Tuesday, 27 May 2025

నెహ్రూ పండితుడు కాలం చేసిన రోజు

 నెహ్రూ పండితుడు కాలం చేసిన రోజు. 


అప్పటి ఉద్యోగంలో చేరి మూడేళ్ళు. వేసిన వత్తికి పోసిన చమురుకి హాని హానిగా నడుస్తున్న రోజులు. ఈ బతుకింతే రేడియో కూడా లేదనుకుని బాధ పడుతున్నరోజులు. ట్రాన్సిస్టర్ లు బహు ఖరీదు మాట. సంసారంలో ఏం లేవు. అయ్యవార్లంగారి నట్టిల్లు. ఒ రేడియో షాపతను రేడియో ఇన్స్టల్మెంట్ లో అమ్మేవాడు,అదిన్నీ వాల్వు రేడియో, నాలుగొందలు. నెలకి ఇరవై చొప్పున తీర్చేందుకు ఒప్పుదల. ఇంటి మాస్టారు హామీ. ఆ మాస్టారికీ రేడియో లేదు, అంచేత,ఇంట్లో ఒక రేడియో ఉంటుందిలే అనుకున్నట్టున్నారు. ఓ చిన్న మాట కూడా తగిలించారు, రేడియో కరంటుకి రూపాయి అదనం, నెలకి అని చెబుతూ.  ఆ రోజుల్లో వార్త తెలియాలంటే రేడియో నే గతి.  ఇంట్లో రేడియో పెడితే అసలు గది కాళీ ఉండేదికాదు. ఇంటిల్ల పాదీ రేడియో దగ్గరే ఉండేవారు. ఎవరిని ఏం అనగలం, అందరూ ఇంటివారు,వారి పిల్లలు, మేము అక్కడే ఎక్కడో బిక్కు బిక్కుమని కాలక్షేపం చేసేవాళ్ళం.రేడియో కొనుక్కున కొత్త రోజులు. ఒక రోజు మధ్యాహ్నం అప్పుడే డ్యూటి నుంచి వచ్చి రెండు మెతుకులు తిని తలుపులేసుకుని రేడియో పెట్టి,గచ్చు మీద చల్లదనానికి పడుకున్నా. రేడియో పెట్టగానే విషాద సంగీతం వస్తోంది, ఏవరో బాల్చీ తన్నేసేరు, ఎవరబ్బా అనుకుంటూ లేచి కూచున్నా! ఈలోగా రెండయింది, ఇంగ్లీష్ వార్తలు మొదలయ్యాయి. నెహ్రూ గారి మరణవార్త వినిపించింది.హతవిధీ బారత్ కి దిక్కెవరు చర్చలు మొదలయ్యాయి.......  

15 comments:

  1. ఏదో పని మీద, ఇంకా టీనేజ్ లోనికి రాని నన్ను మా నాన్న గారు బజారుకు పంపారు. ఒక కొట్టు దగ్గర జనం పోగై ఉండటం చూసి అడిగితే నెహ్రూ గారి నిర్యాణం అని వార్త తెలిసింది. వెళ్ళిన పని వదిలేసి బాణం లాగా ఇంటికి పరుగెత్తి నాన్న గారికి వార్త చెప్పాను. వెంటనే రేడియో పెట్టి రెండుగంటల వార్తలు విన్నారు. (ఆ రేడియో కూడా కొన్ని నెలల క్రిందట కొన్నది. మా నాన్నగారి స్నేహితులు బాబులు గారు స్వయంగా చేసి యిచ్చారు వారికో రేడియోల కంపెనీ ఉంది.) అప్పట్లో నెహ్రూ గారి మీద ఆరాధనా భావం ఉండేది. తరువాత మెల్లగా పోయింది.

    ReplyDelete
    Replies
    1. @శ్యామలీయం నా ప్రశ్న మీకు కూడానూ...

      Delete
    2. మా యింట్లో నెహ్రూ గారి ఫోటో ఉండేది. దానిని చూసి చిన్నప్పుడు ఎన్ని సార్లు నకళ్ళు గీసానో గుర్తు లేదు. నెహ్రూ గారి గురించి ఎంతో చదివాను. గాంధీ గారి నిర్మాణకార్యక్రమం పుస్తకాలు బాగా చదివాను. ఇరవైలకు వచ్చేసరికి నెహ్రూ గారు మంచి వారే కాని పాలనాధక్షులు కారన్న అభిప్రాయం కలిగింది. కాశ్మీరం విషయంలోనూ చైనాతో దోస్తీ విషయంలోను నెహ్రూ గారి అమాయకత్వమూ కీర్తికాంక్షల వలన దేశం నష్టపోయిందనే భావన కలిగింది. పటేల్ బదులు నెహ్రూకు పాలన అప్పగించి గాంధీ పొరబడ్డారని అనిపించేది. ఇవన్నీ అప్పటి భావనలు. నేడు వీటి మీద నేను ఏమీ వ్యాఖ్యానించను. దయచేసి చర్చకు దిగకండి. ఎప్పటి కాలానికి తగినట్లుగా పరిస్థితులను బట్టి అప్పటి పాలకులు వర్తించారు. దేశప్రయోజనం ముఖ్యం అని మనకు తెలిసినది పాలకులకూ తెలియదా. కాని వాస్తవ జగత్తులో పాలకులు పట్టూవిడుపూ ప్రదర్శించక తప్పదు. వీధి చర్చల్లో ఏదైనా మాట్లాడవచ్చును. దాని కేమి.

      Delete
  2. శ్యామలీయం27 May 2025 at 14:12
    మొదటగా ఆ వార్త మధ్యాహ్నం రెండుగంటల వార్తలలోనే ఇండియాలో తెలిసినట్టుందండి,అధికారికంగా. అప్పటికే బి.బి.సి ప్రసారం చేసి ఉంటుంది.

    ఆరోజుల్లో చనిపోయినవారి గొంతు రేడియో వినిపించేది కాదు కారణం అడిగితే ఓ పెద్దాయన చెప్పేరు. జనాలు ఆయన ఇంకా ఉన్నారని భ్రమ పడతారని వినపడనిచ్చేవారు కాదట. నిజమెంతో తెలీదనుకోండి. అందుకే దాన్ని ఆ తరవాత కాలంలో ఆల్ ఇందిరా రేడియో అనే వారు.

    ఈ రోజు ఆయన్ని ఎవరూ తలుచుకున్నపాపానపోలేదు. మునిమనవడికి తీరుబడి ఉందో లేదో! ఒక అనామకం పేపరోడు మాత్రం నెహ్రూ కట్టిన ఇంటిలోనే భారత్ ఇప్పటికీ కాపరం చేస్తోందన్నాడు.

    సింధు జలాల ఒప్పదం, దీన్ని ఆరోజుల్లో సింధు జలాల పంపిణీ అని కూడా నేవారు. ఆ ఒప్పందంలో సింధు నదితో కలిపి ఆరు నదులు. సింధు,ఝీలం,చీనాబ్ పడమటివైపు నదులు:రావి,బియాస్,సట్లెజ్ తూర్పువైపు నదులు. తూర్పువైపు నదుల్లో 80 శాతం నీరు భారత్ వాడుకోవచ్చు. ఇక పడమటివైపు నదుల్లో 80 శాతం పాక్ వాడుకోవాలి.మిగిలిన జలాలు భారత్ వాడుకోవచ్చు. పడమటి నదుల్లో 80 శాతం తూర్పునదుల్లో 80 శాతం నీరు మాత్రం సమానం కాదు. ఇదీ నెహ్రూగారి బిక్షే! జయహో నేతా నెహ్రూ!

    ReplyDelete
    Replies
    1. ఆరోజుల్లో ఒక చిన్న ఊళ్ళో రేడియోలో బిబిసీ వినటం అనుమానమే నండి. ఇటువంటి వార్తలు రేడియోలో హఠాత్తుగానే వినిపించేవారు కదా. అలా వచ్చి ఉంటుంది వార్త. కొద్ది నిముషాల్లో రెండుగంటల వార్తలు మొదలైనాయి. నాకు ఇలాగే గుర్తుందండి

      Delete
  3. ఎందుకండీ చాచా గార్ని ఇలా ఆడిపోసుకుంటారు ?
    మీ కాలానికి ఆయన ఎంతో మేలు చేసేడు తన పరిధిలో కాదా ?

    ReplyDelete
    Replies
    1. Zilebi27 May 2025 at 20:18
      ఆడిపోసుకోడం తమ అలవాటు. ఆయన పరిధిలో చేయగలది చేసేరు కాదని ఎవరన్నారు? ఎందుకు భుజాలు తడుముకుంటారు?

      Delete
  4. గాంధీ వల్ల మనదేశం హిందూ రాజ్యం కాలేకపోయింది అనీ..
    నెహ్రూ వల్ల నదీజలాల పంపిణీలో పాకిస్తాన్ కి మేలు జరిగింది అనీ..
    ఇందిరాగాంధీ వల్ల యుద్ధంలో గెలిచినా Pok ని వెనక్కి తెచ్చుకోలేక పోయాం అని నేటి తరం రాజకీయ నాయకులు నాటుతున్న విషపు బీజాలు!!
    నిజానికి ఆనాటి ప్రాపంచిక, సామాజికి, భౌగోళిక పరిస్థితుల్లో అలా చేసి ఉండవచ్చు.
    సరే.. ఇదంతా చెపుతున్న వారు 5దేశానికి ఏం మేలు చేశారు అంటే చెప్పేందుకు ఏం కనపడదు

    ReplyDelete
    Replies

    1. jaya28 May 2025 at 08:03
      రెండు 80 శాతాలూ సమానం కాదన్నదే నేను చెప్పి ఒక్క నిజం. ఆ నిజం మిమ్మల్ని ఇంత బాధ పెడుతుందనుకోలేదు.

      Delete
  5. నెహ్రూ కాలంలో పుట్టిపెరిగిన మీకే ఆ చాచాజీ మీద కోపం కలిగేలా ఎవరైనా ప్రభావితం చేశారా.. లేక ఆయన చేసిన పనుల్లో కొన్ని పనికిరానివి అని మీరే నిర్ణయించుకున్నారా (అనుభవంతో)..

    అలాగే గాంధీజీ మీద కూడా ?

    ReplyDelete
    Replies
    1. jaya28 May 2025 at 14:16
      అసందర్భ ప్రశ్న

      Delete
    2. అవునవును అంతా మనమేదంటే అదే సరి
      ప్రశ్నిస్తే కోపానికి విశ్వామిత్రుడే తగడు

      Delete
  6. కష్టేఫలీ శర్మగారికి బేను చాయంగల విన్నపం ఒక్కటే - ఈ అసందర్భప్రలాపి జిలేబీని దేవిడీమనా చేసి - పిచ్చివ్యాఖ్యలకు జవాబులు ఇవ్వటం మాని - సుఖంగా ఉండండి - అని.

    ReplyDelete
    Replies
    1. ఇదే మాట బేనూ చాయించొచ్చాండీ శ్యామలీయం వారూ :)

      Delete
    2. శ్యామలీయం30 May 2025 at 16:23
      ధన్యవాదాలు. ఆ ప్రయత్నం లోనే ఉన్నానండి.

      Delete