దొందూ దొందే!!!
ఒకకొత్తగా పెళ్ళయిన జాయ,పతి. ఇద్దరూ కలసి ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో నది దాటాల్సి వచ్చింది. పడవెక్కి, ప్రయాణం తరవాత దిగేరు. నది ఒడ్డు ఎక్కుతూ తలపైకెత్తి చూస్తే, ఒడ్డున విరగబూసిన చింతచెట్టు కనపడింది ఇద్దరికీ,
పతి అసంకల్పితంగా
తింతతెట్టు పూసిందే అన్నాడట!
చింతచెట్టు పూసిందే అన్నమాట.
దానికి జాయ మాటకలుపుతూ
తాతే పూతే తాలానికి తాయదా? పూయదా? అందట.
కాచే పూచే కాలానికి కాయదా?పూయదా అని ఆమె మాట.
ఒకరికి "చ"పలకదు,మరొకరికి "క" "చ" రెండూ పలకవు.
ఇది విన్న పడవ సరంగు దొందూ దొందే!అన్నాడు.
ఇద్దరూ ఇద్దరే అన్నమాట. ఇతని "ఇ", "ర", ఒత్తులు పలకవు.
ఈ చిన్ని కతని సరదాగా చెప్పుకుంటూ ఉంటారు. ఇది మేధావుల పరంగా ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం, ఒకరిని మరొకరు ఉత్పేక్షాలంకారలో పొగుడుకుంటూ ఉంటారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి