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెబుతారు.


👉తిడితే వస్తువులను విసిరి కొడతారు. ఎప్పుడయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ , నూడుల్స్, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు.


👉 మైనర్ పిల్లలకి బైక్లు ఇవ్వడం 

వారు ఆక్సిడెంట్లకు చేయడం 

కేసులలో ఇరుక్కోవడం


👉ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు.


👉ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి.


👉అతిథులు వస్తే కనీసం గ్లాసేడు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనలేని అమ్మాయిలు కూడా ఉన్నారు.


👉20 సంవత్సరాలు దాటినా చాలామంది ఆడపిల్లలకు వంట చేయడం రాదు.


👉బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడలేని కోపం వీరికి.


👉కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింత పోకడలు.


👉వారిస్తే వెర్రి పనులు.


👉మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు.


పై వాటికి  కారణం మనమే. ఎందుకంటే మనకు అహం,పరువు మరియు  ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి.


చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి. రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం.


గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..


వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది కష్టం గురించి తెలిసేలా పెంచండి.


కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు.


ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వలన కొందరు యువత 15 ఏళ్లకే ప్రేమ - దోమ అనటం,సిగరెట్స్, మందు, బెట్టింగ్, డ్రగ్స్, దొంగతనాలు, రేప్ లు, హత్యలు చేస్తున్నారు.


మరికొంతమంది సోమరిపోతులా తయారవుతున్నారు..


అభినయాలు కనపడడం లేదు, అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..

ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లి దండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..


భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..


మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం. కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం.


👉కాలేజీ పిల్లలయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫిన్, లంచ్ చిన్న బాక్సు రైస్.. చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు.


గర్భవతులైన తరువాత వారి బాధలు వర్ణనా తీతం. టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి. అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..


03వ తరగతి పిల్లాడికి సోడాబుడ్డి లాంటి కళ్ళద్దాలు.


05వ తరగతి వారికి అల్సర్, బీపీలు.


10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలొస్తున్నాయి..


వీటన్నికి కారణం మనం. మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచక పోవడమే. అందుకే తల్లి దండ్రులు మారాలి.


రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?


కేవలం గుడికి , దర్గా లకు వెళ్లి పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము. అది మాత్రమే కాదు.


సాంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు..

పిల్లలకు..👇

👉  బాధ్యత

👉  మర్యాద

👉  గౌరవం

👉  కష్టం

👉  నష్టం

👉  ఓర్పు

👉  సహనం

👉  దాతృత్వం

👉  ప్రేమ

👉  అనురాగం

👉  సహాయం

👉  సహకారం

👉  నాయకత్వం

👉  మానసిక ద్రృఢత్వం

👉  కుటుంబ బంధాలు

👉  అనుబంధాలు  

👉  దైవ భక్తి

👉  దేశ భక్తి


కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి..


మంది కోసం బ్రతకద్దు మన ఆరోగ్యం, మన ఆనందం కోసం బ్రతుకుదాం.


ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..


భావితరాల పిల్లల కోసం ,పిల్లలను మార్చే బాధ్యత మన అందరిపై కలదు.


 🙏చదివిన వారందరి విన్నపం...

దయచేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి


ఈ మేసేజ్ చదివి అందరూ మారిపోతారు అని నేను అనుకోవడం లేదు....


కనీసం ఒక్కరు అయిన మారుతారని ఉద్దేశంతో ఈ మేసేజ్ పెడుతున్నాను

ఇట్లు 

*మీ శ్రీనివాస నాయక్

 సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్.           అనపర్తి🙏🙏🙏*

Courtesy:Whats app


నా గోల:- టూకీగా మనం మారం,ఎవరు చెప్పినా.ఇంతే.