అన్నీ..కొంచం..కొంచం..వార్తలు
ఋతుపవనాలు కరుణించలేదింకా. 40,41 మండుతూనే ఉంది. మరో నాలుగురోజులిలా అంటున్నారు.
**
కరోనా దేశాలన్నిటినీ చైనాను కూడా పట్టిపీడిస్తున్నట్టు వార్తలున్నాయి. మరి అమెరికా
,యూరప్ ల సంగతే తెలీదు. భారత్ లో కూడా కాలు పెట్టింది,కాలు పెట్టి వారంపైగా ఐనా నిన్నటికి కేసులు 6000 లకి చేరలేదు. ఇంకా ఎక్కువ కాల/నందుకు ఎర్ర పత్రికలు ఏడుస్తున్నాయి. పుట్టింటివారి చుట్టాలు,మహరాష్ట్ర,ఢిల్లీ లో మాత్రమే కేసులు ఎక్కువగా ఉన్నాయి.పుట్టింటివారి చుట్టాల రాష్ట్రంలోనే ఎక్కువున్నాయి. మరో బూస్టర్ డోస్ అవసరం లేదన్నట్టు వార్తలు. ఇదివరలో చేసిన వాక్సీన్ పని చేస్తున్నట్టుందని వార్తలు.
**
మరో పాథొజన్ పై ఒక చైనీయుడు అమెరికా యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్నాడు,చైనా నుంచి మొక్క తెప్పించుకుని. ఆ చైనీయుడి గర్ల ఫ్రెండ్ నఏనూ దానిమీద పరిశోధన చేస్తా అని ఆ మొక్కని చైనా నుoచి అమెరికా తెప్పించుకుంది. ఈ మధ్య చెకింగులు ఎక్కువయ్యాయై, అందునా యూనివర్సిటీ లపై,అమెరికాలో. ఇదేమి మొక్క వివరాలు తీగ లాగితే డొంక కదిలింది. ఈ పాథోజన్ ను మొక్కలపై ప్రయోగిస్తే ఆహార పదార్ధాలు పండించే అన్ని మొక్కలూ నెమ్మది నెమ్మది ఉత్పాదన తగ్గి, తరవాత చచ్చిపోతాయని తేలింది. దీంతో ఆ ఇద్దరిని పట్టుకుని అరస్టు చేసి తీగ లాగితే ఇద్దరూ చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యులని, గూధచారులు కావచ్చేమోనని అనుమానం.
**
గ్రేటా తన్ బర్గ్ గుర్తుందా? ఒకప్పుడు భారత్ ను అల్లరిపెట్టింది. ఇప్పుడు ఇస్రయెల్ ని అల్లరిపెట్టాలని బయలుదేరింది. ఇస్రయెల్ ఒకటే మాట చెప్పింది. ఇస్రయెల్ జలాలలోకి అనుమతింపబడని నౌక ఏదీ రాలేదు. వెనక్కి తిరిగిపో! గౌరవంగా ఉంటుంది. నువు తెచ్చే ఒక మూటా సరుకులు ఒకళ్ళికి కూడా సరిపోవు. కాదని మొండికేసి ముందుకొస్తావా? చేయవలసిన పని నా నౌకాదళం చేస్తుంది అని ఒక్కటే వారినింగ్ ఇచ్చింది...చూడాలి...
**
బీహార్,బెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కాంగ్రెస్ కి మళ్ళీ ఓటింగ్ మెషీన్ల భూతం పట్టుకుంది.
**
No comments:
Post a Comment