13, డిసెంబర్ 2022, మంగళవారం

నాలాగ రాసేవాళ్ళు ---రావణ కాష్టం

ఎవరిలాగ వాళ్ళే రాసుకుంటారు, ఒకరిలాగ మరొకరు రాయరు, ఇది లోక రీతి, కాని సోషల్ మీడియా రీతి అది కాదుట. నా లాగ రాసేవారు దొరికారండోయ్! 


 Posted on డిసెంబర్ 26, 2016

శర్మ కాలక్షేపంకబుర్లు-రావణ కాష్ఠం

రావణకాష్ఠం

రావణ కాష్ఠం అంటారు కదా దీని సంగతేంటో చూడాలని రామాయణం తిరగేశా.  అందులో వాల్మీకి ఇలా చెప్పేరు. శ్లోకాలు పెట్టాలనుకున్నాగాని, టైప్ చెయ్యలేక మానేశాను, అర్ధం మాత్రమే రాస్తున్నా!

”రావణ కాష్ఠానికి గాను చందనపు కఱ్ఱలు, పద్మకములు, పేర్చారు, వట్టివేళ్ళు, సుగంధాన్నిచ్చేవాటిని పేర్చారు, వాటిపై. దానిపై జింక చర్మం పరచారు. దానిపై రావణుని శరీరాన్ని ఉంచారు. చితికి ఆగ్నేయంగా ఒక వేదిక నిర్మించారు. దానిపై పశ్చిమంగా గార్హపత్యాగ్ని, తూర్పున ఆహవనీయాగ్ని, దక్షణాన దక్షణాగ్ని ఉంచారు. సృక్కు,సృవాలతో పెరుగు,నెయ్యి కలిపినది చితిపై ఉంచారు. కాళ్ళ వైపు సోమలత తెచ్చిన బండిని ఉంచారు, తొడల మధ్య సోమలతను దంచిన కఱ్ఱరోలుంచారు. ఇక సృక్కు,సృవాలు,అరణులు,చెక్క పాత్రలు,ముసలము అనగా రోకలి ఇతర యజ్ఞ సంబంధ వస్తువులు కఱ్ఱవాటిని వాటికి తగిన ప్రదేశాల్లో ఉంచారు. మంత్రపూరితంగా మేకను బలి ఇచ్చారు. ఆ పైన నేతితో తడిపిన దర్భలుంచారు. ఆ తరవాత రావణ శరీరంపై పూలమాలలు, వస్త్రాలు ఉంచారు. ఇప్పుడు విభీషణుడు రావణకాష్ఠా  నికి నిప్పు పెట్టేడు” అన్నారు.

దీనిలో చిత్రం ఏముందని కదా! రావణుడు బ్రహ్మగారి మనుమడు, అనేక యజ్ఞాలు చేసిన వాడు. ఒక యజ్ఞంలో సోమలత తేవడానికి బండి కావాలి,దానిని తయారు చేస్తారు, కొత్తది. సోమలతను దంచడానికి రోళ్ళు తయారు చేస్తారు, సృక్కులు,సృవాలు ఉంటాయి నేతిని అగ్నిలో ఆహుతి చేసేందుకు. సోమలతను దంచే రోకళ్ళుంటాయి, చెక్కపాత్రలుంటాయి, అగ్నిని మథించే అరణులుంటాయి, ఇలా యజ్ఞానికి కావలసిన సకలమూ కఱ్ఱరూపంలోనే ఉంటుంది. వీటిని తయారుచేస్తారు. ఒక యజ్ఞానికి వాడిన వాటిని మరొక యజ్ఞానికి వాడకూడదు. రావణుడెన్ని యజ్ఞాలు చేశాడో తెలియదు. యజ్ఞం చేసినవారు, వారు యజ్ఞంలో ఉపయోగించిన సామగ్రి మొత్తం దాచుకోవాలి, దానిని వారి అనంతరం వారి శరీరంతో కాష్టం మీద వేసి తగలేస్తారు, రావణుడెన్ని యజ్ఞాలు చేశాడో అంత సామగ్రి చితి మీద వేశారనమాట.  ఇవేకాక రావణుడు నిత్య కర్మలో ఉపయోగించినవాటినీ ఇందులో చేరుస్తారు. మనవాళ్ళో మాటంటారు, ఎవరేనా వస్తువులు ఇలా దాచుకుంటుంటే ”చచ్చాకా మీదేసి తగలేస్తారా?” అని. అదొగో అదేఇది. అలాగే మరోమాట ”నీకు నల్లమేకపోతును బలేస్తారురా” అనీ తిడతారు,కోపంలో అది కూడా ఇందునుంచి వచ్చినదేనని నా ఊహ. యజ్ఞం చేసిన ఒకరు కాలం చేస్తే, ఈ ప్రక్రియకి కొంత సాయం చేశా, అందుకు ఇదంతా గుర్తొచ్చింది. ఇలా రావణకాష్ఠం మామూలుకు అనేక రెట్లు పెరిగిపోయి, చాలా ఎక్కువ సేపు తగలబడిందన మాట. ఇలా ఎక్కువ సేపు ఉండిపోయే తగవును రావణ కాష్ఠంతో పోలుస్తారు.

4 THOUGHTS ON “శర్మ కాలక్షేపంకబుర్లు-రావణ కాష్ఠం

  1. 0
    0
    Rate This

    బౌద్ధ,జైన,ప్రభావాల వలన అహింసను అవలంబించారు కాని,పూర్వకాలంలో
    యజ్ఞాలలోను,ఇతర సందర్భాలలోను జంతువధ,మాంసాహారము బ్రాహ్మణులతోసహాహిందువులందరూ
    చేసేవారని పురాణాల ద్వారా తెలుస్తున్నది.

    2016-12-26 5:33 GMT+05:30 కష్టేఫలే :

    > kastephale posted: “రావణకాష్ఠం రావణ కాష్ఠం అంటారు కదా దీని సంగతేంటో
    > చూడాలని రామాయణం తిరగేశా. అందులో వాల్మీకి ఇలా చెప్పేరు. శ్లోకాలు
    > పెట్టాలనుకున్నాగాని, టైప్ చెయ్యలేక మానేశాను, అర్ధం మాత్రమే రాస్తున్నా!
    > ”రావణ కాష్ఠానికి గాను చందనపు కఱ్ఱలు, పద్మకములు, పేర్చారు, వట్టివేళ్”
    >

    • 0
      0
      Rate This

      విన్నకోట నరసింహారావుగారు,

      మేకను బలిచ్చారన్నారు వాల్మీకి.

      ఇప్పటికిన్నీ మగళ,శుక్రవారాల్లో చనిపోతే పాడెకు ఒక కోడిని కట్టడం ఆచారం పల్లెలలో ఉంది. మాంసాహారులు కానివారు పిండి బొమ్మను చేసి శవంతో పాటు దహించడమూ ఉంది. ఈ ఆచారం కొనసాగుతూనే ఉందండి.
      ధన్యవాదాలు.

స్పందించండి

 just Clicik on  
జాస్మిన్ ( మల్లి )
 and scroll down

 · 
అనుసరించండి

రావణకాష్ఠం అంటే..

చితిపై సుగంధ చందన కట్టెలు, పద్మకములు, వట్టివేళ్లు పేర్చి, దానిపై జింకచర్మం పరిచి రావణుడి పార్థివదేహాన్నుంచారు.

పెరుగు, నెయ్యి కలిపిన పాత్ర పెట్టారు. సోమలతను తెచ్చిన బండిని కాళ్ల వైపు, తొడల మధ్య సోమలతను దంచిన కర్రరోలు ఉంచారు. ఇక అరణులు, చెక్క పాత్రలు, రోకలి తదితర యజ్ఞ సంబంధ వస్తువులను సముచిత ప్రదేశాల్లో ఉంచి మంత్రపూరితంగా మేకను బలి ఇచ్చారు. ఆపైన నేతితో తడిపిన దర్భలుంచారు. శరీరంపై పుష్ప మాలలు, వస్త్రాలుంచిన తర్వాత విభీషణుడు చితికి నిప్పు అంటించాడు. ఇవన్నీ ఎందుకంటే.. రావణుడు బ్రహ్మ మనవడు, అనేక యజ్ఞాలు చేసినవాడు.

సోమలత తేవడానికి కొత్తబండిని, దాన్ని దంచడానికి రోళ్లు తయారుచేస్తారు. నేతిని అగ్నిలో ఆహుతి చేసేందుకు సృక్కులు, సృవాలు ఉంటాయి. అగ్నిని మథించే అరణులుంటాయి. ఇలా యజ్ఞానికి వలసినవన్నీ కర్ర రూపంలో ఉండేవే. ఒకసారి వాడినవి మరో యజ్ఞానికి వాడకూడదు. యజ్ఞం చేసినవారు, గతంలో ఉపయోగించిన సామగ్రినంతా భద్రపరచాలి. అలా దాచినవన్నీ మరణానంతరం పార్థివ శరీరంతోపాటు కాష్ఠం మీద వేసి తగలేస్తారు. అందుకే రావణుడి యజ్ఞ సామాగ్రి అంతా చితి మీద పేర్చారు.

నిత్యకర్మలో ఉపయోగించివాటినీ అంతే. ఎవరైనా వస్తువులను దాచుకుంటే 'వాటిని నీ మీదేసి తగలేస్తారా?' అని, కోపమొస్తే 'నీకు నల్ల మేకపోతును బలిస్తారా?' తరహాలో పరుషంగా అనడం తెలిసిందే.

కేవలం కట్టెలు కాకుండా అన్నన్ని వస్తువులున్నందున రావణకాష్ఠం చాలా ఎక్కువ కాలం తగలబడింది. అందుకే ఎంతకూ తెగని తగవులను, దీర్ఘకాలం సాగే కోర్టుకేసులను రావణకాష్ఠంతో పోలుస్తారు.

ఇప్పుడు చెప్పండి నాలాగు రాసేవారున్నారా? ఇప్పుడు చెప్పండి నాలాగు రాసేవారున్నారా? ఇప్పుడు చెప్పండి నాలాగు రాసేవారున్నారా? 
సందేశాలు
పవన్ సంతోష్ సూరంపూడి
29, సెప్టెం 2021

11, డిసెంబర్ 2022, ఆదివారం

ఒండుకున్నమ్మకి ఒకటే కూర దండుకున్నమ్మకి అన్నీ కూరలే

 ఒండుకున్నమ్మకి ఒకటే కూర దండుకున్నమ్మకి అన్నీ కూరలే

వండుకుంటేఒక కూరే వండుకుంటారు, ప్రత్యేక కార్యక్రమం లేకపోతే. మరిక దండుకోవడమంటే? బలవంతంగా పుచ్చుకోవడం. అదెలా? రకరకాలు.'' వదినా కూరేం చేశావు?''  ''వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర''. అబ్బ ! ''మీ అన్నయ్య కెంత ఇష్టమో! మార్కెట్లో మంచి వంకాయే దొరకలేదనుకో''! వండుకున్నావిడ కొంచం కూర పె ట్ట క ఛస్తుందా? మరో చోటైతే మరో చిట్కా! ''నువ్వు పెట్టే నూనిమాగాయంటే మనపరగణాలో చెప్పుకుంటారనుకో!'' పొగేస్తే పెట్టక ఛస్తుందా? ''ఐపోవచ్చిందొదినా ఇదే మిగిలింది మళ్ళీ పెట్టాలి ఎండల్లో!'' ఇలా దండుకున్నావిడకి కూరల లోటుంటుందా?


ఇందమ్మ అంటేనే అందమ్మ అంటారు.

ఆదాన ప్రదానాలు జీవితంలో ఒక భాగమే! ఇవ్వాలి పుచ్చుకోవాలి, దానికి సమయం సందర్భమూ ఉండాలి. ఇచ్చేదానికి పుచ్చుకునే దానికి వెల చూడకూడదు, ఇవ్వడం వెనక మనసు చూడాలి.అలా చూడాలంటే పెట్టే మనసుండాలి. :) అదే ఇందమ్మ అంటే అందమ్మ అనడం

కడుపులో లేనిది కావలించుకుంటే రాదు.

 కావలించుకోవడం ఎప్పుడు జరుగుతుంది? మసులో ప్రేమ ఉన్నపుడు. మనసులో ప్రేమలేక కావలించుకున్నంతలో ప్రేమ పుట్టదు :)


25, నవంబర్ 2022, శుక్రవారం

వేగపడక వివరింపదగున్...

 వేగపడక వివరింపదగున్...

https://kasthephali.blogspot.com/2022/11/blog-post_23.html   (నిన్నటి తరవాయి) 



వినదగునెవ్వరు చెప్పిన

వినినంతనె వేగడక వివరింపదగున్

విని కల్లనిజము దెలిసిన

మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!


ఎవరుచెప్పినా విను. విన్న వెంఠనే ఉద్వేగపడిపోకు, విన్నదానిని విశ్లేషించుకో! విన్నదానిలో నిజానిజాలు తేల్చుకున్నవాడే తెలివైనవాడు అన్నారు, బద్దెన.


వినినంతనె  వేగపడక

ఎవరెవరో రరకాలుగా చెప్పేరు కదా!   ఎలా చెప్పేరు? ఒకరు చాలా కటువుగా,వాస్తవానికి దగ్గరగా చెప్పేరు, మరొకరు ఆకుకి అందకపోకకి పొందకుండా చెప్పేరు, మరొకరు ఇప్పటికే సర్వం నాశనమయిందిమరి బాగుపడే ఆశ లేదన్నారు. మరొకరు అసాధ్యాన్ని చెప్పి అది చేస్తే సమస్య తీరుతుందన్నారు. చివరగా ఒకరు చాలా తియ్యగా చెప్పరు, సాధ్యంకూడా అయ్యేదే! విన్నాం కదా! విన్నవెంఠనే ఉద్వేగం చెందడం, ఆవేశపడటం, కోపగించడం చేసుకోవద్దు! 


వివరించదగున్..

ఇప్పుడు చెప్పినవి ఒక్కొకటీ గుర్తుకు తెచ్చుకోవాలి. చెప్పినవాటిని కూలంకషంగా కీడుమేళ్ళు, సాధ్యా సాధ్యాలూ వివరించుకోవాలి, అదే విశ్లేషించుకోడం. ఇలా చెప్పినవారి స్వార్ధం ఉందా అని కూడా పరిశీలించాలి. అన్ని సలహాలనీ ఇలా చూసుకుంటే పొల్లుతో ఉన్న ధాన్యాని ఎగరబోస్తే పొల్లు దూరంగాపోయి, ధాన్యం కాళ్ళముందు పడినట్టు, ఏది సాధ్యమో, ఆపద గడుస్తుందో తెలుస్తుంది. అప్పుడు వారెవరో చూసుకుంటే తెలుస్తుంది, వారు బంధు మిత్రులా,చుట్టాలా, శత్రువులా, గూఢ శత్రువులా అన్నది. వీటిలో సాధ్యమైన మేలైనదాన్ని ఎన్నుకుని మనదైన ఆలోచన జోడించుకుని అప్పుడు కార్యాచరణకి దిగాలి. నిజంగా పైన చెప్పినదంతా రంధ్రాన్వేషణే...


ఎంతచెప్పినా అర్ధం చేయడం వల్లకాని పని కావచ్చు, ఒక చిన్న ఉదాహరణ, భారతం  నుంచి.

సందర్భం:- ధృతరాష్ట్రుడు రాజుగా ధర్మరాజు యువరాజుగా పరిపాలన సాగుతున్నకాలం.దుర్యోధనుడు తండ్రి చేత పాండవులను దూరంగా పంపి, మట్టు పెట్టాలని ఆలోచిస్తున్న కాలం.

ఘట్టం:- పాండవులు వారణావత ప్రయాణం, లక్క ఇల్లు... 

ధృతరాష్ట్రుడు ధర్మరాజు ను పిలిచి, కొంతకాలం వారణావతంలో ఉండి గంగాస్నానం చేస్తూ, దానధర్మాలు చేసి రావలసిందిగా, తల్లి తమ్ములతో వెళ్ళవలసిందిగా చెబుతాడు. ధర్మరాజు విని ప్రయాణానికి తయారవుతాడు. అందరూ రధాలెక్కేరు, ధర్మరాజు రధం ఎక్కుతుండగా విదురుడు పంచభూతాలనుంచి జాగ్రత్త వహించు అని చెబుతాడు. విన్న ధర్మరాజు మిన్నకుంటే, కుంతి అడిగింది, కొంత దూరం పోయాకా! విదురుడు గూఢంగా ఏదో చెప్పేడు,ఏమది, చెప్పవచ్చనుకుంటే చెప్పూ! అని. దానికి ధర్మరాజు అగ్ని,జల ప్రమాదాలనుంచి జాగ్రత్త వహించమని చెప్పేడని చెబుతాడు.

 వారణావతం చేరిన కొంతకాలం తరవాత లక్క ఇంటికి చేరేరు.లక్క ఇంట్లో చేరగానే విదురుని మాట గుర్తుచేసుకున్న ధర్మరాజు భీముని కూడా తీసుకుని లక్క ఇల్లంతా తిరిగి పరిసరాలూ గమనించి, భీమునితో ఇలా అన్నాడు. తమ్ముడూ! ఈ ఇల్లు లక్క నెయ్యితో నిర్మించబడింది,ఏ క్షణంలోనైనా అగ్నిప్రమాదం జరగచ్చు, దానికితోడు ఇది ఆయుధాగారానికి దగ్గరలో కూడా ఉన్నది, అన్నాడు.విన్న భీముడు విషయం అర్ధం చేసుకుని, ఐతే ఈ ఇంటిని మనమే కాల్చేద్దామన్నాడు. దానికి ధర్మరాజు, మనం కాల్చేయచ్చు కాని శత్రువు మరో పన్నాగం పన్నుతాడు, మనం మళ్ళీ దాన్ని తెలుసుకోవాలి, ఛేదించాలి, దానికంటే శత్రువు పన్నాగాన్నే ఎరగనట్టు కొనసాగిస్తూ సమయం వచ్చినపుడు పనిచేసుకుపోవడం మేలన్నాడు. విషయం గ్రహించిన భీముడు మిన్నకుండిపోయాడు. తరవాతేం జరిగింది తెలిసినదే కదా!

ఘట్టాన్ని విశ్లేషిస్తే

ధృతరాష్ట్రుడు తియ్యగా వారణావతం వెళ్ళి గంగలో ములిగి దానధర్మాలు చేస్తూ కొంతకాలం గడపవయ్యా! తల్లి,తమ్ముళ్ళతో అని చెప్పేడు, ఒక పెద్ద పథకం దృష్టిలో ఉంచుకుని,చూడ్డానికి, వినడానికి ఇదెంత చక్కగా ఉంది.తమను వారణావతం వెళ్ళమని ధృతరాష్ట్రుడు చెప్పినదానిలో సత్యం లేదని గ్రహించినా ధర్మరాజు, ఆవేశపడలేదు.వేగపడకపోవడమంటే ఇదే

ధర్మరాజు విదురుడు చెప్పినది విని విననట్టు ఊరుకుని సమయం వచ్చినపుడు అనగా లక్క ఇంట్లో చేరిన వెంఠనే చర్యతీసుకున్నాడు కదా! ఇది విశ్లేషణలో భాగం. భీముడు లక్క ఇల్లు కాల్చేద్దామని ఉద్వేగపడ్డాడు, చెప్పినవెంఠనే! ఇదే కూడనిది కదా! ధర్మరాజు శత్రువు పన్నాగం ఎరగనట్టు కొనసాగిస్తూ తిప్పికొట్టాలనే ఆలోచన వివరించడంలో భాగం కదా!  

ఆత్మరక్షణకి శత్రువును ఉపయోగించుకోడం ఎలా? ఎవరేనా చెప్పండి.


23, నవంబర్ 2022, బుధవారం

వినదగునెవ్వరు చెప్పిన

వినదగునెవ్వరు చెప్పిన

 


వినదగునెవ్వరు చెప్పిన

వినినంతనె వేగపడక వివరింపదగున్

విని కల్లనిజము దెలిసిన

మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!


ఎవరుచెప్పినా విను. విన్న వెంఠనే ఉద్వేగపడిపోకు, విన్నదానిని విశ్లేషించుకో! విన్నదానిలో నిజానిజాలు తేల్చుకున్నవాడే తెలివైనవాడు అన్నారు, బద్దెన.


తెనుగుపద్యానికి కూడా అర్ధం చెప్పాలా? అందులోనూ సుమతీ శతకపద్యానికి అని కోప్పడ వద్దు. నేటికాలంలో తెనుగు పద్యానికే అర్ధం చెప్పవలసిన రోజులొచ్చాయి.  దీనికేంగాని ముందుకెళదాం.



ఎవరు చెప్పినా విను, విను, విను, అని ముమ్మారు నొక్కిచెప్పారు శతకకర్త.

ఎవరు చెబుతారు?

బంధుమిత్రులు,శత్రువులు,అయాచితులు.

ఎవరు బంధువులు?

తల్లి,తండ్రి,భార్య/భర్త వీరే బంధువులు. మిగిలినవారంతా చుట్టాలే. బంధువులు ఏపరిస్థితులలోనూ మనమంచి కోరతారు.

ఎవరు మిత్రులు?

చాలాపెద్దది సమాధానం, టూకీగా. (పాపన్నివారయతి,యోజయతే హితాయ)పాపాన్నించి రక్షించేవాడు, ఎప్పుడూ మనహితంకోరేవాడు, అవసరంలో సాయం చేసేవాడూ, రహస్యాన్ని దాచి ఉంచేవాడూ,మనలోని గుణాలని ప్రకటించేవాడు. వీరే ఆత్మీయమిత్రులు.

ఎవరు శత్రువులు?

వీరు రెండు రకాలు. ప్రత్యక్ష శత్రువులు,పరోక్ష శత్రువులు.వీరెప్పుడూ మన నాశనమే కోరతారు. ప్రత్యక్ష శత్రువునుంచి కాచుకునే ఉంటాం ఎప్పుడూ, మరి ఈ పరోక్ష శత్రువే ప్రమాదకారి. వీరితోనే జాగ్రత హెచ్చుగా అవసరం.

పైవారంతా తెలిసినవారే!

అయాచితులు, వీరెవరో తెలీదు, వీరికి మనకి సంబంధమూ ఉండదు, వీరు ప్రతిఫలాపేక్ష లేక సమయ సంధర్భాలూ, సాధ్యాసాధ్యాలూ, వేటినీ పట్టించుకోరు, మనం ఆపదలో ఉంటే గట్టెక్కే మాట చెప్పిపోతారు, చెప్పాలనిపించింది, చెప్పేశా! ఈబాపతనమాట.

వింటే ఏమిటి ఉపయోగం?

ఎవరే చెప్పినా వినడం అలవాటు చేసుకుంటే ముందుగా అలవడేది ఓపిక. ఆ తర్వాత అలవడేది సహనం. ఇదేమిటీ? చెప్పినవారంతా మనకి నచ్చినదే చెప్పరు.  నచ్చినది విన్నంతలో కోప్పడిపోయే అలవాటు తప్పి సహనం అలవాటవుతుంది. 

ఎవరేనా చెప్పడం మొదలుపెట్టగానే వీరు,బంధువులు,మిత్రులు,శత్రువులు,అయాచితులు అని వర్గీకరీంచుకోవద్దు. ఎందుకువద్దో తరవాత చెబుతా. శత్రువు మన శ్రేయస్సు కోరడు, వారినెందుకు వినాలి?   ఇది సందేహం. 

శత్రువును కూడా ఆపదనుంచి కాపాడుకోడానికి వాడుకోవాలి, చెప్పినదానిలో మనకు ఉపయోగపడేవాటిని తీసుకోవాలి. అదేగాక శత్రువు మనని ఎలా పక్కదోవ పట్టించాలని చూస్తుంటాడో తెలుస్తుంది. రాబోయే అడ్డంకులు ముందు తెలిసినట్టవుతుందిగా! అందుచేత శత్రువును తప్పక వినాలి. ఇక చుట్టాలెవరూ ఆపదలో కనపడరు, కొంతమంది కనపడచ్చు, వారు ఆత్మీయమిత్రుల కోవకి చెందుతారు.


ఇప్పటికి వినడమయిందిగదా! ఎవరు చెబుతారో,ఎందుకు చెబుతారో!  తరవాత వినినంతనె వేగపడక వివరింపదగున్.

వేచి చూడండి.    


17, నవంబర్ 2022, గురువారం

చస్తే చాలా ఖర్చు బతికుంటే పట్టేడు మెతుకులే ఖర్చు !

 చస్తే చాలా ఖర్చు బతికుంటే  పట్టెడు మెతుకులే ఖర్చు  !


జాతస్య మరణం ధృవం. పుట్టినవారు గిట్టకతప్పదు, చావుకూడా ఎప్పుడు,ఎక్కడ,ఎలా అన్నది కూడా తెలీదు.  చావు కూడా చాలా ఖర్చు తో కూడుకున్నదైపోయింది." చస్తే చాలా ఖర్చు బతికుంటే పట్టెడు మెతుకులే ఖర్చు  "  అన్నమాట పెద్దలనుండి ఎక్కువగా వినపడేది.


కలిగినవారింట చావు కూడా ఉత్సవమే! స్వతంత్రదేశంలో చావుకూడా పెళ్ళిలాటిదే బ్రదర్ అని ఒక సినీకవిగారిమాట. పదిమందితో చావూ పెళ్ళిలాటిదే అనే మాటా వినపడుతో ఉంటుంది మా పల్లెలలో. సామాన్యుల ఇళ్ళలోనే ఇబ్బందులన్నీ. స్వంత ఇల్లుంటే కొంత మేలు. !!అద్దె ఇంట ఉన్నవారైతే అదో నరకం.  నేటిరోజుల్లో అద్దె ఇళ్ళు వేరుగా లేనట్టే! అన్నీ అపార్ట్మెంటులే!! ఇక్కడే చిక్కులన్నీ! అపార్ట్మెంట్లో శవాన్ని ఉంచడానికి లేదని చెప్పేవారే ఎక్కువ. కామన్ ప్లేస్ లో కూడా ఉంచడానికి ఇష్టపడిని గేటెడ్ కమ్యూనిటీ లెన్నో! హాస్పిటల్ లో పోతే అప్పటికే తడిపిమోపెడు ఖర్చయి ఉంటుంది. మార్చురీలో శవాన్ని ఉంచడానికి, దాన్ని బయటికి తెచ్చుకోడానికి పడేవన్ని చెప్పుకోలేని తిప్పలు. మార్చురీలు లేనిచోట ఐస్ బాక్సుల్లో ఉంచడం కూడా ఖర్చుతో కూడిన పనే. ఇక పుట్టెడు పుల్ల లెక్క. దీని ఖరీదూ పెరిగిపోయింది. కొందరు ధర్మాత్ములు పుల్ల ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లూ ఉన్నాయి అక్కడక్కడ, పల్లెలలో. పట్నవాసాల్లో అన్నీ ఇబ్బందులే.శవాన్ని శ్మశానానికి తరలించడం కూడా ఖర్చుతో కూడినదైపోయింది. కొన్ని చోట్ల ధర్మ సంస్థలు,ధర్మాత్ములు ఉచిత వాహనాలు ఏర్పాటు చేసినవీ ఉన్నాయి. లేనిచోట అంతా ఖర్చే!


ఇటువంటి పరిస్థితులలో తల్లి,తండ్రి ఎవరిదైనా పార్ధివదేహాన్ని పంచభూతాలలో కలిపైడానికి అయ్యే ఖర్చు తక్కువలో తక్కువ పాతికవేలంటే నమ్మగలరా? పెళ్ళి కెళ్ళి తినో, తినకో, ఎంతో కొంత సొమ్ము ఇచ్చి వస్తున్నాం, చదివింపులని. మరి, చావులో సామాన్యుడు పడే బాధని ఇబ్బందిని మనమెవరం గుర్తించటం లేదు, సాయమూ చెయ్యటం లేదు. మనలో మార్పురావాలి, తప్పదు. ఆలోచించండి. ఈ కింది మెసేజ్ నాకు వాట్సాప్ లో ఒక మిత్రుని దగ్గరనుంచి వచ్చింది, అది అతని ఆలోచనే, నాకు నచ్చింది, మీరేమంటారు? 


Courtesy:Whats app


పన్నెండో తారీకున ఇంతదాకా రాశాను, నడకనుంచి తిరిగొచ్చిన తరవాత ప్రచురిద్దామనుకున్నా, కాని అనుకోని దుర్ఘటన జరగడంతో వెనకబెట్టేను. మర్నాడు మరణించిన వాకర్ కుటుంబానికి సహాయం చెద్దామని పెద్దలు నిర్ణయించడం, దానికోసం మా వాట్స్ ఆప్ గ్రూపులో మెసేజి ఇవ్వడం, వెంట వెంటనే సహాయాలు ప్రకటించడం,  ఆ సొమ్మును నేడు మా ఎమ్.ఎల్.ఎగారి చేతులమీదుగా ఒకలక్ష అరవైవేలు  చనిపోయినవాకర్ కుటుంబ సభ్యులకు అందించడం జరిగిపోయాయి. 

 ఇలా మన కుటుంబాలలో, గేటెడ్ కమ్యూనిటీలలో ఇతరత్రా కూడా చేసుకుని మనం సహాయ సహకారాలందిస్తూ బలపడాలి తప్ప, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎదురు చూసి మోసపోకుమా!