Saturday, 14 June 2025

కరోనా-నింబస్

 కరోనా-నింబస్


కరోనాకి వేరియంట్ ఒమిక్రాన్ అది కొంతకాలం పీడించింది. నెమ్మదిగా కరోనా తగ్గింది. జనాలు శ్వేఛ్ఛావాయులు పీల్చుకున్నారు. నాలుగేళ్ళయిందేమో, కరోనా మళ్ళీ మొదలయింది. ఇది ప్రపంచంలో అన్ని దేశాలను చుట్టుముడుతోంది. చిన్న దేశాలు తప్పించి మిగిలినవారు పలకటం లేదు. అగ్నేయాసియా దేశాల్లో జోరుగా వుంది. పశ్చిమదేశాల్లో బ్రిటన్,కెనడా, మొదలైన దేశాల్లోనూ అమెరికాలోనూ ఉంది. చైనా సంగతి తెలీదనుకోండి.  ఐక్యరాజ్య సమితివారు ఈ వేరియంట్ కి నామకరణం చేయలేదుగాని నింబస్ గా అనధికారికంగా పిలుస్తున్నారీ బుజ్జిని. 


దీని ప్రత్యేకతేంటీ అదిగదా  కొచ్చను. దగ్గు,రొంప,వగైరావగైరా అన్నీ మామూలే లచ్చనాలు. ప్రత్యేకతేమంటే గొంతులో కత్తులు  నూరినట్టుంటుందిట. (రేజర్ బ్లేడ్స్)అంటున్నారు. చాలా తొందరగా వ్యాప్తి చెందుతుందిట. మరణాలూ ఉన్నాయి. మనదేశంలోనూ ఉన్నది కాని బహు నెమ్మదిగా వ్యాపిస్తున్నది. మొత్తం దేశం మీద ఏడు వేల కేసులుంటే అందులో ఎక్కువ కేరళా,గుజరాత్,ఢిల్లీ, పశ్చిమ బంగ లో ఉన్నాయట. మిగిలిన దేశం మీద తక్కువే ఉన్నాయట. ప్రభుత్వాలు జాగ్రత్తలు  చెబుతున్నాయి,తీసుకోండి. మన ప్రాంతంలో సోకరాదనే నా అభిలాష.  సోకితే మందులు వేసుకుంటూ,  గొంతులో రేజర్ బ్లేడ్స్ అనిపిస్తే వేడి నీళ్ళలో రాళ్ళ ఉప్పు కరిగించి గోరువెచ్చగా ఉండగా గొంతులో పోసుకుని గరగరలాడించి,ఉమ్మేయండి. ఇది రోజుకి మూడు నాలుగుసార్లు పైగా చేయచ్చు. ఆపై నిప్పుల కుంపటి దగ్గర కూచోండి,  కొద్ది దూరంగా కాలకుండా. ఆపై కుంపటి  మీదకి వంగి నోరు బాగ తెరిచి వేడి  గొంతులోకి పోయేటట్లు కాచండి,గొంతును. చాలా శమనగా ఉంటుంది.  

ఆరోగ్యమస్తు. 

 

https://www.thehealthsite.com/news/covid-19-cases-in-india-live-updates-13-june-2025-new-coronavirus-variant-nimbus-nb-1-8-1-sparks-panic-with-razor-blade-throat-and-severe-symptoms-active-cases-1229923

9 comments:

  1. తాతగారు కరోనా జప తప యోగాలు వల్లిస్తున్నారు మల్లే వుంది పొద్దస్తమాను :)


    నారదా! ఏమి చెప్పవలె ఐడల్ మేన్ బ్రెయిన్ ఈజ్ ..... :)



    ReplyDelete
    Replies
    1. Zilebi16 June 2025 at 05:06
      ఇండియాలో కరోనా వేక్సిన్ వేయించుకున్నవారికి మళ్ళీ సోకటం లేదట. అప్పుడిక్కడే ఉన్నవుగా వేసిన్ పొడిపించుకున్నావు. అందుకే డేంజర్ జోన్ లో ఉండి కూడా చిలకపలుకులు పలుకుతున్నావు.
      నే చెప్పేది జనాలికి హెచ్చరిక. అది నా ధర్మం,చెప్పడమే నా ధర్మం,వినకపొతె నీకర్మం అన్నారో సినీకవి.

      Delete
    2. ओ अब्बो एमि गोप्पो इंडिया वेक् सीनु :)

      Delete

    3. Zilebi18 June 2025 at 23:59
      తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రకాలు నేడు భారత్ లో ఎక్కువైపోయాయి. ఇక్కడి వేక్సీన్ వేసుకుని ఆనందపడిన దేశాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. వారికి కృతజ్ఞత ఉంది. దేశం లో పుట్టిపెరిగి దేశం మీద విషం చిమ్మే రాకాలు చాలా కనపడుతున్నాయి. ఈ వేక్సిన్ వేసుకోకపోతే ఈ చిలకపలుకులొచ్చి ఉండేవే కాదు. మేం ఒక సంతాప సభ పెట్టుకునేవాళ్ళం. వేక్సీన్ గొప్ప మరోసారి మరో సారీ చెబుతా!!!!

      Delete
    4. మరో సారి యేల
      ఆ డబ్బా ఏదో ఇప్పుడే కొట్టొచ్చుకాదుటండీ తాతగారూ ?

      Delete
    5. Zilebi19 June 2025 at 21:11
      దేశం గొప్పతనాన్ని చెప్పుకోవడం డబ్బా కొట్టుకోవడంగా భావించే వారిది దేశ ద్రోహులదే చరిత్ర. భారత దేశంలో వీరి జనాభాయే ఎక్కువ. దేశం లోని వాక్సిన్ గురించిన గొప్ప మరొకసారి కాదు ఎన్నిసార్లైనా చెబుతాను. సందేహం లేదు.

      Delete

  2. నరసన్నగారు ! వ్యాఖ్యల
    కు రేడు! ఈ నడుమ మౌనకుహురమ్మున దా
    గిరదేల ? యెచట తాతా
    జి? రహస్యము బట్టబయలు చేయుడి కవిరాట్!



    ReplyDelete
    Replies
    1. Zilebi19 June 2025 at 00:07
      నరసింహారావు గారు కుశలం, ఇవేళ ఉదయమే పలకరించా! మౌనంగా ఎందుకున్నారో నాకైతే తెలియదు. మధ్యలో నా తడిక రాయబారమేల? తమరే అడగచ్చుగా వారిని, "మౌనమేలనోయి? ఈ మరపురాని చోట" అని .

      Delete
    2. కుశలంబదియే వెయ్యిన్నూట పదార్లు

      సేటు వంగి లో ఏమి‌ జరుగుతోందండి వినరావారు ?/ పొగ గుప్పంటోంది‌ ?


      Delete