28, మే 2026, గురువారం

పాఠకదేవుళ్ళు-సందేహాలు.

 పాఠకదేవుళ్ళు-సందేహాలు.  

ఎవరో మెయిలిచ్చారు. ఈ టపాలో,కామెంట్లలో ఉన్న కొన్ని మాటల అర్ధం, వివరణ ఇవ్వండి, అన్నారు. ఆ మాటలేవో చెప్పలేదు. అనగా ఆ మాటలు నేనే కనుక్కొవాలి,వాటి అర్ధమూ నేనే చెప్పాలి,చిత్రం. మరో విశేషం సమాధానం ఇక్కడే బ్లాగులోనే చెప్పాలి,ఇది తియ్యటి ఆజ్ఞ,పాఠకదేవులది. వీలు వెంబడి చెబుతా,ముందు వాటిని వెతికి పట్టుకుని. 🤣😘 వేడి దంచుతో ఉంది మరి.

 

ఆ ప్రకారంబుగా టపాను,కామెంట్లను చదివినవాడనై సోచాయించితి కాని నాకెక్కడను కొత్తపదముల జాడ కనుపట్టనే లేదు. మరలనొకసారి జాగరూకుడనై టపా మొత్తము పదము పదముగా చదువగా రెండు నిత్యమూ వాడుకలో లేని పదములు కనుపట్టినవి. ఆపై కామెంట్లలో మరొకటిన్ని కనుపట్టినది,అవి ఈ విధముగానున్నవి.

1. కరారావుడు చుట్టడం.

2. గుంటబెట్టి గంట వాయించడం. 

3. నెత్తిన చేటగొట్టడం.

 వీటిని నానుడులని కూడా అంటారు. వీటిని మా పల్లెటూరివాసులు బహు రమ్యంగా వాడుతుంటారు,అందుకు అలా దొర్లిపోయాయనమాట సందర్భానుసారంగా. వీటిని వివరించమన్నారు గనుక. 


కరారావుడు చుట్టడం:- క కింద రవత్తిస్తే క్ర, ఈ రావత్తును వడి చుట్టడం అగా ముందుకు,వడిగా చుట్టడం,అంటే రవత్తును పూర్తిచేస్తే సున్నా అయింది. దీన్ని 'క్రావడి' చుట్టడం అనేవారు కాలంలో  సున్నా అని చెప్పడానికి గాను కరారావుడు చుట్టేసేరు అంటుంటారు. ప్రస్థుత  సందర్భం, " DMK కాంగ్రెస్ ను తమిల్నాట ఇకముందు  కరారవుడు చుట్టేసినట్టే". అంటే DMK ఇకముందు కాంగ్రెస్ కు తమిల్నాటు సున్న చుట్టేసినట్టే అని అర్ధం.  



గుంటబెట్టి గంట వాయించడం:- చనిపోయినవారిని తగులబెట్టడంగాని పూడ్చి పెట్టడంగాని చేస్తారు. భారత దేశంలో వైవిధ్యం ఎక్కువ. కొందరు తగులబెడితే కొందరు పూడ్చి పెడతారు. ఈ పూడ్చి పెట్టడం లోనూ తేడాలున్నాయి. కొందరు పడుకోబెడితే కొందరు కూర్చోబెట్టి ఖననం చేస్తారు. ఈ కూర్చోబెట్టి ఖననం చేసేవారిలో కూడా తేడలున్నాయి. కొందరు కొందరు కూర్చోబెట్టి పూడ్చేటప్పుడు గంట కొడతారు. గుంటబెట్టి గంట వాయించేరంటే ఖననం చేసేరని అర్ధం. ప్రస్థుత సందర్భం "ఇండీ అలయన్సును  గుంటబెట్టి గంట వాయించినట్టే" అంటే ఇండీ అలయన్సును ఖననం చేసినట్టే అని. 


నెత్తిన చేటగొట్టడం:- ఇంట్లోని దుమ్మును చీపురుతో ఊడుస్తారు,అదే చీపురుతో చేటలోకి ఎత్తుతారు. దుమ్ముతో ఉన్నచేటను బయట పారబోస్తూ చేత ఉన్న చీపురుతో చేటను కొడతారు,మిగిలినది కూడా పోవడానికి. ఇక ప్రస్థుత సందర్భం, "రాఘవఛద్దా కబుర్లు చెప్పి కేజ్రీవాల్ నెత్తిన చేటగొట్టి, మరో ఆరుగురుని కూడా తీసుకుపోయాడు,పోతే పోయేడు బి.జె.పిలో చేరిపోయాడు". రాఘవ ఛద్దా ఆమాద్మీ  పార్టీగుర్తు చీపురును పట్టుకుని  పార్టిలో ఉన్న దుమ్ము తుడిచి చేటలో ఎత్తి కేజ్రీవాల్ నెత్తిన చేటతో పోస్తూ చీపురుతో కొట్టినట్టు, తన కూడా ఉన్న మరో ఆరుగురుని కూడా తీసుకుపోయాడు,పోతే పోయాడు,బి.జె.పిలో చేరి పోయాడే అదికదా బాధ.      


ఇక్కడికీ అంకం  యినట్టేనా? 


మరో ముచ్చట, మరో పాఠకదేవులదే! దీనికి ఓ వారం ముందేమో, ఒకరు మెయిలిస్తూ మీ బ్లాగు టపాల పి.డి.ఎఫ్ పంపగలరన్నారు. ఏడుపే వచ్చింది, నా బ్లాగుటపాలు పుస్తకాలుగా వేసేను. కినిగేవారు వేసేరు,కొంత సొమ్మూ రావాలి, ఈ లోగా కినిగే మూసేసేరు,నా సొమ్ములూ రాలేదు,వారు కనీసం నా books పంపలేదు. ఇదే పాఠకదేవునికి విన్నవించా!

శలవు.        

25, మే 2026, సోమవారం

రోహిణీ కార్తె ప్రవేశ శుభకామనలు.

 రోహిణీ కార్తె ప్రవేశ శుభకామనలు.


ఈ రోజు రోహిణి ప్రవేశించింది. From May 1st.ఇప్పటి వరకు 40/45 డిగ్రీల వేడి మలమల మాడ్చింది. వేడిగాలులు వీచాయి. నేటి నుంది 44/48 మధ్య వేడి ఉంటుందని సూచనుంది తగినట్టుగానే నేడు 44/46 మధ్య వేడి దంచుతోంది.వేడి గాలులు వీస్తున్నాయి.  కరంటు ఉండడం మా అదృష్టం మీద ఆధార పడిఉంది. కరంటు వాళ్ళు మాత్రం మనుషులు కారా! వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? వేడికి జంపర్లు కాలుతున్నాయో,ట్రాన్స్ఫార్మర్లు పేల్తున్నాయొ!  మరో వారందాకా ఇంతేలా ఉంది. వారందాకా మా లాటి ఘటాలు ఉంటాయా? భగవదేఛ్ఛ.   

11, మే 2026, సోమవారం

రాష్ట్రాల ఎన్నికలు-రాజకీయాలు.

 రాష్ట్రాల ఎన్నికలు-రాజకీయాలు.


అసోం,ప.బంగాల్,తమిల్నాడు,పుదుచ్చేరి,కేరళం రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి,ఫలితాలూ వచ్చాయి. ఒక్కో రాష్ట్రరాజకీయం ఒకోలా వుంది,చూదాం,స్థూలంగా. 

 

అసోంలో ఎన్.డి.ఎ పరిపాలిస్తోంది,ఆ పార్టీయే మళ్ళీ 102/126 లో మెజరిటీలో ఉంది. ప్రతి పక్షంగా ఇండీ అలయెన్స్ కు 24/126 వచ్చాయి. కాంగ్రెస్ కలిసిన ప్రతిపక్షం,ఇక్కడ మరియు ప.బంగాల్ లో  ఎన్నికలు దొంగిలించబడ్డాయంటోంది. తాను మెజారిటీ సాధించిన చోట దొంగిలింపబడలేదా? అంటున్నారు,నెట్ జనులు🤣. ఇక్కడే రాజకీయంలేదు.  


ప.బంగాల్ లో స్వతంత్రం రాకముందూ రక్తపుటేరులు పారేయి.

https://rayssolassspace.quora.com/If-the-BJP-comes-into-power-in-Delhi-in-2025-will-Jawaharlal-Nehru-University-be-shut-down

https://india-and-the-world.quora.com/Revenge-of-Hindus-how-KOLKATA-was-saved-from-becoming-part-of-Pakistan-the-story-of-GOPAL-PATHA-Jinnah-chose-Kol

ఇప్పుడూ పారుతూనే ఉన్నాయి. ఇక్కడ ఎన్.డి.ఎ 206/294 సాధించింది, అధికారంలో ఉన్న మమత దీదీ నేనే నెగ్గేను,ము.మంత్రి పదవికి రాజీనామా చెయ్యనంటోంది. ఆ తరవాయి గవర్నరు  సభనే రద్దు చేసేరు,ఇక మమత రాజీనామా చేసిన మానినా ఒకటే! దీదీ పరిపాలనలో మాటాడటమే కాదు,వోటెయ్యడానికీ జనం భయ పడ్డారంటున్న వార్తలు మిక్కుటం. రక్తం పారింపుకు ఆదిగా సువేందు అధికారి పి.ఎ హత్య చేయుబడ్డాడు,ఎన్నికల తరవాత.  ఇక కలకత్తాలో రక్తం పారిన సంఘటనలు కోకొల్లలు. 


స్వతంత్రం తరవాత కాంగ్రెస్ పాలనలో మొటగా బి.సి.రాయ్ లాటివారు ముఖ్యమంత్రయితే చివరికి  సిద్ధార్థ శంకర్ రాయ్,(ఇందిరమ్మకి ఎమర్జన్సీ పెట్టమని సలహా ఇచ్చినవాడు) లాటివాడు CM.. ఆ కాలంలో ఆ రోజుల్లో పేపరు తీస్తే ఉదయమే కాంగ్రెస్ కార్యకర్తల హత్యలే కనపడేవి అలా కమ్యూనిస్టులు భయం సృష్టించి ప.బంగాల్ ని వశపరచుకున్నారు. 34 సంవత్సరాల పరిపాలనలో భయమే నెలకొంది. ఆపై కాంగ్రెస్, బాజపాయి ల సహాకారంతో మమత ప.బంగాల్ను స్వాధీన పరచుకుని కమ్యూనిస్టులను తలెత్తుకోనీయక0డా వారిపంధాలోనే పరిపాలన చేసి 15ఏళ్ళ తరవాత ఓడిపోయింది. ఇంతకాలంలోనూ ప్రజల రక్తంపారింది,భయోత్పాతమే సృష్టంపబడింది. ఇక ముఖ్యమ0త్రిగా ఎన్నికైన సువేందు అధికారి ఎన్.డి.యే పాలనలో ఎలా ఉంటుందో చూడాలి.


పుదుచ్చేరిలోనూ ఎన్నికలు జరిగేయి,కనుకలిగినట్టుగా. అక్కడ ముఖ్యమంత్రి ఎన్.రంగసామి సైకిల్ మీద తిరుగుతూ బడ్డీ కొట్టు దగ్గర టీ తాగి డబ్బులిచ్చి వెళ్ళే రకం. మళ్ళీ ఆయనే ఎన్నికయ్యాడు,మెజారిటీ వచ్చింది,మళ్ళీ ముఖ్యమంత్రీ అవుతాడు. ఈ రాష్ట్రమూ ఎన్.డి.ఎ కాతాలో ఉన్నదే!


తమిల్నాడులో ఎన్నికలు జరిగి డి.ఎం.కె ను మట్టికరిపించి మరో పార్టీని కూడా ఎ.ఐ.ఎ.డి.ఎం.కె ను కూడా అధికారానికి దూరంగా ఉంచారు. ఇక మూడో శక్తి టి.వి.కె నుకూడా అధికారానికి పూర్తిగా దగ్గరకు చేరనివ్వక మెజారిటీకి పదికి తక్కువగా సీట్లిచ్చి నిలబెట్టేరు. ఇక తమిల్ సినిమా కత మొదలయింది. ఎక్కువ సీట్లొచ్చాయి,మెజరిటీ లేకపోయినా నేనే ముఖ్యమంత్రి అంటాడు,ప్రమా స్వీకారం చేయించెయ్యండి, అన్నాడు. నిన్ను బలపరుస్తున్నవారి సంతకాలతో letters పట్టుకురావయ్యా అంటే మూడు సార్లు తిరిగాడు, పనికాలేదు. ఈలోగా గవర్నర్ను,బి.జె.పిని తిట్టుకున్నవారు కోకొల్లల్లు. చివరగా మద్దతు ఇచ్చిన MLAలు ఇద్దరున్న పార్టీ హిరణ్యాక్షవరాలతో మద్దతివ్వడంతో, నిన్న ప్రమాణ స్వీకారం జరిగింది, 13వ తారీకు లోగా సభలో మెజారిటీ నిరూపించుకోవాలి,ఇది గవర్నర్  తాకీదు. ఏమి జరగనుందో,చూడాలిసిందే! 

పెద్ద చిత్రం తమిల్నాట జరుగుతోంది. డి.ఎం.కె పనుపున CPI,CPM,IUML,CVK పార్టీలు అధికారకుర్చీ నాలుగుకోళ్ళులా మారాయి, విజయ్ పార్టీని, అధికార కుర్చీబలపరుస్తున్నాయి,ఇదెంతకాలం కొనసాగేనో! కాంగ్రెస్,CPI,సిపిఎం,సివికె   పైకి కుస్తీ లోపల దోస్తీ రాజకీయం జరుగుతోందా? ఎవరి తరఫున? ఇది బయటపడుతుంది,నెమ్మదిగా!!!   


ఇక చివరగా కేరళంలో ఎల్.డీ.ఎఫ్ ను దించి యు.డి.ఎఫ్ కు అధికారమిచ్చారు. ముఖ్యమంత్రెవరో దగ్గరగా పదిరోజులవుతున్నా అధికారానికొచ్చిన కాంగ్రెస్ తేల్చుకోలేకపోతోందంటున్నారు. 


ఇన్ని ఎన్నికలలోనూ జాతీయ పార్టీలకి జరిగిన లాభనష్టాలేమి? కొచ్చను. 

జాతీయ పార్టీలు బి.జె.పి,కాంగ్రెస్,సి.పి.ఐ,సి.పి.ఎం. చివరై రెండు పార్టీలు జాతీయపార్టీలా అంతర్జాతీయ పార్టీలో తేల్చుకోలేకపోయాను. బి.జె.పి. అసోం,పుదుచ్చేరిలను తననుంచి వదులుకోలేదు, ఇక ప.బంగాలు లో అధికారం చేజిక్కించుకుంది. ఇక tamilnaadu లో,కేరళంలో అధికారానికొస్తానని అనుకుని ఉండదు. 


కాంగ్రెస్ కు చెప్పుకోతగ్గ విజయం కేరళ. అసోంలో 24/126 ప్రతిపక్షం.   ప.బంగాలులో-2,తమిల్నాట-5 సీట్లు గెల్చుకుంది.కాంగ్రెస్ కి లాభం కంటే నష్టమే ఎక్కువ,దేశవ్యాప్తంగా.  తమిల్నాట అధికారకుర్చీ కోడుగా మారిపోవడమేకాదు,డి.ఎం.కె తనను మోసంచేసిందని తెగతెంపులు చేసుకుంది.DMK congress ను తమిల్నాట, ఇకముందు  కరారావుడి చుట్టేసినట్టే!  ఇక ఉత్తరాదిని ఎస్.పి ఆలోచనలో పడింది. ఇండీ అలయన్సును గుంటబెట్టి గంటవాయించినట్టే.   


ఇక సిపిఎం,సిపీఇ పార్టీలు.  సి.పి.ఎం ప.బంగాల్ లో-2 సాధించింది. తమిల్నాట-2 సాధించి తమిల్నాట అధికార కుర్చీకోడుగా మారిపోయింది,తమ సహచర సి.పి.ఐ-2 తో కలసి.   


 చిత్రం ఏమంటే ప.బంగాల్ లో పదిహేనేళ్ళుగా మమతపరిపాలనలో తృణమూల్ స్వాధీనం చేసుకున్న  కాంగ్రెస్,సి.పి.ఎం పార్టీలు తమ  ప్రాంతీయ ఆఫీసులను, (బి.జె.పి అధికారంలో కొచ్చిన తరవాత) తిరిగి  స్వాధీనం చేసుకుంటున్నట్టు వార్తలు.