జయహో భారత్
ఆపరేషన్ సిందూర్ తరవాత భారత్ నుంచి 7MP బృందాలు ప్రపంచం మొత్తమ్మీద పర్యటిస్తున్నాయి,భారత్ కి గత ఏడు దశాబ్దాలుగా టెర్రర్ తో జరుగు తున్న అన్యాయం చెప్పడానికి,ఆపరేషన్ సిందూర్ ని వివరించడానికిన్నీ. ఆ బృందాల్లో హేమాహేమీలున్నారు.అమెరికాలో పర్యటిస్తున్న బృందం లీడర్ శశి థరూర్ మాటాడుతూ నేను మా ప్రభుత్వం మాటాడిస్తున్నది చెప్పటం లేదు, మా దేశానికి జరుగుతున్న అన్యాయం గురించి మాటాడుతున్నానని నిప్పులు కక్కారు. అలాగే అసదుద్దీన్,కనిమొళి,సుప్రియ ఇలా అందరూ పాక్ మాలో మాకు మతపరమైన విభేదాలు కల్పించి టెర్రర్ ను కాపాడుకుంటూ మమ్మల్ని పాక్ ఇబ్బంది పెడుతోంది. మా దేశం టెర్రరిస్టులపై దాడి చేసింది తప్పించి పాక్ మీద కాదు. కాని పాక్ అది గుర్తించలేదు సరి కదా, టెర్రరిస్టులను వెనకేసుకొస్తూ మా మిలిటరీ మీద దాడి జరిపితే మేం తిప్పికొట్టేం తప్పించి మేము దాడి చేయలేదు. వారు మా పై కాల్పులు జరిపితే మేం జరిపేం. వారికి నష్టం ఎక్కువ జరిగి కాల్పుల విరమణకి జండా ఎత్తి మేం కాల్పుల విరమణకి అడిగినట్టు ప్రచారం చేసుకుంటోంది. ఇది గుర్తించండని చెప్పుకొచ్చేరనమాట. జయహో భారత్!
పాక్ సెనేటర్ సభలో మాటాడుతూ మనమీద నీటి బాంబు పడింది, దీనిని జాగర్త్తగా సరిచేసుకోకపోతే దేశంలో నూటికి తొంభై మంది ఆకలికి చావాలి అని సున్నితంగానే మందలించారు వారి ప్రబుత్వాన్ని. మరో చిత్రం మనదేశం పార్లమెంటు సభ్యుల బృందాల్ని విదేశాలకు పంపుతున్నట్టు తమరు కూడా ప్రయత్నం చేస్తున్నారు,ఇదీ కాపీయే. అన్నీ కాపీ,పేస్టు సరుకులే,స్వంత ఆలోచన ఉన్నట్టు లేనిదే!!
తాత గారి పొలో టీకాల్ కా మంట బావుంది :)
ReplyDeleteZilebi26 May 2025 at 10:55
ReplyDeleteఆ చెప్పేదేదో తిన్నగా చెప్పచ్చుగా
నేను చెబుతా విను.
ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఎం.పిలు పాకిస్తాన్ తో చెడుగుడు ఆడేసుకుంటున్నారు.
ఇలా డెలిగేషన్ లు పంపి సాధించేదేమని అడిగారో మేధావి.
టెర్రరిస్టులు పాక్ లో ఏ మూలనున్నా వెతికి వెతికి లేపెయ్యడానికి లైసన్స్,ప్రపంచ దేశాలనుంచి.
సింధుజలాలు లో మనవాటానీటిలో చుక్కకూడా వదలక వాడుకోవడం
వరదలు వగైరాల గురించి హెచ్చరికలు చెయ్యక్కరలేదు. వాటర్ బాంబు ప్రయోగమన మాట.
కొత్త ప్రాజెక్టులు పాక్ తో ప్రమేయం లేక కట్టుకోవచ్చు,ఇప్పటిదాకా చెప్పాలి,పాక్ వాటికి అడ్డుపడుతోంది,ఇప్పటి వరకున్నూ.
చాలా ముఖ్యం, మన ప్రాజెక్టులలో పేరుకుపోతున్న ఇసక నిలవల్ని ఎప్పటికప్పుడు కిందకి తోసెయ్యచ్చు,చెప్పక్కరలేదు, దానివల్ల వరదలొచ్చినా, మరేం జరిగినా భారత్ కి సంబంధం లేదు. నీళ్ళు అవసరమొచ్చినపుడే వదలాసిన అవసరం లేదు. ఇలా చేస్తే పాక్ లో కరువు ఖాయం, నాట్లు సమయంలో నీటి కరువు,పంట సమయం లో వరద. చాలు కడుపు కాల్చేసినట్టే!
చాలదా!!
శ్రీ మేన్ వినరా వారెక్కడ ?
ReplyDeleteZilebi26 May 2025 at 20:44
Deleteఇదివరలో ఉన్నచోటే ఉన్నారు.