Cry of a police officer
నా పేరు శ్రీను నాయక్
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
అనపర్తి పోలీస్ స్టేషన్
తల్లిదండ్రులకు చేతులు జోడించి 🙏 నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా
****
క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు.
తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ద, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు.
క్రమశిక్షణ మాటలతో రాదు. కొద్దిపాటి దండన, భయభక్తులు ఉంటేనే వస్తుంది.
పిల్లలకి బడిలో భయంలేదు.
ఇంట్లో భయం లేదు.
అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకి గురి అవుతున్నది.
వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు.
అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు.
ఆ తర్వాత పోలీసు వారి చేతుల్లో పడి కోర్టులలో శిక్షలకి గురవుతున్నారు.
గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది.
ఇది నిజం.
గురువంటే భయం లేదు మరియు గౌరవం లేదు. ఇక చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది?
కొట్టొద్దు!తిట్టొద్దు! బడికి రానివాడ్ని ఎందుకు రావట్లేవు అని అడగొద్దు! చదవాలని, హోమ్ వర్క్ అని, కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు!
5వ తరగతి నుండే కటింగు స్టైలు, చినిగిన జీన్స్ గోడల మీద కూర్చోవడం. వెళ్ళే వారిని వచ్చే వారిని కామెంట్స్ చేయడం. అరేయ్ సార్ వస్తున్నారురా! అని అంటే, వస్తే రానియ్ అనే పరిస్తితి.
దరిద్రం ఏంటంటే, కొంతమంది తల్లి దండ్రులే మావాడు చదవకున్నా ఏమి కాదు, మావాడిని మాత్రం కొట్టవద్దు అంటున్నారు.
ఇంకొక విషయం ఏమిటంటే ఎవరు బాబు నీకు కటింగ్ చేయించినది అంటే మా నాన్న సార్ అంటున్నారు.
పెన్ను ఉంటే పుస్తకం ఉండదు,
పుస్తకం వుంటే పెన్ను వుండదు. కొనరు, తెచ్చుకోరు.
భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటునుంచి పోయి ఎటువస్తాదో అని భయం.
ఇవన్నీ చూస్తుంటే పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువగా వుంది.
కొట్టకుండా, తిట్టకుండా, భయం లేకుండా చదువు వస్తుందా...?
భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందంట!
అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం.
స్కూల్లో తప్పుచేసినా కొట్టకూడదు, తిట్ట కూడదు, కనీసం మందలించ కూడదు ప్రేమతో చెప్పాలట.
ఇదెలా సాధ్యమ్?
మరి సమాజం ఎందుకు అలా చేయదు? మొదటి తప్పేకదా అని ఊరుకుంటుందా?
మంచి నేర్పేవాళ్ళకి (స్కూల్లో) హక్కులుండవు. ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం. వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం.
తల్లిదండ్రులకు నా మనవి. పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయుల తోనే జరుగుతుంది. ఎక్కడో ఒకటో అరో ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు, అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు.
90 శాతం టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు.
ఇది యదార్ధం.
ఇకనైనా ప్రతీ చిన్న విషయానికి టీచర్లను నిందించవలదు.
మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని కొట్టేవారు.
అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు.
మా బాగు కోసమే అని అనుకునేవారు.
ముందుగా తల్లి దండ్రులు టీచర్ అంటే గౌరవం, భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలని మనవి.
తల్లి తండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిషత్ పై ఆలోచించండి..
పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఫోన్లు, మీడియా 60 % , కానీ 40% మాత్రం తల్లి దండ్రులే..!🙏
పిల్లల్ని గారాబం శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది.. పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢ నమ్మకాలు, స్వార్థం, అతి ప్రేమ వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తూ వారిని నాశనం చేస్తున్నారు.
ఇప్పుటి తరం 70% పిల్లలు..
👉తల్లిదండ్రులు కారు, బండి శుభ్రం మంటే తుడవరు.
👉మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు.
👉లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు.
👉కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు.
👉రాత్రి 10 గంటలలోపు పడుకుని, ఉదయం 6 లేదా 7 గంటలలోపు నిద్ర లేవరు.
👉గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెబుతారు.
👉తిడితే వస్తువులను విసిరి కొడతారు. ఎప్పుడయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ , నూడుల్స్, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు.
👉 మైనర్ పిల్లలకి బైక్లు ఇవ్వడం
వారు ఆక్సిడెంట్లకు చేయడం
కేసులలో ఇరుక్కోవడం
👉ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు.
👉ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి.
👉అతిథులు వస్తే కనీసం గ్లాసేడు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనలేని అమ్మాయిలు కూడా ఉన్నారు.
👉20 సంవత్సరాలు దాటినా చాలామంది ఆడపిల్లలకు వంట చేయడం రాదు.
👉బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడలేని కోపం వీరికి.
👉కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింత పోకడలు.
👉వారిస్తే వెర్రి పనులు.
👉మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు.
పై వాటికి కారణం మనమే. ఎందుకంటే మనకు అహం,పరువు మరియు ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి.
చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి. రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం.
గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..
వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది కష్టం గురించి తెలిసేలా పెంచండి.
కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు.
ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వలన కొందరు యువత 15 ఏళ్లకే ప్రేమ - దోమ అనటం,సిగరెట్స్, మందు, బెట్టింగ్, డ్రగ్స్, దొంగతనాలు, రేప్ లు, హత్యలు చేస్తున్నారు.
మరికొంతమంది సోమరిపోతులా తయారవుతున్నారు..
అభినయాలు కనపడడం లేదు, అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..
ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లి దండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..
భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..
మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం. కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం.
👉కాలేజీ పిల్లలయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫిన్, లంచ్ చిన్న బాక్సు రైస్.. చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు.
గర్భవతులైన తరువాత వారి బాధలు వర్ణనా తీతం. టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి. అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..
03వ తరగతి పిల్లాడికి సోడాబుడ్డి లాంటి కళ్ళద్దాలు.
05వ తరగతి వారికి అల్సర్, బీపీలు.
10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలొస్తున్నాయి..
వీటన్నికి కారణం మనం. మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచక పోవడమే. అందుకే తల్లి దండ్రులు మారాలి.
రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?
కేవలం గుడికి , దర్గా లకు వెళ్లి పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము. అది మాత్రమే కాదు.
సాంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు..
పిల్లలకు..👇
👉 బాధ్యత
👉 మర్యాద
👉 గౌరవం
👉 కష్టం
👉 నష్టం
👉 ఓర్పు
👉 సహనం
👉 దాతృత్వం
👉 ప్రేమ
👉 అనురాగం
👉 సహాయం
👉 సహకారం
👉 నాయకత్వం
👉 మానసిక ద్రృఢత్వం
👉 కుటుంబ బంధాలు
👉 అనుబంధాలు
👉 దైవ భక్తి
👉 దేశ భక్తి
కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి..
మంది కోసం బ్రతకద్దు మన ఆరోగ్యం, మన ఆనందం కోసం బ్రతుకుదాం.
ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..
భావితరాల పిల్లల కోసం ,పిల్లలను మార్చే బాధ్యత మన అందరిపై కలదు.
🙏చదివిన వారందరి విన్నపం...
దయచేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి
ఈ మేసేజ్ చదివి అందరూ మారిపోతారు అని నేను అనుకోవడం లేదు....
కనీసం ఒక్కరు అయిన మారుతారని ఉద్దేశంతో ఈ మేసేజ్ పెడుతున్నాను
ఇట్లు
*మీ శ్రీనివాస నాయక్
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అనపర్తి🙏🙏🙏*
Courtesy:Whats app
నా గోల:- టూకీగా మనం మారం,ఎవరు చెప్పినా.ఇంతే.
ఈయనెవరో మంచి పోలీసాఫీసరులా వున్నారు. వీరి లాంటి అధికారులు మున్ముందు మస్తుగా వచ్చి సమాజము బాగు పడుతుందని ఆశిస్తున్నాము.
ReplyDeleteZilebi6 February 2025 at 10:50
Deleteనీలాటి ఆందోళనజీవికి నచ్చిందంటే మా పోలీస్ ఆఫీసర్ కో సమాజానికో ఆపద పొంచి ఉన్నట్టే
ಮೀರತಿ ಸೂಕ್ಶ್ಮಗ್ರಾಹಿ ಅಂಡಿ :)
Deleteఆ ఇన్స్ పెక్టర్ గారు చెప్పినవన్నీ అక్షర సత్యాలు సార్. Valuable message 🙏🏻
ReplyDeleteబుచికి6 February 2025 at 21:14
ReplyDeleteమనది"సొతంత్ర బారద్దేశం" కదండీ ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు. ఇంగా ఏ గొట్టంగాడు మీరు పోలీసా? మోరల్ పోలీసా అని ఆయన్ని అడిగనట్టులేదు.
చదివినోళ్ళంతా మా ఎసై గారు బాగా రాసారన్నారుగాని, అమలు చేద్దామన్నవాళ్ళొక్కళ్ళూ అవుపడలేదండి. సమాజం ఎలా బాగుపడద్దండి?
పేమిలీ ప్లానింగ్
ReplyDeleteదీన్ని మరిచి , ఏదేదో మాటాడుకుంటున్నారు .
ఒహరో , ఇద్దరో పిల్లలు
అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు
ఇంతకు ముందు గుంపెడు
అమ్మా కూతురూ - అత్తా కోడలూ కడుపుతో
ఉండేవారు
బళ్ళో పంతులు తంతే
ఇంట్లో పెద్దవాళ్ళు తన్నేవారు
ఉమ్మడి కుటుంబాలు
పెద్దల చేతుల్లోనే రూపాయికి కరువు
ఇప్పుడో
పిల్లల చేతుల్లో వందలు
పంతులు దండిస్తే - రైలో బస్సో ఎక్కేస్తున్నారు
తల్లిదండ్రులకు దిక్కుతోచడంలేదు
ప్రభుత్వాలూ , విద్యాలయాలూ , సమాజం
బాధ్యత తప్పించుకుని
పాపం తల్లి తండ్రులను దూషించడం
అన్యాయం సార్
రాజారావు గారి మాట అక్షర సత్యం.
Deleteవెంకట రాజారావు . లక్కాకుల7 February 2025 at 11:41
Deleteసార్! మీరు చెప్పినట్టు రూపాయకి కరువు దాకా నిజం సార్. ఆపైన ఒక్కడే కొడుకైతే ఏడుపు ఎలాగైనా తప్పనిదే కనక ముందు జాగర్త పడమని, పోలిస్ వారి మాట. సమస్య పోలీస్ దాకా చేరిందంటే ఎంత ముదిరిందో గుర్తించండి. ఆయన కొన్ని చెప్పేలేదు,బాగోదని మానేసారు. మీరూ నేను చాలా పాతకాలంలో ఉండిపోయాం. ఇప్పుడు మగపిల్లలికిగాని ఆడపిల్లలకిగాని చెప్పలేం. ఊరుకుని ఉండడమంత ఉత్తమం మరొకటి కనపట్టం లేదు, అలా ఉంటేనే రోజులు గడుస్తున్నాయి.తల్లి తండ్రులకి డబ్బు,హోదా పిచ్చి లేదా అమెరికా పిచ్చి. ఇక్కడపిల్లలని అమెరికా కోసమే కంటున్నారు,పెంచుతున్నారు. డాంకీ రూట్ లో ఐనా అమెరికా చేరుకోవాలి. అలా అమ్మా బాబుల్ని వదిలేసి ఇక్కడ అమెరికాపోయినవాళ్ళ ఇళ్ళు మూడున్నాయి,మా వీధిన. అందులో జాయ లేక పతి జారిపోతే ముసలాళ్ళు చూసే దిక్కులేక, పొద్దుట పనిమనిషికి పలికితే ఉన్నట్టు లేకపోతే పోయినట్టుగా ఉంది, కాలం. ఏమో సార్! ఏం కానుందో చెప్పడం కష్టంలా ఉంది.
Zilebi7 February 2025 at 16:19
Deleteనీలా ఏ రోటికి ఆ పాటపాడే కట్ పేస్టు,కాపీ పేస్టు ప్రొఫెసర్లు (CP professors)పెరగబట్టే ఇలా తయారయింది. మొన్న బెంగాల్ లో జరిగింది చెబుతా. ఒక ప్రొఫెసర్ ఫస్ట్ యియర్ కుర్రాడితో తాళి కట్టించుకుండి,క్లాసు రూంలో. వీడ్యో వైరల్ ఐంది. ఇదేంటని అడిగితే అప్లయిడ్ సైకాలజీ పాఠంలో భాగం అని చెప్పింది. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి ఉద్యోగం వదిలేసుకుపోతానని బెదిరిస్తోంది. నన్ను అల్లరి పెట్ట్డానికే ఇదంతా అంటోంది. ఓ ప్రొఫెసరూ నీలాటి వాళ్ళ మూలంగానే ఈ సమాజం భ్రష్టు పట్టిపోతోంది.
అమెరికాలో లాగా తయారు అవుతుంది . అమెరికాలో పై చెప్పినవన్నీ ఉన్నా బుద్ధిమంతులుగా చదువుకుని పైకొచ్చే వాళ్ళు ఉన్నారు . చివరికి జరుగుతున్నది జరిగేదేమిటంటే మిగతా వాళ్ళు దాదాపు అందరూ ఆ బుద్ధిమంతుల క్రింద పని చెయ్యాల్సి వస్తుంది . అప్పుడు తెలిసొస్తుంది , మన కర్మ ఇల్లా కాలినదేమని . అప్పుడు ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉండదు .
ReplyDeleteRao S Lakkaraju8 February 2025 at 01:31
Deleteసార్! పులిని జూసి నక్క వాత పెట్టుకున్నట్టుంది సార్ మా బతుకు. మీ దేశం వేరు,మా దేశం బతుకు వేరు. చేతులు కాలేకా ఆకులు కూడా దొరకవు సార్,మా దగ్గర,నేటి కాలంలో. వీళ్ళు ఏమైపోతారో కూడా చెప్పడం కష్టంలా ఉంది. సమాజం మీరిక్కడ పుట్టి పెరిగిన కాలంలో ఉన్నట్టు లేదు సార్. ఊహించలేని, ఊహించడానికి కూడా సాధ్యం కానన్ని మార్పులు వచ్చేసేయి. మాలాటి వాళ్ళం చూసి కూడా నోరు నొక్కుకుంటున్నాం, మాటాడితే మా బతుకేమోనని.
// “ఆ బుద్ధిమంతుల క్రింద పని చెయ్యాల్సి వస్తుంది. “ //
ReplyDeleteఏమనుకోకండి లక్కరాజు వారూ. ఓ తెలుగు సినిమా సంభాషణ గుర్తొచ్చి, ఇక్కడ వ్రాయకుండా ఉండలేక పోతున్నాను. సరదాగా తీసుకోండి.
—————
చాలాకాలం తరువాత ఊరికి తిరిగొచ్చిన హీరో తన చిన్ననాటి స్నేహితులను మనవాళ్ళంతా ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఒకతను జవాబిస్తాడు - ఆఁ, ఏముంది, చదువురాని వాళ్ళు స్కూళ్ళు మొదలెట్టారు, చదువుకున్న వాళ్ళు వాటిల్లో టీచర్లు అయ్యారు.
నిజానికి ఇది కూడా ఓ జీవిత సత్యమే 🙂🙂.
(అలా అని భ్రష్టు పట్టిపొమ్మని నేననడం లేదండోయ్.)
—————-
విన్నకోట నరసింహా రావు8 February 2025 at 08:59
Deleteమీ మాటకి చిన్నూసు,ఏమనుకోవద్దూ!
క్లాసులో వెనక బెంచీ వాళ్ళు రాజకీయనాయకులయ్యారు. మధ్య బెంచీలవాళ్ళు,గుమాస్తాలు,ఉద్యోగస్తులూ ఇలా వారివారి స్థాయిలబట్టి అయ్యారు.ఆ పైవారు వ్యాపారస్థులయ్యారు. ఆపైవారు దిగువస్థాయి ఆఫీసర్లయ్యారు. మొదటి బెంచీ వాళ్ళు అయ్యా ఎస్ లయ్యారు ఈదండి మన చరిత్ర. ఇదెప్పుడూ మారదు. ఐతే ఈ మధ్య 2000 సంవత్సరం దరిదాపునించి అమెరికా జ్వరం పట్టుకుంది. మొదటి బెంచిలో సగం అమెరికాకి,మిగిలినవాళ్ళలో కొందరు ఇండస్ట్రీకి,మిగిలినవాళ్ళు గవర్నమెంటు సార్!
తాతగారికి లోకమంతా బ్లాక్ గా కని పిస్తున్నది.
Deleteఆ ఆఫీసరు లాంటి మంచి మనుషులున్నంత వరకు దేశానికి ఢోకా లేదు.
( తాతాగారూ నైరాస్యము వలదు)
విన్నకోట వారూ : నేను చదువుకునే రోజుల్లో ఇంత పెద్దగా ఆలోచించలేదు . మంచి స్టూడెంట్స్ తోటి స్నేహం చేసే వాడిని . వాళ్ళతోపాటే ముందర బెంచీలో కూర్చునే వాణ్ని . అలా గుంపులో గోవిందంగా కొట్టుకు వచ్చేశాను .
Delete