ఆందోళన జీవి.
ఎలుక ఎప్పుడూ ఏదో ఒకటి కొరుకుతూనే ఉంటుంది, లేకపోతే చచ్చిపోతుంది. ఎలుక బతకాలంటే ఏదో ఒకటి నిత్యం కొరుకుతూనే ఉండాలి. ఎందుకలా ఇది గదా కొచ్చను.
ఎలుక దేన్నీ కొరకకుండా ఉండిపొతే పళ్ళు పెరిగిపోతాయి,ఎంతలా? దాని దవడలను పుళ్ళు పడేటంతగా. ఐతే ఏమవుతుంది? పుళ్ళు పడితే,పళ్ళు పెరిగితే ఏమీ తినలేదు,చనిపోతుంది, అందుకు నిత్యం ఏదో ఒకటి కొరుకుతూనే ఉంటుంది. ఎలక కొట్టని వస్తువు లేదు.
దీనికీ ఆందోళన జీవికి ఏంటి లింకు?
దుఃఖ భాగులు ఆరుగురు తెలుసుగా. ఇందులో నిత్య శంకితుడు,నిస్సంతోషి అనేవారిద్దరున్నారు. వారి కలయికతో పుట్టినవాడే ఆందోళన జీవి. ఈ ఆందోళన జీవి ఏదో ఒక దానిగురించి ఎప్పుడూ సంశయం వెలిబుచ్చుతూనే ఉండాలి,ఏదో ఒకదాని గురించి ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? ఈ కుళ్ళు అంతా మనసులో పేరుకుపోయి ప్రమాదానికి దారి తీస్తుంది.
అందోళన జీవి ఎప్పుడూ ఏడుస్తూనే ఉండాలి, ఎప్పుడేనా నవ్వినా పెద్దప్రమాదం తనకో,గ్రామానికో,జిల్లాకో,రాష్ట్రానొకో,దేశానికో వచ్చి తీరుతుంది. అందువలన,అందుచేత,అందుకొరకు ఆందోళనజీవి ఎప్పుడూ ఏడుస్తూనే,అరుస్తూనే ఉండాలి. అస్తు!
స్వస్తి!
లోకాః సమస్తాః సుఖినోభవంతు!