Tuesday 5 March 2024

తనకి లేదని ఏడిస్తే

తనకి లేదనిఏడిస్తే


తనకి లేదనిఏడిస్తే ఒక కన్ను ఎదుటివాడికి ఉందనిఏడిస్తే రెండో కన్ను పోయాయి.   ఇదొక నానుడి.


ఎలక్టరల్ బాండ్లు లో సొమ్ములిచ్చేవారెవరో తెలియాలి,తెలియకపోవడం సరికాదు అని సుప్రీం కోర్టుకుపోయారు, కొందరు. కోర్టు విచారించి,బాండ్లు చెల్లవు,సొమ్ములు వెనక్కిచ్చేయాలని తీర్పిచ్చింది. అంతా సంతోషం వెలిబుచ్చారు.


రాహుల్ జీ మాటాడుతూ క్రవుడ్ ఫండింగ్ చేస్తామన్నారు, మంచిమాటే! ఏమయిందో తెలీదు,దాని ఊసేలేదు మళ్ళీ. ఎన్నికలు తరుముకొస్తున్నాయి. నిన్న మోడీజీ భాజపా కి పార్టీ ఫండ్ గా రెండు వేలిస్తూ నిధికోసం పిలుపిచ్చారు. ఇచ్చే సొమ్ము నమో ఆప్ ద్వారా ఇవ్వచ్చనీ చెప్పేరు. పార్టీ వివరాలిస్తూ ఐదు రూపాయలనుంచి సొమ్మివ్వచ్చుననీ బహుమతులూ ప్రకటించింది. సామాన్యుడు కూడా ఇప్పుడు నిధికి సొమ్మిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రతి పక్షాలకి, ఇది ముల్లుతీసి కొఱ్ఱు కొట్టుకున్న చందమయిందా? ఏమో కాలమే చెప్పాలి.


అన్ని పార్టీలకి చేతిదాకా వచ్చిన సొమ్ములు వెనక్కిపోయాయి. ఇప్పుడన్నీ ఏం చేయాలో దిక్కుతోచకున్నట్టే ఉంది. 


దీనిపైన కూడా కోర్టుకుపోతారేమో! చూడాల్సిందే!!!


తనకు లేదని ఏడిస్తే ఒకకన్ను ఎదుటివాడికి ఉందని ఏడిస్తే మరో కన్నుపోయినచందమైపోయిందా? అనుకుంటున్నారు ప్రజలు.

https://www.hindustantimes.com/india-news/pm-modi-contributes-rs-2-000-to-bjp-urges-donations-for-nationbuilding-101709458181903.html


No comments:

Post a Comment