Sunday 15 March 2020

అరణ్య రోదన

అరణ్య రోదన

అరణ్య రోదన అనగా అడవిలో ఏడవడం. అడవిలో ఏడవడమెందుకూ? గ్రామంలో ఏడిస్తే ఆర్చేవారూ తీర్చేవారూ లేక. అదేంటీ? మానవులకు ఆరు ఊర్ములు ఉంటాయి. అవి ఆకలి,దప్పిక, జర,మరణం;మోహము,శోకము. ఇందులో ఏ ఒక్కదాన్ని ఎవరిది వారే అనుభవించాలి తప్పించి మరొకరికి బదలాయింపు కుదరదు. అందుకే ఎవరి ఏడుపు వారే ఏడవాలి,మరొకరు ఏడవరు. గ్రామంలో ఎవరి ఏడుపువారు ఏడుస్తుంటే మరొకరెవరు ఆరుస్తారు,తీరుస్తారు. మరి అడవిలో తీర్చేవారుంటారా? పూర్వకాలంలో సాయంత్రం వేళ పార్వతీ పరమేశ్వరులు ఆకాశమార్గాన విహారం చేస్తున్నపుడు ఇలా అడవిలో ఒంటరిగా ఏడుస్తున్నవారిని ఓదార్చి వారికి మంచి చెసేవారని పెద్దల మాట. అందుకు ఊళ్ళో కాక అడవిలో ఏడిస్తే ఎప్పటికైనా దేవుడు కరుణించకపోతాడా అని ఆశ. అందుకే అరణ్య రోదనం అన్నారు. ఇప్పుడీ అరణ్య రోదన సంగతేల


శ్రీ జి.పి.శాస్త్రి అనే గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి గారొక రిటయిర్డ్ ప్రొఫెసరు. వారు తెనుగులో ఒక పద్యాల పుస్తకం వేశారు. ఆ పుస్తకాన్ని నాకు పంపే సందర్భంలో జిలేబి నాకు శాస్త్రి గారిని పరిచయం చేశారు.పారితోషికం పంపించే సందర్భంగా ఒకటి రెండు సార్లు మెయిలిచ్చారు. అదే పరిచయం. పెద్దవారు కదా వీరికి జరుగుతున్నది విన్నవిద్దామనుకుని చెప్పేను. వారు నాకు తెనుగే తెలియదన్నారు. తెనుగులో పద్యాలల్లి పుస్తకాలేసినవారు తెనుగు రాదంటే అర్ధమే కాలేదు. జిలేబి మాయలో మరో మాయ. 

2 comments:

  1. Replies
    1. మరెన్ని చిత్రములు చూడనుంటిమో కద సార్

      Delete