Thursday 25 July 2019

ఆచూకి తెలిస్తే దయచేసి చెప్పండి.




ఎత్తుకుపోబడ్డ బాలుడు దొరికాడు. మా వూరికి పది కిలో మీటర్ల దూరంలోని కుతుకులూరు గ్రామంలో అమ్మవారి గుడివద్ద ఉదయమే బాలుని ఎత్తుకుపోయినవారు వదలిపోయినట్టు వార్త. 

5 comments:

  1. సుఖాంతం అని ఇందాక టీవీలో చెప్పారు. సంతోషం.
    చిన్నపిల్లల అపహరణ కేసులు ఎక్కువవుతున్నాయి, సమాజం ఎటువైపు పోతోందో అని విచారంగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,

      గోజిలలో హత్యలు,దోపిడీలు,కిడ్నేప్ లు తక్కువేనండి. కాని గత రెండేళ్ళుగా ఇవి కొంత పుంజుకున్నట్టు కనపడుతోంది.
      కథ సుఖాంతం కావడానికి కారణం సంఘ శక్తి. కలౌ సంఘే శక్తి అన్నది నిజమని ఈ సంఘటన ఋజువు చేసింది. సంఘటన జరిగినది మొదలు వాట్సాప్ లో మెసేజిలు వరుసగా ఇస్తూనే ఉన్నారు. గోజిలలో వాట్సాప్ గ్రూప్లెన్ని ఉన్నాయో చెప్పడం కష్టం. ఈ మెసేజ్ అలా గోజిలలో ప్రతి ఒక్కరికి చేరిపోయింది. ఎవరి మటుకువారు వెతుకుతున్నారేమో అనిపించింది. పోలీస్ లు టెక్నికల్ పరిశోధన చేస్తే సామాన్యులు పట్టుకోడానికి ప్రయత్నం చేయడంతో దుండగులు చేయగలది లేక మా వూరికి పది కిలో మీటర్లు, మండపేటకి పది కిలో మీటర్ల దూరంలో ఈ బాలుని తెల్లవారు గట్ల ఒక సురక్షిత ప్రదేశంలో వదిలేసిపోయారు. ఒక ఇటుక బట్టీ కార్మికుడు ఈ బాలుని యజమానికి అప్పగించాడట, అతనుపోలీస్ కి ఇలా జరిగిపోయింది. దుండగులు ఎక్కువ దూరంగా పారిపోలేకపోయారు కిడ్నేప్ తరవాత రెండు రోజులకి కూడా.

      ఇలా ప్రజలు సంఘటితంగా ఉంటే సాధించలేనిది లేదని నిరూపించబడింది.

      Delete
  2. ఈ పిల్లవాడు జషిత్, అతని తల్లిదండ్రులు అదృష్టవంతులు.

    చాలా యేళ్ళ క్రితం ... 1990 ప్రాంతాల్లో అనుకుంటాను ... అప్పటి తెలంగాణా ఎం.పీ (కాంగ్రెస్) అయిన జి.వెంకటస్వామి గారి మనవడు వికాస్ ను హైదరాబాద్ లో స్కూల్ నుండి ఎవరో అపహరించారు. సిబిఐ కూడా రంగంలోకి దిగింది. పిల్లవాడి ఫొటోతో ఉన్న పోస్టర్ లు చాలా చోట్ల అతికించారు. రెగ్యులర్ గా వార్తాపత్రికల్లో వేయించేవారు. అయినా ఎన్ని సంవత్సరాల గడిచినా, నిజానికి ఈ నాటి వరకూ కూడా పిల్లవాడు దొరికినట్లు లేదనుకుంటాను. పెద్ద మిస్టరీ.

    అప్పటి మంత్రి వెంకటస్వామి గారి మనవడి అపహరణ

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      జరిగింది చాలా దారుణం. ఇప్పటి వరకు దానిని ఛేదించలేకపోయారంటే ఏమనగలం?

      నాటి కాలానికి నేటి కాలానికి చాలా తేడా వచ్చిందండి. అప్పుడు వార్త ఒకరినుంచి మరొకరికి చేరడానికి రోజులు,గంటలు పట్టేది. నేడు ఒక వార్త ఒక గ్రూప్ వారందరికి చేరడానికి కొన్ని సెకన్లు చాలు. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది ప్రజలలో కూడా.

      నేడు దుండగులు ఎంతవారైనా భయపడే సమయం వచ్చేసిందండి. ఈ సంఘటిత శక్తి ప్రజలలో కొనసాగాలని కోరుకుందాం.

      Delete